ఖరీదైన ఆహారాలు అక్కర్లేదు.. రోజూ వీటిని గుప్పెడు తింటే ఉక్కులా మారతారు..

Publish Date:Nov 4, 2023

Advertisement

ఆరోగ్యమే మహాబాగ్యం అన్నారు. తీసుకునే ఆహారం అంతా శరీరం కోసమే. కానీ చాలామంది శరీరం కోసం కాకుండా రుచి కోసం, జిహ్వచాపల్యం కోసం అహారం తింటారు. దీని వల్ల ఆరోగ్యంగా ఉండాల్సిన శరీరం ట్రబుల్ ఇచ్చిన ఇంజిన్ లా మారుతుంది.  కొందరు శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఖరీదైన ఆహారాలు తినాలనే భావనలో ఉంటారు. అందుకే తాము ఆరోగ్యంగా లేమని సమర్థించుకుంటారు. కానీ వాస్తవం ఏమిటంటే శరీరానికి అద్బుతమైన బలాన్ని చేకూర్చే ఆహారాలు ఖరీదైనవే కాదు, తక్కువ ధరలో సాధారణ పౌరులకు కూడా లభిస్తాయి. కానీ వాటిని గుర్తించి తినడం చాలా ముఖ్యం.  చాలామంది రాత్రి బాదం పప్పులను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే వాటిని తింటుంటారు. కానీ బాదం పప్పులు అక్కర్లేదు. చికెను, మటనూ అసలే వద్దూ..  ప్రతిరోజూ గుప్పెడు నానబెట్టిన శనగలు తింటే చాలు. శరీరం ఉక్కులా మారుతుంది. అసలు నానబెట్టిన శనగలు తింటే కలిగే లాభాలేంటి?  వీటిని ఎలా తినాలి? తెలుసుకుంటే..

నల్లశనగలు బాదం పప్పు కంటే అద్బుతమైన పోషకాలు కలిగి ఉంటాయి. మాంసాహారం కంటే బలం చేకూరుస్తాయి. వీటిలో కాల్షియం, ప్రోటీన్, పైబర్, విటమిన్లు, మినరల్స్ సమృద్దిగా ఉంటాయి. వీటిని వేయించి తినవచ్చు, లేదంటే నానబెట్టి తినవచ్చు, నానబెట్టిన శనగలను మొలకలు తెప్పించి ఆ మొలకలు కూడా తినవచ్చు. ఇవి చాలా బలం.

గుప్పెడు శనగలను రాత్రి సమయంలో కప్పు నీటిలో వేసి నానబెట్టాలి. ఉదయాన్నే ఈ శనగలను పరగడుపున తినాలి. మగవారు నానబెట్టిన శనగలను తిన్న తరువాత గోరువెచ్చని పాలు తాగితే వారిలో స్పెర్మ్ కౌంట్ మెరుగవుతుంది. లైంగిక శక్తి పెరుగుతుంది.

ప్రతిరోజూ మొలకెత్తిన శనగలు తినడం వల్ల మలబద్దకం అనే సమస్య అసలు వేధించదు. ఎన్నో రోజులుగా బాదిస్తున్న మలబద్దకం కూడా కేవలం నల్ల శనగలను తినడం వల్ల  పరిష్కారం అవుతుంది. వీటిలో  ఉండే ఫైబర్ పేగులు మూసుకుపోకుండా చేస్తుంది.

వృద్దులలో కీళ్ల నొప్పులు సాధారణం. కానీ నానబెట్టిన శనగలను తింటూంటే వృద్దులలో కీళ్లనొప్పులు ఆశ్చర్యకరంగా తగ్గిపోతాయి. వీటిలో ఉన్న కాల్షియం ఎముకలకు బలాన్ని ఇస్తుంది.

శరీరం ఆరోగ్యంగా ఉండటానికి కాలేయం పనితీరు సమర్థవంతంగా ఉండటం ఎంతో అవసరం. ఈ పనితీరులో కాలేయం కొన్నిసార్లు పాడైపోతుంది. కాలేయం ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజూ నానబెట్టిన నల్ల శనగలు తినడం శ్రేయస్కరం.

వయసు పెరిగేకొద్ది ఎముకలు బలహీనంగా మారతాయి.  బలహీనమైన ఎముకలుంటే బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. బోలు ఎముకల వ్యాధి రాకూడదంటే చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ నల్ల శనగలు తినాలి.

నల్లశనగలలో ఐరన్, పాస్పరస్ సమృద్దిగా ఉంటాయి. ఈ కారణంగా ఇది హిమోగ్లోబిన్ ను పెంచుతుంది. రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడేవారు ప్రతి రోజూ నల్లశనగలు తింటూంటే తొందరగానే ఈ సమస్య పరిష్కారం అవుతుంది.

బద్దకం, అలసట నివారించడానికి. శరీరంలో నూతనోత్తేజం నింపడానికి నల్లశనగలు భలే ఉపయోగపడతాయి. మొలకెత్తిన శనగలను ప్రతిరోజూ తింటూంటే  తొందరలోనే శరీరంలో  శక్తి పుంజుకుంటుంది. శరీరం దృఢంగా, చురుగ్గా మారడం స్పష్టంగా కనిపిస్తుంది.

ఇప్పట్లో చాలామందిలో చక్కెర వ్యాధి పెద్ద సమస్యగా ఉంది. నల్లశనగలు ప్రతిరోజూ తినడం వల్ల ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. శరీరంలో అదనపు గ్లూకోజ్ ను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. మధుమేహం ఉన్నవారు వీటిని రోజూ తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.

                                          *నిశ్శబ్ద.

By
en-us Political News

  
ఎండల ప్రభావం వల్ల లేదా మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిలో శరీర ఉష్ణోగ్రత (Body Heat) అకస్మాత్తుగా పెరిగిపోతూ ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం..
అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన విభాగంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది శరీరానికి రోజంతా అవసరమైన శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అయితే సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల, చాలా మంది..
ఆయుర్వేదం భారతీయులకు ఋషులు అందించిన గొప్ప వైద్య విధానం. ఈ ఆయుర్వేద వైద్యంలో వ్యాధిని మూలాల నుండి నిర్మూలించడం జరుగుతుంది.  సైన్స్ కనుగొనలేని ఎన్నో రకాల జబ్బులకు ఆయుర్వేదంలో వైద్యం దొరుకుతుంది...
ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య గుండె జబ్బులు (Heart Diseases). మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం మరియు చెడు ఆహారపు అలవాట్ల వల్ల గుండె పనితీరు మందగిస్తోంది...
ప్రస్తుత ఆధునిక కాలంలో శారీరక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, మానసిక ఆరోగ్యానికి (Mental Health) కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో అవసరం. కానీ, నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, వ్యక్తిగత సమస్యల వల్ల చాలా మంది...
ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మలబద్ధకం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే పైల్స్, గ్యాస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఎలాంటి మందులు వాడకుండా, ఇంట్లోనే సహజంగా మలబద్ధకాన్ని ఎలా తగ్గించుకోవచ్చో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు..
మానవ శరీరంలో ప్రేగుల పాత్ర చాలా ఉంది.,  తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో,  శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించడంలో, వ్యర్థాలను బయటకు పంపడంలో ప్రేగులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. తిన్న ఆహారం..
మన శరీరంలో పొటాషియం స్థాయిలు హెచ్చుతగ్గులు కావడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, వాటి కారణాలు మరియు నివారణ మార్గాల గురించి ప్రముఖ వైద్యులు డాక్టర్ పాపారావు గారు ఈ వీడియోలో క్లుప్తంగా వివరించారు...
మూత్రపిండాలు శరీరం నుండి విషపదార్థాలను తొలగించడం, రక్తపోటును నియంత్రించడం,  శరీరంలో నీరు, ఖనిజాలను బాలెన్స్డ్ గా ఉంచడం వంటి   ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తాయి. అయితే, కొన్ని అనారోగ్యకరమైన..
చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘తల తిరగడం’ (Vertigo/Dizziness) ఒకటి. హఠాత్తుగా కళ్ళు తిరగడం వల్ల భయం, అసౌకర్యం కలగడమే కాకుండా రోజువారీ పనులు చేసుకోవడం కష్టమవుతుంది.
చాలా మందికి రాత్రిపూట వేడివేడి అన్నం తింటే గాని నిద్ర పట్టదు. కానీ, బరువు తగ్గాలని లేదా ఫిట్‌గా ఉండాలని ప్రయత్నించే వారికి..
మనలో చాలా మందికి అద్దంలో చూసుకున్నప్పుడు కొన్ని శరీర భాగాలు నచ్చవు. ముఖ్యంగా ఎంత వ్యాయామం చేసినా, ఎంత కఠినమైన డైట్ పాటించినా తగ్గని మొండి కొవ్వు మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది...
ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మహిళలను వేధిస్తున్న అతిపెద్ద సమస్య పి.సి.ఓ.డి (PCOD). అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.