చలికాలంలో బెల్లం, వేయించిన శనగలు తినడం వల్ల కలిగే లాభాలు తెలుసా!

Publish Date:Nov 22, 2025

Advertisement

 

శీతాకాలంలో చలి  రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. తొందరగా అలసిపోయేలా చేస్తుంది.  ఇన్ఫెక్షన్లు కలిగించడానికి కూడా కారణం అవుతుంది. చలికాలంలో ఏం తింటున్నాం,  ఏ దుస్తులు ధరిస్తున్నాం అనేదికూడా ఆరోగ్యం విషయంలో కీలక పాత్ర పోషిస్తుంది.  చలికాలంలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కొన్ని ఆహారాలు చాలా బాగా పనిచేస్తాయి.  భారతీయుల సాంప్రదాయ ఆహారాలు సీజనల్ సమస్యలకు ఔషధంగానూ,శరీరానికి సూపర్ పుడ్ గానూ పనిచేస్తాయి. అలాంటి ఆహారాలలో   వేయించిన శనగలు, బెల్లం అద్భుతమైన కాంబినేషన్ గా పిలవబడుతుంది.  అటు ఆరోగ్యాన్ని, ఇటు పోషకాలను కూడా సమృద్దిగా అందించే ఈ బెల్లం, వేయించిన శనగలను చలికాలంలో తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుంటే..

గుండె ఆరోగ్యం..

బెల్లం  గుండెకు చాలా అవసరమైన ఐరన్,  పొటాషియంలను అధికంగా కలిగి ఉంటుంది . ఐరన్ రక్త ప్రసరణను బాగా నిర్వహించడానికి సహాయపడుతుంది, పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. శనగపప్పులో విటమిన్లు, కాల్షియం,  మెగ్నీషియం ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి,  గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా సహాయపడతాయని  ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. బెల్లం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తహీనతను నివారించవచ్చు. ఇది అలసట,  బలహీనతకు కారణమవుతుంది. బెల్లం తీసుకుంటే హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుకోవచ్చు.  అలాగే ఆరోగ్యకరమైన హృదయనాళ వ్యవస్థకు సహాయపడుతుంది.

జీర్ణవ్యవస్థ ఆరోగ్యం..

తరచుగా మలబద్ధకం, ఉబ్బరం లేదా గ్యాస్ వంటి జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే  ఆహారంలో బెల్లం,  శనగపప్పులను తీసుకోవడం చాలా మంచిది. బెల్లం,  వేయించిన శనగలు.. రెండింటిలో  ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని నయం చేయడంలోనూ,  జీర్ణ ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడంలోనూ సహాయపడుతుంది. బెల్లం,  శనగల కాంబినేషన్  ప్రేగులను శుభ్రపరచడమే కాకుండా,  శరీరం జీర్ణ ఎంజైమ్‌లను ఉత్పత్తి చేయడానికి కూడా సహాయపడుతుంది.  ప్రతి రోజూ ఒక చిన్న బెల్లం ముక్క,  ఒక గుప్పెడు వేయించిన శనగలు తినడం మంచిది.

కండరాల ఆరోగ్యం..

శరీరం బలంగా, దృఢంగా ఉండాలని అనుకునేవారికి బెల్లం,  శనగలు చాలా మంచి ఛాయిస్ అంటున్నారు పోషకాహార నిపుణులు. బెల్లంలోని పొటాషియం కండరాలు బాగా పనిచేయడానికి సహాయపడుతుంది. కండరాల తిమ్మిరి సమస్యను తగ్గిస్తుంది. వేయించిన శనగల్లో ఉండే ప్రోటీన్ కండరాలను బలంగా మార్చడంలో సహాయపడుతుంది.

మెదడు,  దంతాల ఆరోగ్యం..

వేయించిన శనగలు,  బెల్లం తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందట. బెల్లంలో యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. ఇది జ్ఞాపకశక్తిని,  కంటిచూపును మెరుగుపరుస్తాయి. బెల్లం,  వేయించిన శనగపప్పు రెండింటిలో భాస్వరం ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన దంతాలు,  ఎముకలకు చాలా ముఖ్యం.

                        *రూపశ్రీ.

గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
 

By
en-us Political News

  
ప్రతి ఏడాది ఎండలు పెరుగుతున్నట్టే చలి కూడా పెరుగుతోంది.   చివరి ఏడాది కంటే ఈ ఏడాది చలి తీవ్రత కూడా పెరిగింది.  చలి ఉదయం, రాత్రి వేళల్లో చాలా ఎక్కువగా ఉంటుంది.  ఇది నిజానికి చాలా మంది నిద్రించే సమయం...
లవంగాలు వంటింట్లో ఉండే ఒక మసాలా దినుసు.  
ఆయుర్వేదంలో ఉసిరికాయను "అమృతఫలం" అని పిలుస్తారు.  అంటే అమృతంతో సమానమైన ఔషద గుణాలు కలిగిన ఫలం. అమృతంలాగా శరీరానికి గొప్ప ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది అని అర్థం.  ఉసిరికాయలో అనేక విటమిన్లు, ఖనిజాలు...
డిప్రెషన్.. నేటికాలంలో చాలామంది ఎదుర్కుంటున్న సమస్య.  చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వారు ఈ డిప్రెషన్ ఊబిలో చిక్కుకుంటున్నారు. దీన్నుండి బయటపడటానికి మానసికంగా యుద్దం చేస్తుంటారు...
దోసకాయ తినడానికి  చాలా మంది  ఇష్టపడతారు. సాధారణంగా దోసకాయను  కూరగాయల లిస్ట్ లో చెబుతారు. దోసకాయలో నీరు  సమృద్ధిగా ఉండటం వలన ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది,  శరీరం డీహైడ్రేట్ కాకుండా  నివారిస్తుంది...
శీతాకాలం ఆరోగ్యానికి పరీక్షలు పెట్టే కాలం.  శీతాకాలంలో చలి కారణంగా జలుబు, ఇన్ఫెక్షన్లు,  చర్మం పగలడం,  దురదలు,  ర్యాషెస్, డాండ్రఫ్ వంటివి చాలా వస్తాయి.  
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు.
కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, ఇరుగు పొరుగు, కొలీగ్స్..  ఇట్లా  ఎవరితో అయినా ఎక్కడికైనా ప్రయాణాలు చేయాల్సి వస్తూనే ఉంటుంది....
పొట్ట కాస్త తేడా కొడితే చాలు.. ఎంత బలంగా, దృఢంగా ఉన్న మనిషి అయినా అసౌకర్యానికి లోనవుతారు. పొట్ట ఆరోగ్యం బాగుంటే మిగతా శరీరం ఆరోగ్యం కూడా చాలా వరకు బాగుంటుంది. కానీ పొట్ట ఆరోగ్యం తేడా వస్తే తిండి, నీరు తీసుకోవడం కూడా బ్రేక్ పడుతుంది. ఇలా పొట్ట, ప్రేగు ఆరోగ్యాన్నే గట్ అని పిలుస్తారు....
సాధారణంగా ఏదైనా అనారోగ్యం వల్ల డాక్టర్ చెకప్ చేయించుకున్నప్పుడు చాలామంది కిడ్నీ టెస్ట్ కూడా చేయించుకుంటారు.  ఈ సందర్భంలో కొందరిలో క్రియేటినిన్ స్థాయిలు ఎక్కువగా ఉన్నట్టు బయటపడుతుంటుంది.  క్రియేటినిన్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో విషపదార్థాలు ఎక్కువగా పేరుకుపోవడానికి..
చాలా మంది  సీజన్‌తో సంబంధం లేకుండా తరచుగా  ఇన్ఫెక్షన్లకు గురవుతూ ఉంటారు. గతంలో వాతావరణ మార్పుల కారణంగా జలుబు,  ఫ్లూ లాంటి అనారోగ్యాలు వచ్చేవి. కానీ ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల  డెంగ్యూ, చికున్‌గున్యా, విరేచనాలు...
శరీరానికి శక్తిని ఇవ్వడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది.  శరీరానికి ప్రోటీన్లు, విటమిన్లు,  ఖనిజాలు,  అమైనో ఆమ్లాలు.. ఇలా అన్ని రకాలు అవసరం అవుతాయి. ఇలా అన్ని కలగలిసిన ఆహారాన్నే సమతుల ఆహారం అని అంటారు....
శరీరానికి అవసరమైన ముఖ్యమైన విటమిన్లలో విటమిన్-బి12 ముఖ్యమైనది. నేటి కాలంలో విటమిన్ బి12 లోపం ఒక పెద్ద ఆరోగ్య సమస్యగా మారుతోంది. దీనికి ప్రధాన కారణం తినే ఆహారం, తీసుకునే పానీయాల విషయంలో తగిన శ్రద్ద లేకపోవడం. ఈ లోపం మెల్లిగా పెరుగుతుంది...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.