మహిళా సాధికారత ఆధారంగా తీసిన భగవంత్ కేసరి సినిమాకు జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉందని ఆ సినీమా హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. భగవంత్ కేసరి జాతీయ సినిమా పురస్కారాలలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపిపైన సంగతి తెలిసిందే. తాను నటించిన భగవంత్ కేసరి సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన బాలకృష్ణ ఈ గౌరవం మొత్తం భగవంత్ కేసరి చిత్ర బృందానికే చెందుతుందన్నారు.
చిత్ర నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది, ఈ కథను అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు అనిల్ రావిపూడి, ఈ సినిమాలో నటించిన ప్రతి కళాకారుడు, సాంకేతిక నిపుణులు, సిబ్బంది అందరి సమష్టి కృషి వల్లే భగవంత్ కేసరి సినిమా విజయం సాధమైందనీ, ఇప్పుడు ఉత్తమ చిత్రంగా ఎంపిక అయ్యిందనీ పేర్కొన్నారు.
అమరావతిలో నిర్మించనున్న బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి ఈ నెల 13న ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఆ ఏర్పాట్లు పరిశీలించేందుకు బాలకృష్ణ శనివారం ( ఆగస్టు 2) అమరావతి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 21 ఎకరాలలో మూడు దశలలో క్యాన్సర్ ఆస్పత్రి నిర్మిస్తున్నట్లు తెలిపారు.
ఇక తాను నటించిన భగవంత్ కేసరి సినిమా ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడంపై మాట్లాడుతూ.. ఇక నుంచి తాను తీయబోయే సినిమాలలో సమాజానికి సంబంధించిన సందేశాలు ఉంటాయని చెప్పారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో త్వరలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టునున్నట్లు బాలకృష్ణ చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/here-after-will-make-moovies-with-food-message-25-203332.html
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు
ఖమ్మంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.