Publish Date:Apr 27, 2024
తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల వేడి వేసవి ఎండలను మించిపోయింది. నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తై పోలింగ్ ఇక రోజుల వ్యవధిలోకి రావడంలో పార్టీలూ, పోటీలో ఉన్న అభ్యర్థులూ తమ ప్రచారాన్ని మరింత హోరెత్తించడానికి సమాయత్తమౌతున్నారు. పార్టీల అధినేతలు రోడ్ షోలు, భారీ బహిరంగ సభలతో ప్రచారంలోకి దూసుకుపోతున్నారు. సహజంగా తమ ప్రచారానికి సినీగ్లామర్ ను కూడా జోడించాలని సినీ పరిశ్రమతో సంబంధాలు, బంధుత్వాలు ఉన్న అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు.
అందులో భాగంగానే టాలీవుడ్ కు చెందిన ప్రముఖులను ప్రచారంలోకి దింపుతున్నారు. అలాగే సినీ ప్రముఖులు కూడా తమ బంధువులు, స్నేహితుల కోసం ప్రచారం చేయడానికి ముందుకు వస్తున్నారు.
ఇందులో భాగంగానే చీరాల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న ఎంఎం కొండయ్యయాదవ్ తరఫున నటుడు నిఖిల్ సిద్ధార్థ ప్రచారంలో పాల్గొన్నారు. రోడ్ షోలో కూడా పాల్గొని తెలుగుదేశం కూటమి అభ్యర్థికి ఓటేయాలంటూ ప్రజలను అభ్యర్థించారు. ఇక పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్ కోసం ప్రచారం చేసేందుకు పలువురు నటులు రంగంలోకి దిగారు. ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్, కమేడియన్ ఆది తదితరులు పిఠాపురంలో మకాం వేసి జనసేనాని తరఫున ప్రచారం చేస్తున్నారు. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ కూడా తన బాబాయ్ పవన్ కల్యాణ్ కు మద్దతుగా శుక్రవారం పిఠాపురంలో సందడి చేశారు. రానున్న రోజులలో మెగా హీరోలంతా కూడా పిఠాపురంలో పవన్ కల్యాణ్ కు మద్దతుగా ప్రచారం చేయనున్నారని తెలుస్తోంది. అలాగే మెగా హీరో చిరంజీవి కూడా పవన్ కల్యాణ్ కు మద్దతుగా పిఠాపురంలో ప్రచారం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని జనసేన వర్గాలు చెబుతున్నాయి.
అదే విధంగా సాధారణంగా రాజకీయాలకూ పూర్తిగా దూరంగా ఉండే వెంకటేష్ కూడా ఈ సారి ఎన్నికల ప్రచార రంగంలో కీలకంగా వ్యవహరించనున్నారు. ఆయన రెండు తెలుగు రాష్ట్రాలలోనూ పోటీలో ఉన్న తన బంధువుల తరఫున ప్రచారంలో పాల్గొననున్నారు. తెలంగాణలో ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన వియ్యంకుడు రామసహాయం రాఘవ రెడ్డి తరఫున వెంకటేష్ ప్రచారం చేస్తారని తెలుస్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని కైకులూరు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి కామినేని శ్రీనివస్ తరఫున కూడా వెంకటేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కామినేని శ్రీనివాస్ వెంకటేష్ సతీమణి నీరజకు స్వయాన మేనమామ. దీంతో తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల బరిలో నిలిచిన తన సమీప బంధువుల తరఫున వెంకటేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hero-venkatesh-to-participate-in-election-39-174630.html
రఘురామకృష్ణం రాజు.. పరిచయం అక్కర్లేని పేరు. గత నాలుగున్నరేళ్లుగా జగన్ ప్రభుత్వ అరాచకాలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న వ్యక్తి. గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా నరసాపురం లోక్ సభ స్థానం నుంచి విజయం సాధించిన రఘురామకృష్ణం రోజు.. ఆ తరువాత కొద్ది రోజులకే జగన్ విధానాలతో విభేదించి రెబల్ గా మారారు. నిత్యం జగన్ అరాచకపాలనను విమర్శిస్తూ వచ్చారు.
సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను క్యాట్ కొట్టేసింది. తనను రెండో సారి జగన్ సర్కార్ సస్పెండ్ చేయాడాన్ని ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్ లో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తెచ్చి జగన్ ఏపీ ప్రజల భూములను దోచుకోవడానికి ప్లాన్ వేశారంటూ పెద్దయెత్తున ప్రచారం చేస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన చట్టమని, దీనివల్ల రైతులకు ఎలాంటి నష్టం ఉండదని వైసీపీ చెబుతున్నప్పటికీ అది ఎంత మేరకు రైతుల మైండ్ కు చేరుతుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న
ఈ ఎన్నికలలో ఎవరైనా ఓటు వేస్తే ఆంధ్రప్రదేశ్ ఓటరు ఈ క్రింది విషయాలను ఒప్పుకున్నట్లే అని సోషల్ మీడియాలో ఒక బాధ్యతగల పౌరుడు స్పందించాడు. నిప్పులాంటి నిజాలను గుర్తు చేశాడు.
వైసీపీకి ఇవే చివరి ఎన్నికలంటూ అభ్యర్థి కాకర్ల సురేష్ తన దైన స్టైల్లో ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ టీడీపీ కూటమికే జైకొట్టేందుకు సిద్ధంగా ఉన్నారనే, అన్నీ సర్వేల్లో తేలిపోయింది. ఉదయగిరి నియోజకవర్గాన్ని పారిశ్రామిక హబ్ గా మారుస్తానని, ఉదయగిరి కోటను, సిద్దేశ్వరం, శ్రీ వెంగమాంబ టెంపుల్, గండిపాలెం రిజర్వాయర్ ను పర్యాటక కేంద్రంగా మార్చి ఉద్యోగాలు సృష్టిస్తానన్నారు సురేష్ హామీలు ఇస్తున్నారు.
వైసీపీలో కొన్ని రోజుల నుంచీ ఒక విధమైన నైరాశ్యం కనిపిస్తోంది. ఆ పార్టీ అధినేత జగన్ నుంచి, కీలక నేతలైన విజయసాయిరెడ్డి వంటి వారి వరకూ అందరూ అన్యాపదేశంగా తమ పార్టీ ఓటమి తథ్యమన్న సంకేతాలే ఇస్తున్నారు. ముందుగా జగన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లపై నమ్మకం పోయిందంటూ చేతులెత్తేశారు.
రాజకీయంగా సీనియర్ కూడా అయిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తన మార్కు రాజకీయాలు చేస్తున్నారు. బాలశౌరికి రాజకీయంగా ఎంతో అనుభవం ఉంది. ముఖ్యంగా ప్రజలను తనవైపు తిప్పుకోవడంలోనూ ఆయన నేర్పుగా ముందుకు సాగుతారనే పేరు తెచ్చుకున్నారు.
గదిలో బంధించి కొడితే పిల్లి కూడా పులిలా తిరగబడుతుందన్నది సామెత. సినీ పరిశ్రమలు అన్ని విధాలుగా అవమానించిన ఏపీ సీఎం జగన్ కు సరిగ్గా ఎన్నికల వేళ ఆ సినీ పరిశ్రమ నుంచి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. సినీ పరిశ్రమ నుంచి ఒక్కరొక్కరుగా జగన్ కు వ్యతిరేకంగా జనసేనానికి మద్దతుగా బయటకు వచ్చి గొంతు విప్పుతున్నారు.
చినుకు పడితే హైదరాబాద్ జంటనగరాలు చిగురుటాకులా వణికిపోవడం కొత్త కాదు. ప్రతి ఏటా వానాకాలంలో భాగ్యనగర వాసులు నరకం చూడటమూ కొత్త కాదు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ లో మంగళవారం(మే7)న కురిసిన వర్షంతో భాగ్యనగరం కాస్తా భాగ్యనరకంగా మారిపోయింది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యాం సేఫ్టీ మధ్యంతర నివేదికను అందజేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలంగాణ ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గాయపడ్డారు. ఎన్నికలకు గట్టిగా ఐదు రోజుల సమయం కూడా లేదు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా చురుగ్గా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. తాను పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూనే, కూటమి అభ్యర్థుల విజయం కోసం రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తున్నారు. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా పవన్ కూటమి శ్రేణుల్లో జోష్ నింపేలా ప్రసంగాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇంత కాలం ఓ నమ్మకం ఉండేది. తాను ఎంత అరాచకపాలన సాగించినా, ఎంత ఆర్థిక అవకతవకలకు పాల్పడినా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రధాని నరేంద్రమోడీ తనకు అండగా నిలుస్తారనీ, ఎన్నికల గండం నుంచి గట్టెక్కిస్తారని. అయితే తెలుగుదేశం, జనసేనతో ఏపీలో బీజేపీ జతకట్టడంతో ఆ ఆశలు అడియాసలయ్యాయి.
ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శరంగా జరుగుతాయన్న నమ్మకం జగన్ లో పోయింది. తనకు అనుకూలంగా, తన అనుకూల అధికారుల కనుసన్నలలో, తన కోసం తానే సృష్టించుకున్న వాలంటీర్ల వ్యవస్థ ఆధ్వర్యంలో స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగాల్సిన ఎన్నికలను ఎన్నికల సంఘం చర్యల కారణంగా భ్రష్టుపట్టిపోతున్నాయని జనగ్ ఇప్పుడు ఊరూవాడా కోడై కూస్తున్నారు.