కిరణ్ కుమార్ రెడ్డిపై వేటు వేస్తే

Publish Date:Feb 6, 2014

Advertisement

 

కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనను నిరసిస్తూ నిన్న డిల్లీలో దీక్ష చేయడంతో ఆయనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం రేపు రాజ్యసభ ఎన్నికలు పూర్తవగానే, ఆయనను ముఖ్యమంత్రి పదవిలో నుండి తప్పించబోతోందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవిభజన ప్రకటన చేసినప్పటి నుండి ఆయన ఏదో ఒక రూపంగా తన నిరసనను తెలియజేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఆయన క్రమశిక్షణ గల కాంగ్రెస్ నాయకుడని కాంగ్రెస్ పెద్దలే స్వయంగా కితాబులు ఇస్తూ వచ్చారు తప్ప ఏనాడు క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. ఆ తరువాత కేంద్రప్రభుత్వం పంపిన టీ-బిల్లుకి వ్యతిరేఖంగా ఆయన శాసనసభలో తీర్మానం చేయించినప్పుడు కూడా ఆయనపై ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవలసిన అవసరం లేదని చెప్పిన కాంగ్రెస్ అధిష్టానం, ఇప్పుడు డిల్లీలో దీక్ష చేసినందుకు ఆయనను పదవిలో నుండి తొలగించాలనుకొంటే, అసలు ఆయన దీక్ష చేయకుండా ముందే ఎందుకు అడ్డుకోలేదనే ప్రశ్నకు సమాధానం చెప్పవలసి ఉంటుంది.

 

కాంగ్రెస్ అధిష్టానం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే సమయంలో ఆయన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరితో కలిసి డిల్లీలో నిరసన దీక్ష చెప్పట్టబోతున్నారనే సంగతి ఆయన అనుచరుల ద్వారా ప్రకటిస్తూనే ఉన్నారు. ఆయన దీక్ష చేసినట్లయితే అది తనకు తీరని అప్రదిష్ట కలిగిస్తుందని తెలిసి ఉన్నపటికీ, కాంగ్రెస్ ఆయనను అడ్డుకొనే ప్రయత్నం చేయలేదు. కనీసం పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ వంటి తన విధేయులను కూడా వారించలేదు. వారించి ఉంటే దీక్షలో ముఖ్యమంత్రి ఒంటరివారయ్యే వారు. ఆయనే అవమానం పాలయ్యేవారు. కానీ కాంగ్రెస్ వారించలేదు. అందుకే అధిష్టానానికి విదేయులయిన కేంద్రమంత్రులు, యంపీలు, శాసన సభ్యులు, చివరికి పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణతో సహా అందరూ దీక్షలో కూర్చొన్నారు.

 

రాష్ట్ర విభజనపై మాట్లాడేందుకు కాంగ్రెస్ అధిష్టానమే వారికి స్వేచ్చ ప్రసాదించిందని ఇంతకాలం గొప్పగా చెప్పుకొన్నప్పుడు, ఇప్పుడు వారు దీక్ష చేసి నిరసన తెలియజేస్తే మాత్రం ఎందుకు ఆగ్రహించాలి? ముఖ్యమంత్రి నిరసన దీక్ష చేసి పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారని, పార్టీకి అప్రదిష్ట కలిగించారని కాంగ్రెస్ అధిష్టానం భావించి ఆయనపై వేటు వేయదలచుకొంటే మరి పార్టీ పరువు కాపాడవలసిన పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణతో సహా దీక్షలో పాల్గొన్న సీమాంధ్ర నేతలందరిపై కూడా వేటు వేయవలసి ఉంటుంది. కానీ, వారందరినీ అడగకుండానే క్షమించేసి, కేవలం ముఖ్యమంత్రిపైనే వేటు వేస్తే, ఆయనని, కాంగ్రెస్ అధిష్టానాన్ని అనుమానించక తప్పదు.

 

పార్టీ తరపున నిలబడిన రాజ్యసభ సభ్యుల గెలుపుకోసం కిరణ్ కుమార్ రెడ్డి చేసిన కృషి అధిష్టానం పట్ల ఆయన విధేయతకు అద్దం పడుతోంది. అటువంటి వ్యక్తిని ఇప్పుడు ఈ సాకుతో పదవిలో నుండి తప్పిస్తే, అది ఆయనకు శిక్షగా కాక సమైక్య చాంపియన్ గా ఎదిగేందుకు బహుమానం ఇస్తున్నట్లుంది. రాష్ట్ర సమైక్యత కొరకు తన అధిష్టానాన్నే ధిక్కరిస్తున్న కారణంగా ప్రజలలో జేజేలు అందుకొంటున్న కిరణ్ కుమార్ రెడ్డిని, పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదం పొందక మునుపే పదవిలో నుండి తప్పించినట్లయితే, ఆయన బిల్లు ఆమోదం పొందేవరకు కూడా కేంద్రంపై తీవ్ర పోరాటం చేసి ప్రజలలో మరింత మంచి పేరు తెచ్చుకోవడానికి వీలవుతుంది. అప్పుడు ఆయన కొత్త పార్టీ పెట్టుకొని ప్రజలలోకి వెళితే దాని ఫలితం ఏవిధంగా ఉంటుందో ఊహించుకోవచ్చును. సీమాంధ్రలో కాంగ్రెస్ వ్యతిరేఖ ఓటు కిరణ్ కుమార్ రెడ్డి ఖాతాలోనే జమా అవ్వాలంటే, అందుకు ఇదే మంచి పద్ధతి.

By
en-us Political News

  
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
2026 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. సెక్షన్ 87A కింద రిబేట్ కలిపి.. వీరికి వెస‌లుబాటు ఉంటుంది. స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ విష‌యానికి వ‌స్తే.. జీత‌భ‌త్యాలు పొందేవారికి ఇచ్చే స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ ప్ర‌యోజ‌నాలు ఈ కొత్త విధానంలో కూడా కొన‌సాగుతాయి.
సుమారు వెయ్యి కోట్ల సామ్రాజ్యాన్ని ఆయ‌న త‌న కుమారుడు గౌత‌మ్ సింఘానియాకు రాసిచ్చాక‌.. ప‌డ్డ పాట్లు వ‌ర్ణ‌నాతీతంగా వ‌ర్ణించారు ముఖ్య‌మంత్రి.
నారా లోకేశ్ రేపోమాపో పూర్తిస్థాయిలో చంద్రబాబునాయుడి రోల్ పోషించే పరిస్థితి లేకపోయినా, యువనేత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి గ్రౌండ్ ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. లోకేశ్ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయించడానికి నారా, నందమూరి కుటుంబాలతో చంద్రబాబు అతిత్వరలో సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్ కూతురు విద్యారాణి తండ్రి అంత సంపాదిస్తే చందాలేసుకుని మ‌రీ చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్లాల్సిన దుస్థితి ఏంటి?
అమరావతికి, అక్కడి ప్రజలకు వైసీపీ ఎన్నడూ వ్యతిరేకం కాదంటూ మాట్లాడారు. గతంలో తాము వ్యతిరేకించినది చంద్రబాబు నాయుడు చూపించిన గ్రాఫిక్స్ రాజధానే అంటూ సన్నాయినొక్కులు నొక్కారు. అప్పట్లో చంద్రబాబు చేసిన ఊహాజనిత సృష్టినే తాము వ్యతిరేకించామనీ, గ్రాఫిక్స్ అమరావతిపైనే అప్పటి తమ అభ్యంతరాలనీ చెప్పుకొచ్చారు.
మడమ తిప్పను, మాట తప్పను, విశ్వసనీయతకు నిలువెత్తు రూపం అంటూ గతంలో పదేపదే చెప్పుకున్న జగన్ ఇప్పుడు.. నిత్యం అసత్యాలను వల్లెవేస్తూ.. విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారంటున్నారు.
గ‌త ఎన్నిక‌ల్లో అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌వితను అరెస్టు చేయ‌కుంటే ఈ రెండు పార్టీల మ‌ధ్య లోపాయికారీ ఒప్పందం ఉన్న‌ట్టేనని జ‌నం అనుకుంటారని అన్నారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి. ఈ కామెంట్ ఎంత‌గా ప‌ని చేసిందంటే రేసులో సెకండ్ ప్లేస్ లో ఉన్న‌.. బీజేపీని థ‌ర్డ్ ప్లేస్ లో ప‌డేసింది. చావుతప్పి క‌న్ను లొట్ట‌బోయిన‌ట్టు.. బొటాబొటిగా 8 మంది ఎమ్మెల్యేల‌తో స‌రిపెట్టుకుంది బీజేపీ.
పెరిగిన జనాభాకు అనుగుణంగా అసెంబ్లీ, లోక్ సభ స్థానాలను పెంచాలన్న డిమాండ్, ప్రతిపాదనా చాలా కాలంగా ఉంది. అంతే కాకుండా నియోజ‌క‌వ‌ర్గం ఎంత చిన్న‌గా ఉంటే.. ప్ర‌జా ప్ర‌తినిధులు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అంత వేగంగా ప‌రిష్క‌రించ‌గ‌లుగుతారు. ఇక ప్రస్తత నియోజకవర్గాల పెంపు ప్రతిపాదన దాదాపు 30శాతం ఉంది. ఇది భారీ మార్పు అనే చెప్పాలి. అలాగే ఇందు కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఆ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది.
ప్రధాన ప్రతిపక్షం అయ్యుండీ ఎన్నికల సన్నాహాల విషయంలో ఇంత నిర్లప్తంగా, నిరాసక్తంగా వ్యవహరించడంతో పార్టీ క్యాడర్ లో అయోమయం నెలకొంది. ఎన్నికలంటేనే స్టార్ క్యాంపెయినర్ల పర్యటనలు, అగ్రనేతల ప్రసంగాలతో నానా హడావుడీ చేసే కాంగ్రెస్ లో ప్రస్తుతం నమ్మశక్యంకాని నిశ్శబ్ధం తాండవిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.