హిండెన్‌బర్గ్ క‌థేంటి... అసలు ఏం జ‌రిగింది?

Publish Date:Jan 16, 2025

Advertisement

ఏ సంస్థ అయినా ఇక చాలు కావలసినంత సంపాదించేశాం అనుకుంటుందా? ఇంత సంపాదించేశాను, ఇక కంపెనీని మూసేస్థానని ఏ వ్యాపారవేత్తైనా చెబుతారా? అన్న ప్రశ్నకు అమెరికాకు చెందిన ఇన్వెస్ట్ మెంట్ రీసెర్చ్ కంపెనీ హిండెన్‌బర్గ్ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్  తాను అలాగే చెబుతాను, అదే చేస్తాను అంటున్నారు. ఆ కారణంగానే తాను హిండెన్‌బర్గ్ ను మూసేయాలని నిర్ణయించానని చెబుతున్నారు. అయితే హిండెన్‌బర్గ్ మూత ప్రకటన మార్కెట్ వర్గాల్లో సంచలనం సృష్టించింది. నాథన్ అండర్సన్  మూసివేత ప్రకటనపై పరిశ్రమ వర్గాల స్పందన మిశ్రమంగా ఉంది. హిండెన్‌బర్గ్ మూతపడకపోతే మునిగిపోతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 

అమెరికాకు చెందిన ఇన్వెస్ట్ మెంట్ రీసెర్చ్ కంపెనీహిండెన్‌బర్గ్ పేరు వినగానే ఎవరికైనా ఠక్కున గుర్తొచ్చే పేరు అదానీ. హిండెన్‌బర్గ్ నివేదికల కారణంగా అదానీ సంస్థ భారీగా నష్టపోయింది.  అదానీ గ్రూప్  మనీలాండరింగ్, సెక్యూరిటీ ఫోర్జరీ వంటి నేరాలకు పాల్పడిందంటూ 2023లో హిండెన్‌బర్గ్ నివేదిక వెలువరించింది. ఆ దెబ్బకు అదానీ మార్కెట్ విలువ భారీగా పతనమైంది. ఆ ఏడాది అదానీ సంపద దాదాపు లక్ష కోట్లు ఆవిరైంది. ఆ తరువాత మళ్లీ కోలుకుందనుకోండి అది వేరే సంగతి. ఇక్కడ చెప్పుకోవలసిందేమిటంటే హిండెన్‌బర్గ్ ఫేమస్ అయ్యింది మాత్రం అదానీ గ్రూపు అవకతవకలపై విడుదల చేసిన నివేదిక ద్వారానే. 

అప్పట్లోనే హిండెన్‌బర్గ్ అదానీ గ్రూపు లక్ష్యంగా వెలువరించిన నివేదిక వెనుక ఏదో మతలబు ఉందన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి.  ఇప్పుడు ఉరుములేని పిడుగులా హిండెన్‌బర్గ్ మూసివేత ప్రకటన ఆ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. హిండెన్‌బర్గ్ షార్ట్ సెల్లింగ్ వ్యూహాలతో లాభాలను ఆర్జిస్తుంది. అందులో బాగంగానే ఇప్పటి వరకూ అదానీ సహా 36 కంపెనీలపై తన రీసెర్చ్ డాక్యుమెంట్లను విడుదల చేసింది. ఆ గ్రూప్ ప్రతికూల నివేదికలే విడుదల చేసింది. ఆ నివేదికల కారణంగా ఆయా కంపెనీల మార్కెట్ విలువ భారీగా పతనమయ్యాయి.  సందట్లో సమేమియా అన్నట్లుగా హిండెన్‌బర్గ్ సంపాదన పెంచుకుంది.

అయితే షార్ట్ సెల్లర్లు  ఎన్నడూ స్థిరమైన లాభాలను ఆర్జించలేరు. దీర్ఘ కాలంలో వాటికి రాబడి ఉండదు. అన్నిటికీ మించి ఇలాంటి షార్ట్ సెల్లింగ్ సంస్థలు గ్రే జోన్ లో పని చేస్తుంటాయి. ఒక కంపెనీని టార్గెట్ చేసుకుని పని చేస్తుంటాయి. అన్నిటికీ మించి వాటిపై నిఘా నియంత్రణ సంస్థల గురి ఉంటుంది. విచారణలు ఎదుర్కొనాల్సి ఉంటుంది. తప్పుడు మార్గాల ద్వారా అసంబద్ధ నివేదికలు వెలువరించినట్లు రుజువైతే భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లోనే హిండెన్‌బర్గ్ మధ్యే మార్గంగా మూసివేత ఒప్పందానికి వచ్చి ఉంటుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

ఇక అన్నిటికంటే ప్రధానంగా  ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టనుండటమే హిండెన్‌బర్గ్ మూతకు కారణం. ఎందుకంటే అదానీ గ్రూప్ సంస్థలపై హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలు, అభియోగాలకు సంబంధించి పూర్తి వివరాలు, డాక్యుమెంట్లు సిద్ధం చేయాలని అధ్యక్ష పగ్గాలు చేపట్టకముందే ట్రంప్ ఆదేశాలు ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకు ఇప్పటికే న్యాయశాఖ పని ప్రారంభించింది. దీంతో హిండెన్‌బర్గ్ తన నివేదికల హేతుబద్ధతను నిరూపించుకోవాల్సి ఉంటుంది. లేదా బోనులో నిలబడాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో నాథన్ అండర్సన్  సంస్థ మూసివేత ప్రకటన   పలు అనుమానాలకు తావిస్తోంది.  షార్ట్ సెల్లింగ్ వ్యాపారంలో లాభార్జన కోసమే ఉద్దేశపూర్వకంగా కంపెనీల అవకతవకలపై నివేదికలు వెలువరిస్తుంటుందన్న ఆరోపణలు హిండెన్‌బర్గ్ పై ఉన్నాయి. ఒక్క అదానీ గ్రూపే కాకుండా హిండెన్‌బర్గ్ ఇప్పటి వరకూ దాదాపు 36 కంపెనీల్లో జ‌రుగుతున్న మోసాల‌ను బ‌య‌ట పెట్టింది. ఆ నివేదికల కారణంగా అయా కంపెనీల మార్కెట్ విలువలు భారీగా పతనమయ్యాయి.  

ఇక మరో కథనం ఏమిటంటే హిండెన్‌బర్గ్ ఒక పావు మాత్రమేనని  అదానీపై నివేదిక తరువాత భారత పార్లమెంటు వేదికగా  అధికార ప్రతిపక్ష పార్టీలు ఆదానీకి మద్దతుగా, వ్యతిరేకంగా మోహరించడమే ఇందుకు తార్కానమని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. హిండెన్‌బర్గ్ వెనుక ఒక కమ్యూనిస్ట్ నాయకుడి సతీమణి, జర్నలిస్ట్, నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇండియా పేరున నడిచే ఒక స్వస్చంద సంస్థ, వామపక్ష భావజాలాన్ని ప్రచారం చేసే ఒక వెబ్‌సైట్ ఉన్నాయనీ, వీటన్నింటికీ అజీమ్ ప్రేమ్‌జీ నడిపే స్వచ్చంద సంస్థ ఐపీఎస్ఎంఎఫ్ నిధులు సమకూరుస్తుందని  ఆర్ఎస్ఎస్ అధికార పత్రికఆర్గనైజర్‌ కథనం  పేర్కొంది. ఇన్ని రకాలుగా హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికలపై అనుమానాలు ముప్పిరిగొన్న వేళ ఆ సంస్థ మూసివేత ప్రకటన సంచలనం సృష్టించింది.  హిండెన్‌బర్గ్ మూసివేత ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే   అదానీ పవర్ షేర్లు 9 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ టోటల్ గ్యాస్ షేర్లు 7శాతం మేర పెరగడం కొసమెరుపు.

By
en-us Political News

  
తాజాగా ఉత్తరాంధ్ర జిల్లాలలో పర్యటిస్తున్న నాగబాబు ఆదివారం శ్రీకాకుళంలో జనసేన నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ఎన్నికలలో తన పోటీ గురించి వచ్చిన ప్రస్తావనపై స్పందించిన ఆయన తాను మాత్రం ఎన్నికలలో పోటీ చేసే ప్రశక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
తెలుగుదేశం సీనియర్లు, అందులోనూ కమ్మసామాజికవర్గానికి చెందిన దిగ్గజాలను అంబటి పరామర్శించడం వెనుక లెక్కలేంటి? ఊరకరారు మహానుభావులు అన్నట్లు అంబటి రాక వెనుక పొలిటికల్ ఈక్వేషన్లు ఏంటన్నది ఇప్పడు హాట్ టాపిక్‌గా మారింది.
తమిళనాడులో బీజేపీ ఎన్ని జన్మలు ఎత్తినా అధికారంలోకి రాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ మాజీ నేత, తెలంగాణ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత ఎఫెక్ట్ బీఆర్ఎస్ పై ప్రతికూలతకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరీ ముఖ్యంగా సరిగ్గా పంచాయతీ ఎన్నికల వేళ కవిత చేపట్టిన జనజాగృతి యాత్ర ప్రభావం బీఆర్ఎస్ ఓటింగ్ పై తీవ్ర ప్రభావం చూపిందంటున్నారు.
ఈ సూసైడ్ విన్న‌ర్స్ అంటే ఏంటి? ఈ పంచాయితీ ఎన్నిక‌ల్లో వెలుగులోకొచ్చిన కొత్త ప‌దం ఇది. సంగారెడ్డి, రాయికోడ్ మండ‌లం, పిప‌డ్ ప‌ల్లిలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన రాజు ఉదంతంతో ఈ పదం పుట్టుకొచ్చిందని చెప్పొచ్చు.
కీలక సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాకపోవడంపై ఎందుకు రాలేదు అని చర్చ రాజకీయంగా జరుగుతోంది. సాధారణంగా ముఖ్యమంత్రి జరిపే ఇలాంటి సమావేశాల్లో మంత్రిగా ఉన్న వ్యక్తి కచ్చితంగా హాజరవ్వాలి. కానీ పవన్ కళ్యాణ్ మాటా- మంతి పేరుతో తన శాఖకు సంబంధించి సమావేశం పెట్టుకున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
3,911 గ్రామాల్లో పోలింగ్‌ జరుగుతోంది. మొత్తం 12,782 మంది సర్పంచ్‌ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే.. 38,350 వార్డులకు గాను 108 వార్డులకు నామినేషన్లు రాలేదు. మరో 8,307 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మరో 18 వార్డుల్లో ఎన్నికల నిర్వహణపై స్టే ఉన్నది. దీంతో మిగిలిన 29,917 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి.
తొలి నుంచీ కూడా ఈటల బీజేపీలో ఇమడడానికి ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఆయన పార్టీలో ఉక్కపోతను భరిస్తూనే కొనసాగుతున్నారని ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు. ఇప్పుడు తాజాగా మరో సారి ఆయన హర్టయ్యారు.
ఈ పోలింగ్ కోసం కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం అధికారులు ఇప్పటికే ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఇకపోతే.. రెండో దశలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి పట్టణాలలో నివసిస్తున్న ప్రజలు తమ స్వగ్రామాలకు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
వైసీపీ కార్పొరేటర్ కరీముల్లా టీడీపీలో చేరారు.
నెల్లూరు మేయ‌ర్‌ ఎన్నికల్లో నెంబ‌ర్ గేమ్ మొద‌లైంది.
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరో వివాదంలో చిక్కున్నారు.
జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, టీ న్యూస్‌లకు లీగల్ నోటీసులు పంపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.