ఆసియా కప్ లో టీమ్ ఇండియా x పాకిస్థాన్

Publish Date:Aug 22, 2025

Advertisement

ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్  దాయాది దేశాల క్రికెట్ జట్ల మధ్య మరో పోరుకు వేదిక కానుంది. త్వరలో జరగనున్న ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో భాగంగా టీమ్ ఇండియా, పాకిస్థాన్ జట్ల తలపడను న్నాయి. ఇరు దేశాల మధ్యా సత్సంబంధాలు లేని కారణంగా ఇంత కాలం అంతర్జాతీయ టోర్నీలలో అంటే ఐసీసీ ఈవెంట్లలో తప్ప ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక మ్యాచ్ లు జరగడం లేదు. ఆయితే అసలు ఇక అంతర్జాతీయ టోర్నీలలో కూడా ఇరు దేశాల జట్లూ తలపడే అవకాశం ఉండదన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.

ఔను.. పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఇరు దేశాల మధ్యా యుద్ధం తప్పదా అన్న పరిస్థాతి ఏర్పడింది. దాడులు, ప్రతి దాడులూ కూడా జరిగాయి. ఆపరేషన్ సిందూర్ తో భారత్.. పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలను అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేసింది. ఆ తరువాత పాకిస్థాన్ కాళ్లా వేళ్లా పడటంతో కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించింది. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ తో అన్ని రకాల సంబంధాలనూ తెంచేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్ తో తలపడాల్సిన పోటీని భారత్ బహిష్కరిస్తుందన్న వార్తలు గట్టిగా వినిపించాయి. రాజకీయపార్టీలు, సామాన్య ప్రజలే కా దు.. క్రికెట్ అభిమానులు సైతం పాకిస్థాన్ తో మ్యాచ్ వద్దంటే వద్దని గట్టిగా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్ తో తలపడాల్సిన మ్యాచ్ ను టీమ్ ఇండియా బహిష్కరించడానికే ఎక్కువ అవకాశాలున్నాయన్న భావన సర్వత్రా వ్యక్తం అయ్యింది.

ఈ నేపథ్యంలో భారత క్రీడా మంత్రిత్వ శాఖ తాజాగా చేసిన ప్రకటన భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ విషయంలో క్లారిటీ ఇచ్చింది. పాకిస్థాన్ తో ఎటువంటి క్రీడా సంబంధాలకూ తావులేదని స్పష్టం చేసిన మంత్రిత్వ శాఖ అయితే అంతర్జాతీయ ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మల్టీ నేషనల్ ఈవెంట్ల విషయంలో ఈ నేషేధం ఉండదన్న క్లారిటీ ఇచ్చింది.

అంటే ఆసియా కప్ లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్లు తలపడేందుకు ఎటువంటి ఆటకం లేదని స్పష్టం చేసింది. దీంతో సెప్టెంబర్ 14న ఆసియా కప్ లో భాగంగా టీమ్ ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. దీంతో ఈ మ్యాచ్ పట్ల ఇరు దేశాలలోనే కాకుండా.. క్రికెట్ ఆడే దేశాలన్నిటిలోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. టోర్నీ ఏదైనా, వేదిక ఏదైనా భారత్, పాక్ మధ్య మ్యాచ్ అంటే అదో హైటెక్ మ్యాచే. యుద్ధం జరుగుతోందా అన్నంత ఉత్కంఠ నెలకొంటుంది. ప్రపంచ వ్యాప్తంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ పట్ల ఆసక్తి వ్యక్తమౌతుంది. అసలు ఇరు జట్ల మధ్యా మ్యాచ్ ఉందంటేనే అది టోర్నీకే ఒక అదనపు ఆకర్షణగా మారుతుంది. 

By
en-us Political News

  
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్‌ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్‌ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‍కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు. ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు. 
మోకిల నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
Publish Date:Jan 7, 2026
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చ‌క్రం తిప్పారు. క‌విత ఎడ్యుకేటెడ్ కావ‌డం,  హిందీ కూడా బాగానే మాట్లాడ‌గ‌ల‌గ‌డంతో జాతీయ స్థాయి ప్ర‌తినిథిగా ఉండేవారు. అయితే క‌విత రెండో సారి ఎంపీగా గెల‌వ‌లేక పోయారు
ఖమ్మంలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.