అప్పుడే రోళ్లు పగులుతున్నాయి!

Publish Date:Mar 15, 2025

Advertisement

తెలంగాణలో ఎండలు మండి పోతున్నాయి. ఎప్పుడో మే చివరి వారంలో రోహిణీ కార్తె సందర్భంగా రోళ్లు పగిలే ఎండలు కాస్తాయి అని చెప్పుకోవడం మనకు తెలుసు. అయితే ఈ సారి మాత్రం మార్చి రెండో వారంలోనే రోళ్లు పగిలే స్థాయిలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఇప్పుడే 40 డిగ్రీలు దాటేశాయి.

ఆదిలామాద్, నిజామాబాద్ జిల్లాల్లో 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. మరో ఐదు  రోజుల పాటు రాష్ట్రంలో హీట్ వేవ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా వాతావరణ శాఖ ఆదిలాబాద్, జగిత్యాల, నిజామాబాద్, కొమురం భీమ్, మంచిర్యాల జిల్లాలలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

వడ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించింది.  అలాగే హైదరాబాద్ నగరంలో కూడా సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. ఈ నెల 20వ తేదీ వరకూ రాష్ట్రంలో ఇదే వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. మార్చి 20 తరువాత రెండుమూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లో పది జాతీయ రహదారులు విస్తరణకు నోచుకోనున్నాయి. రోడ్లపై వాహన రద్దీతో పాటు మున్ముందు మరింత ట్రాఫిక్‌ పెరిగే అవకాశం ఉందని గుర్తించడంతో వాటి విస్తరణపై కేంద్రం దృష్టిపెట్టింది.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ పార్టీ సంస్థాగత ఎన్నికల అధికారి, రాజ్యసభ సభ్యుడు పి.వి. సత్యనారాయణ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్‌ను ఆదివారం రిలీజ్ చేశారు.
తిరుమలలోని GNC టోల్ గేట్ సమీపంలో ఒక కారు అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తూ, ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు.
కొంత మంది ఎమ్మెల్యేల పనితీరు మారాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మంగళగిరిలోని తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లకు ఆయన దిశానిర్దేశం చేశారు.
గత జూన్ 12 వ తేదీన, అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు, రూ.500 కోట్లతో, ఎఐ 171 ట్రస్టును ఏర్పాటు చేయాలని టాటా సన్స్, నిర్ణయించింది.
నెల్లూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనారోగ్యంతో బాధపడుతున్నాడు. జులై 6 న మంత్రి లోకేశ్ నెల్లూరుకు వస్తున్న నేపథ్యంలో ఆదుకోవాలని కార్యకర్త లోకేష్‌కి విజ్ఞప్తి చేశారు
మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి చంపేస్తామని బెదిరింపు కాల్ వచ్చింది. మరికాసేపట్లో చంపేస్తామని.. ఆపరేషన్ కగార్ ఆపాలని బెదిరించినట్లు తెలుస్తోంది.
కేంద్ర పసుపు బోర్డు కార్యాలయాన్ని నిజామాబాద్‌ వినాయక్‌నగర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మాజీ సీఎం కేసీఆర్ క్షమించినా యెల్లో మీడియాను మేము వదిలిపెట్టమని మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు
ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో 24 గంటల పాటు చార్ ధామ్ యాత్రను నిలిపేశారు.
ఏపీ లిక్కర్ స్కాం.. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అంశం ఇది. గత ప్రభుత్వం మద్యం కుంభకోణంలో కోట్లాది రూపాయలు దొడ్డిదారిన స్వాహా చేసి బినామీ కంపెనీలు.. హవాలా మార్గంలో తెచ్చుకుని ఎన్నికలకు వినియోగించారనేది సిట్ విచారణలో వెలుగులోకి వస్తున్నాయి
ఈ క్యూఆర్ కోడ్ క్యాంపెయిన్ మెయిన్ మోటో అంటే ఏంటంటే.. రీకాలింగ్ ఆఫ్ చంద్ర‌బాబు మేనిఫెస్టో. దీన్ని కొత్త‌గా నిర్వ‌హించాల‌ని థింక్ చేసిన జ‌గ‌న్ అండ్ కో.. స్వామి కార్యం స్వ‌కార్యం చ‌క్క‌బెట్టే య‌త్నం చేస్తోంద‌ని అంటున్నారు.
యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో కీలక మలుపు మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్వేచ్చ సుసైడ్‌కి కారణమన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్ రాత్రి 11 గంటలకు న్యాయవాది సమక్షంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిరు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.