గజదొంగ వికాస్ సింగ్ అరెస్టు.. అంతరాష్ట్ర దొంగల ముఠా గుట్టు రట్టు

Publish Date:Jun 4, 2026

Advertisement

వికారాబాద్ జిల్లాలో రాత్రి వేళల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ అంతరాష్ట్ర దొంగను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసు బయటపడటంతో మొత్తం జిల్లాలో సంచలనం నెలకొంది. నిందితుడు వికాస్ సింగ్‌ను వికారాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని మీడియా ముందు ప్రవేశపెట్టారు. 

గత నెల 5న వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికంఠ నగర్‌లో జరిగిన చోరీ ఈ కేసుకు కీలక మలుపు అయ్యింది. రాత్రి సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చొరబడి సుమారు ఒకటిన్నర తులాల బంగారం, అలాగే 2,10,000 రూపాయల నగదు అపహరించారు. ఉదయం ఇంటి యజమాని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రారంభంలో ఇది సాధారణ చోరీగా అనిపించినా, దర్యాప్తు సాగిన కొద్దీ ఇది అంతరాష్ట్ర దొంగల ముఠా పని అని తేలింది. పోలీసులు సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలించగా, అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని గుర్తించారు. అతనే కరడు గట్టిన నేరచరిత్ర కలిగిన వికాస్ సింగ్ అని నిర్ధారించారు.

తరువాత పోలీసులు టెక్నికల్ సర్వైలెన్స్ ఆధారంగా అతని కదలికలను ట్రాక్ చేసి రైల్వే స్టేషన్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన తర్వాత వికాస్ సింగ్‌ను గట్టిగా విచారించగా,  షాక్ ఇచ్చే విషయాలు బయట పడ్డాయి.  వికాస్ సింగ్ 16 ఏళ్ల వయస్సులోనే నేర ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. చిన్న చిన్న దొంగతనాలతో మొదలైన అతని క్రైమ్ జర్నీ తరువాత భారీ చోరీల వరకు వెళ్లింది. గతంలో సంగారెడ్డి, బొల్లారం ప్రాంతాల్లో మొత్తం 34 కేసుల్లో అతని పేరు నమోదై, జైలు శిక్ష కూడా అనుభవించినట్లు ఎస్పీ తెలిపారు.అయితే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మరింత పద్ధతిగా క్రైమ్ మోడల్‌ను రూపొందించినట్లు దర్యాప్తులో తేలింది. వికారాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పరిధిలో గత నెల 27 రాత్రి నుంచి వరుసగా ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. రాత్రి వేళల్లో మాత్రమే ఆపరేషన్ చేస్తూ, తాళం వేసి ఉన్న ఇళ్లనే ఎంచుకోవడం అతని ప్రత్యేకతగా గుర్తించారు.ఇంకా ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, దొంగతనాల ద్వారా సంపాదించిన సొత్తును వికాస్ సింగ్ కేవలం ఖర్చు చేయడమే కాకుండా,  హెల్పింగ్ హ్యాండ్స్  పేరుతో ఒక ఎన్జీవోను ప్రారంభించినట్లు విచారణలో బయటపడింది. బయటకు సామాజిక సేవా సంస్థలా కనిపించినా, లోపల మాత్రం దొంగతనాల సొత్తు మళ్లించడానికి ఉపయోగించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక ఈ కేసులో మరో కీలక కోణం కూడా బయటపడింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బంగారు నగల వ్యాపారులు శ్యామ్ మోసెస్, సూరజ్ మోహన్, అశోక్ సోనీ, వికాస్ అగ్రహారి వంటి వారు వికాస్ సింగ్‌ను దొంగతనాలకు ప్రోత్సహించడంతో పాటు అతనికి తుపాకీ కూడా సమకూర్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇది కేసును మరింత తీవ్రమైన అంతర్రాష్ట్ర క్రిమినల్ నెట్‌వర్క్ వైపు మళ్లించింది.పోలీసులు వికాస్ సింగ్ వద్ద నుంచి దొంగిలించిన బంగారంతో పాటు ఒక తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నారు. అతనికి సహకరించిన నెట్‌వర్క్ మొత్తం బయటకు తీసే దిశగా దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ స్నేహ మెహ్రా స్పష్టం చేశారు. ఈ కేసు ఇప్పుడు కేవలం ఒక దొంగతనం కేసుగా కాకుండా, అంతరాష్ట్ర గ్యాంగ్ నెట్‌వర్క్ దిశగా దర్యాప్తు సాగుతోంది

By
en-us Political News

  
ఏపీలో కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతున్నట్టే 108 అంబులెన్స్ సర్వీసులూ లక్షలాదిమందికి ప్రాణదాతగా నిలుస్తూ సమర్థతను చాటుకుంటున్నాయి.
సినీ రంగంలో నటుడిగా, అద్భుతమైన కొరియోగ్రాఫర్‌గా, విలక్షణ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ చుట్టూ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
భాష్యం విద్యాసంస్థల చైర్మన్‌గా సుపరిచితులైన భాష్యం రామకృష్ణ.
ఒడిశా రాష్ట్రంలో వెలుగుచూసిన ఒక ప్రభుత్వ ఇంజనీర్ అవినీతి ఉదంతం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
కూకట్‌పల్లి మంజీరా మాల్‌లోని కింగ్ & క్వీన్స్ పబ్ రాత్రి సాధారణంగా హడావుడిగా ఉండే ప్రదేశమే.
గతంలో కంప్యూటర్లు కొత్తగా వచ్చినప్పుడు కూడా ఇలాంటి భయాలే వ్యక్తమయ్యాయి. కంప్యూటర్లు వస్తే అకౌంటెంట్లు, క్లర్కుల ఉద్యోగాలు పోతాయని అంతా భావించారు. కానీ వాస్తవంగా జరిగిందేమిటి? కంప్యూటర్ల వల్ల పాత ఉద్యోగ పద్ధతులు మారాయి తప్ప ఉద్యోగాలు తగ్గలేదు.. సరికదా మరిన్ని అవకాశాలు వచ్చాయి. సాఫ్ట్‌వేర్ అనే రంగం తెరమీదకు వచ్చింది. కోట్లాది మందికి సరికొత్త ఉపాధి లభించింది.
గచ్చిబౌలిలోని ఓ ఎలైట్ కోలివింగ్‌లో ఒక యువతి తన జీవితానికి చివరి అధ్యాయం రాసుకున్నది.
బీఆర్‌ఎస్ నేత సురేష్ రెడ్డి ఇంట్లో భారీ చోరి జరగడం తో హైదరాబాద్ సనత్ నగర్ జెడ్ కాలనీ ఇప్పుడు ఒక్క సారిగా చర్చల కేంద్రంగా మారింది.
ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తన రష్యా పర్యటనను యథావిధిగా కొనసాగించాలని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. డ్రోన్ల దాడుల వార్త వెలువడే సమయానికి ఆయన మాస్కో నుండి సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు ప్రయాణిస్తున్నారు. అక్కడ నెలకొన్న భద్రతా ఏర్పాట్లు, తాజా పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్షించిన అనంతరం, లోకేష్ తన షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు చేయకూడదని నిశ్చయించుకున్నారు.
మలేషియా దేశంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.
మధ్యతరగతి, సామాన్య కుటుంబాలపై మరోసారి చమురు భారం పడింది.
తమిళనాట బీజేపీకి ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె.అన్నామలై మూడు రోజుల క్రితం రాజీనామా చేశారు.
రంగారెడ్డి జిల్లా కోహెడలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి, వ్యవసాయం, సంక్షేమ పథకాలపై విస్తృతంగా మాట్లాడారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.