వర్షాకాలంలో తులసి ఆకులు ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Publish Date:Oct 18, 2024

Advertisement

 

తులసి ఒక ఆయుర్వేద మూలిక.  తులసి మొక్కను ఔషధంగానూ,  ఆధ్యాత్మికతలోనూ భాగం చేస్తారు.  ముఖ్యంగా హిందువులు తమ ఇళ్లలో తులసిని దైవంగా పూజించడం చూస్తునే ఉంటాం.  అయితే ఈ తులసి ఆరోగ్యం కోసం ఎక్కువగా వినియోగించ బడుతుంది. తులసితో చేసే వైద్యం చాలా శక్తివంతమైనది.  ఈ వర్ష కాలంలో తులసి ప్రతి ఇంటి దగ్గర ఉండాల్సిందే.. దీంతో కలిగే ప్రయోజనాలేంటంటే..

తులసిని రోజూ ఉదయాన్నే తీసుకునే వారు ఉంటారు.  తులసి ఆకులను నేరుగా నమిలి తినేవారు మాత్రమే కాకుండా వివిధ రూపాలలో కూడా తీసుకుంటారు. తులసి టీ.. తులసి ఆకుల రసాన్ని తేనెతో కలిపి తీసుకోవడం,  తులసి టాబ్లెట్లు వాడటం చేస్తారు.  అయితే తులసిని రోజూ తీసుకుంటే మెదడు బాగా పని చేస్తుందట. ఇది మెదడుకు పదును పెడుతుందట.

నేటి కాలంలో దంతాల సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు చాలామంది ఉన్నారు. తులసి ఆకులను మిరియాలతో జోడించి పంటి కింద ఉంచుకుంటే పంటి నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.

తరచుగా తల నొప్పితో బాధపడేవారు తులసి నూనెను ఒక రెండు చుక్కలు ముక్కులో వేసుకోవాలి.  ఇది తలనొప్పి నుండి అద్బుతమైన ఉపశమనాన్ని ఇస్తుంది.  అలాగే నాసికా రంధ్రాలను,  శ్వాస నాళాలను కూడా రిలాక్స్ చేస్తుంది.

జలుబు, దగ్గు కారణంగా గొంతు నొప్పిగా ఉంటుంది.  దీని వల్ల గొంతు బొంగురుపోవడం చాలా మందికి అనుభవంలోనే ఉంటుంది.  ఇలాంటి పరిస్థితిలో తులసి ఆకులను రసం తీసి తాగితే గొంతునొప్పి గొంతు బొంగురు పోవడం వంటివి తగ్గుతాయి.

తలలో పేను సమస్యలు,  తలలో చుండ్రు వంటివి ఉంటే తులసి నూనెను తలకు రాసుకోవచ్చు.  ఇది జుట్టు సంబంధ సమస్యలను చక్కగా తగ్గిస్తుంది. తలలో పేనులు చచ్చిపోతాయి.

చెవులలో నొప్పి లేదా వాపు ఉంటే ఒక చుక్క గోరువెచ్చని తులసి రసాన్ని చెవుల్లో వేయాలి.  దీని వల్ల చెవి నొప్పి సమస్యలు తగ్గుతాయి.

దగ్గు సమస్య అధికంగా ఉన్నప్పుడు తులసి ఆకులతో జ్యూస్ తయారు చేసి తాగాలి.  ఇది అన్ని రకాల దగ్గుల నుండి ఉపశమనం అందిస్తుంది.

సైనసైటిస్ సమస్య కూడా ఈ కాలంలో ఎక్కువగా ఉంటోంది.  ఈ సమస్య ఉన్న వారు తులసి ఆకులను వాసన చూస్తుంటే సైనసైటిస్ సమస్య నుండి ఉపశమనం ఉంటుంది.

విరేచనాల సమస్యతో ఇబ్బంది పడేవారు పది తులసి ఆకులను,   ఒక గ్రాము జీలకర్రను తీసుకోవాలి.  ఈ  రెండింటిని బాగా నూరి ఆ మిశ్రమాన్ని తేనెతో కలిపి తినాలి.  ఇలా తింటే విరేచనాల సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.

ఆస్తమా సమస్య వర్షాకాలం, చలికాలంలో ఎక్కువ.   ఆస్తమా తో ఇబ్బంది పడేవారు తులసి పొడి, మంజరి,  తేనె కలిపి తాగితే ఆస్తమా సమస్య నుండి ఉపశమనం ఉంటుంది.

                                             *రూపశ్రీ.
 

By
en-us Political News

  
సాధారణంగా తాంబూలం వేసుకోవడం అనేది మన సంప్రదాయంలో ఒక భాగం. కానీ, ఆ తాంబూలానికి కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద మూలికలను జత చేస్తే, అది గుండెను రక్షించే ఒక అద్భుతమైన ఔషధంగా మారుతుందని..
వేసవి వాతావరణం శరీరాన్ని అలసటకు గురి చేయడమే కాకుండా, జీర్ణక్రియ , శక్తి పై కూడా ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరం , మనస్సును కాపాడుకోవడానికి వేసవి కాలంలో ఆహారంపై..
నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి మరియు జీవనశైలి కారణంగా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్ధకం..
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనల్ని నిరంతరం వేధించే ప్రధాన శత్రువులు ఒత్తిడి మరియు ఆందోళన. వీటితో పాటు థైరాయిడ్..
బ్రేక్ ఫాస్ట్ లేదా అల్పాహారం నేటికాలపు జీవనశైలికి చాలా ముఖ్యంగా మారింది.  ఉదయాన్నే అల్పాహారం తప్పకుండా తినాలని వైద్యుల నుండి ఆహార నిపుణుల వరకు ప్రతి ఒక్కరూ చెబుతారు.  అయితే చాలామంది అల్పాహారంలో..
కాలంతో పాటు అన్ని అలవాట్లు అప్డేట్ అవుతూ ఉన్నాయి.  మొదట వేప పుల్లలతో పళ్లు తోమేవారు,  తర్వాత పేస్ట్ లు వచ్చాయి.  ఆ తరువాత పేస్ట్ లలో ఉప్పు, బొగ్గు, లవంగం వంటివి చేరాయి.  అవి కూడా అయ్యాక మౌత్ వాష్ లు వచ్చాయి....
ఆరోగ్యకరమైన శరీరానికి జింక్ చాలా అవసరం. జింక్ కణజాలాలను బాగుచేస్తుందని చెబుతారు. జింక్ ఒక యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ, కణాలను దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడుతుంది. చర్మం..
ఇనుప పాత్రలో వంట చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు. ఎందుకంటే ఇనుప పాత్రలో వంట చేయడం వల్ల ఆ ఆహారాన్ని ఐరన్ ఖనిజం చేరుతుంది.  దీని వల్ల శరీరానికి ఐరన్ ఎలాంటి సప్లిమెంట్ ..
ఈ రోజుల్లో పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు   ఎక్కువ సమయాన్ని మొబైల్, ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్ స్క్రీన్‌ల ముందు గడుపుతున్నారు. దీని ఫలితంగా, కంటి అలసట , చికాకు సర్వసాధారణమైపోయాయి...
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో సరైన నిద్ర లేకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి...
AI..ప్రపంచం అంతా వాడుతున్న కృత్రిమ మేధస్సు ఇది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ కృత్రిమ మేధస్సు వాడకం చాలా పెరిగింది.  ఏ చిన్న సందేహం వచ్చినా ఏఐ ని వాడటం, దాన్ని సలహాలు, సూచలు అడగడం..
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మోకాళ్ళ నొప్పులు. జీవనశైలిలో మార్పులు, శారీరక శ్రమ తగ్గడం మరియు సరైన పోషకాహారం..
వేసవి మొదలవ్వగానే తీవ్రమైన ఎండ , పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మన రోజువారీ  కార్యకలాపాలు , ఆరోగ్యంపై ప్రభావం చూపడం మొదలవుతుంది. ఈ రోజుల్లో బయట కొద్దిసేపు ఉన్నా కూడా శరీరం అలసిపోయేంత వేడిగా ఉంటుంది...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.