కేఏ పాల్ కాదు ఇక విశాఖ పాల్!

Publish Date:Aug 5, 2023

Advertisement

కేఏ పాల్.. ఈ పేరు గురించి రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.  గతంలో మత ప్రభోధకుడిగా ఒక వెలుగు వెలిగిన పాల్.. దేశ విదేశాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఇప్పటికీ దేశాల ప్రధానులను, అధ్యక్షులను ఎలాంటి అపాయింట్ మెంట్ కూడా లేకుండా కలవగలిగిన సత్తా ఉన్న వ్యక్తిని తానని  ఆయనే చెప్పుకుంటారు.

ఇక  ఎన్నికల సమయంలో పాల్ చేసే స్టంట్స్, ఇచ్చే ఇంటర్వ్యూలకు సోషల్ మీడియాలో ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఆయన మాటలనే ఇతర రాజకీయ పార్టీలు కూడా ట్రోల్స్ కోసం వాడేంతగా ఆయన ఎన్నికల సమయంలో ప్రజలను ఎంటర్ టైన్ చేస్తుంటారు. వినోదం పంచుతుంటారు. ఈయనకున్న క్రేజ్ దృష్ట్యా కొన్ని మీడియా సంస్థలు కూడా ఆయనతో ప్రత్యేక ఇంటర్వ్యూలను ప్లాన్ చేసి ప్రచారం చేస్తున్నాయంటే ఆయన సేలబులిటీ ఎంతో అర్ధమౌతుంది.  ఆయన మాట్లాడే మాటలు వైరల్ అయితే, ఆయన ఇంటర్వ్యూలు పెద్ద సంఖ్యలో  వ్యూస్ తెస్తాయి.

కాగా  ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల హీట్ మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు ప్రాంతాలలో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రణాళికలు రచించుకొనే పనిలో ఉన్నారు. ఎన్నికల హీట్ మొదలైందో లేదో పాల్ మళ్ళీ రంగంలోకి దిగిపోయారు. ఈసారి ఆయన విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. తాను పక్కా లోకల్ అని చెప్పుకున్నారు. విశాఖలో తనకంటే మంచి అభ్యర్థి లేరని.. ఈసారి పోటీ చేసి తీరుతానని గట్టిగా చెప్పారు. ఇక నుంచి ఇక్కడే మకాం పెడతానని, తన రాజకీయం ఎలా ఉంటుందో ఇక్కడి రాజకీయ పార్టీలకు చెబుతానని సవాల్ విసిరారు.

ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు కేంద్రంలోని బీజేపీకి తొత్తుగా మారాయని.. విశాఖపట్నంకి మేలు చేసే పార్టీ ఒక్కటీ లేదని, అందుకే తాను బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు.

మరి రెండు తెలుగు రాష్ట్రాలలో ఇన్ని సీట్లు ఉండగా విశాఖనే ఎందుకు ఎంచుకున్నారంటే.. విశాఖ దగ్గర తగరపువలస తన సొంత ప్రాంతమని అందుకే ఇక్కడ నుంచి పోటీ చేసి ఈ ప్రాంత సమస్యలు తీర్చాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అంతేకాదు విశాఖ ఎదుర్కొంటున్న సమస్యలు ఇక్కడి పరిస్థితులు తనకంటే ఎక్కువగా ఏ నాయకులకు తెలుసని ప్రశ్నిస్తున్నారు. ఆరు నూరైనా నూరు పదహారైనా 2024 ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని.. ఇదే సమయంలో తనదే గెలుపు అని ధీమా వ్యక్తం చేసిన పాల్.. తాను ఇక మీదట కేఏ పాల్ ను కాదని విశాఖ పాల్ ని అని.. తనని అందరూ అలాగే పిలవాలని కూడా కోరుతున్నారు.

నిజానికి తెలుగు రాష్ట్రాలలో కేఏపాల్ చెప్పే మాటలు అందరినీ నవ్వుల్లో ముంచుతుంటాయి. మత ప్రబోధకుడిగా ఆయనకి చాలా దేశాలలో గుర్తింపు ఉన్న మాట నిజమే కానీ.. దాన్ని ఆయన చెప్పే తీరు చూసేవారికి కామెడీగా కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే గతంలో ఆయన కూడా హుందాగానే మాట్లాడేవారు. కానీ, ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఇలా కామెడీ పీస్ అయిపోయారు. ప్రజాశాంతి పార్టీ పెట్టిన తర్వాత ఆయన మాట్లాడే మాటలు సహజంగానే తెగ ట్రోల్ అయిపోతున్నాయి. తాను తలచుకుంటే ఎవరినైనా సీఎంను చేస్తానని.. అవసరమైతే రెండు రాష్ట్రాలను దత్తత తీసుకుంటానని ఆయన చెప్పే డైలాగ్స్ ఎక్కువగా యూత్ లో ఎంటర్ టైన్మెంట్ పార్ట్ అయిపొయింది. 

కాగా, పాల్ ప్రకటించిన విశాఖ పార్లమెంట్ విషయానికి వస్తే ప్రస్తుతం ఇక్కడ వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన మధ్యే పోటీ ఉండేలా ఉంది. టీడీపీ జనసేన పొత్తులు ఇంకా ఖరారు కాకపోగా.. బీజేపీ మరోవైపు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని బరిలో నిలబెట్టే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ పొత్తు ఖరారైనా ఆమెకు సీటు ఖాయం, గెలుపు ఖాయం అనే ప్రచారం కూడా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ బలహీన పడ్డారు. ఆ మధ్య దుండగులు ఈ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన ఘటన సంచలనంగా మారగా.. ఇప్పుడు ఎంవీవీ హైదరాబాద్ కు మకాం మార్చినట్లు తెలుస్తుంది. ఆయన స్థానంలో వైసీపీ మరొకరిని దింపేందుకు కసరత్తులు కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తుంది.

By
en-us Political News

  
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.