ఒక్కడిగా వచ్చాడు ఒక్కడిగా మిగిలిపోయాడు... నేడు వైఎస్ జగన్ బర్త్ డే

Publish Date:Dec 20, 2024

Advertisement

అధికారమే పరమావధిగా రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మ దినోత్సం డిసెంబర్ 21. ఆయనపై పలు కేసులు, అవినీతిపరుడంటూ ఆరోపణలు రావడంతో  గత ఎన్నికల్లో ప్రజలు ఇంటికి పంపించి వేశారు. ఒక్కడిగా రాజకీయాలు ప్రారంభించిన జగన్ ఒక్కడిగానే మిగిలిపోయారు. .   గెలిచిన ఎమ్మెల్యేలను  పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించిన ధీశాలి వైఎస్ జగన్.   ప్రజా సంకల్ప యాత్రతో  అకారణంగా జనంతో మమేకమైన నేతగా పేరు మూటగట్టుకున్నారు.  యువభేరీ పేరుతో ప్రత్యేకహోదా నినాదాన్ని  మోసిన జగన్ తనకు  ముఖ్యమంత్రి హోదా రాగానే ప్రత్యేక హోదా నినాదాన్ని సజీవంగా  సమాధి చేశారు.  తనని తాను అవకాశ వాద నేతగా ఐడెంటిటీ ఇచ్చుకున్నారు. .  వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క చాన్స్ ఇవ్వండి  అని 2019 ఎన్నికల్లో ప్రచారం చేసుకున్నారు. ఈ ఒక్క చాన్స్ చివరి చాన్స్ అవుతుందని ఆనాడు జగన్ మోహన్ ఊహించి ఉండరు.   నవ్యాంధ్రలో రెండోసారి జరిగిన ఎన్నికల్లో(2019) గెలిచి వైకాపా కు విక్టరీని అందుకున్నప్పటికీ మూడో సారి జారవిడుచుకున్నారు. తన అధర్మ, అరాచకపాలను ఎపి ప్రజలు తగిన బుద్ది చెప్పారు.  ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్ష నేతగా కూడా ప్రజలు గుర్తించలేకపోతున్నారు. వైనాట్ 175 అనే జగన్ 11 సీట్లకే పరిమితమయ్యారు. రెండు సీట్లు పెరిగి డబుల్ డిజిట్ హోదా దక్కినందుకు జగన్ లోలోపల ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు.  వైఎస్ జగన్ డిసెంబర్ 21 (శనివారం)తో 52 వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు.
పులివెందులలో రాజకీయ ఎంట్రీ ఇచ్చిన  వైఎస్ జగన్మోహన్​రెడ్డి.. 2004లో రాజకీయ అరంగేట్రం చేశారు. . తండ్రి చనిపోయిన సమయంలో పరామర్శించడానికి వచ్చిన నేతలకు ముఖ్యమంత్రి సీటు కట్టబెట్టాలని రికమెండ్ చేసుకున్న వారసుడు  వైఎస్ జగన్. అప్పట్లో  కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని  కడప పార్లమెంటు  అభ్యర్థిగా గెలుపొందారు. కానీ వైఎస్ జగన్ టార్గెట్ ఎంపీ కాదు . ముఖ్యమంత్రి సీటు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా కాంగ్రెస్ పార్టీలో ఇమేజ్ సృష్టించారు. . ఈ ఇమేజి తన రాజకీయ భవిష్యత్తుకు వాడుకున్న ఊసరవెల్లి వైఎస్ జగన్ . 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండోసారి అధికారం చేపట్టగానే  హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఈ డెత్ మిస్టరీ ఇంకావీడలేదు. సిఎం కుర్చీ కోసం తండ్రిని చంపించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు.  వైఎస్ రాజశేఖరరెడ్డికి ముఖ్యమంత్రి పదవి దక్కడంలో ముఖ్యభూమిక వహించిన సోనియాగాంధీని ఎదిరించి మాతృసంస్థ కాంగ్రెస్​ పార్టీ నుంచి జగన్ బయటికొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన వైఎస్ జగన్ అధికార దాహంతోనే కాంగ్రెస్ పార్టీని వీడారు. తండ్రి మరణవార్తతో వైఎస్ అభిమానులు గుండెపగిలి చనిపోయారు. తన క్రిమినల్ బ్రెయిన్ ఉపయోగించి  ఆ కుటుంబాలను పరామర్శించాలని స్కెచ్ వేశారు జగన్ . .ఓదార్పు యాత్ర ప్రారంభించారు.తండ్రిని అడ్డం పెట్టుకుని అక్రమాస్తులు సంపాదించిన ఆరోపణ మీద 16 నెలలు జైలు జీవితాన్ని గడిపారు. ఈ సమయంలో తల్లి, చెల్లి జగన్ కు బాసటగా ఉన్నారు. 2019లో ముఖ్యమంత్రికాగానే వారిని పక్కనపెట్టేసారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు ఫిరాయింపులు ప్రోత్సహించారు. 18 మంది  కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వైకాపాలో చేరారు. 
ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సయయంలో వైకాపా  సంక్షోభంలో చిక్కుకుంది. సమైక్యాంధ్ర నినాదాన్ని భుజానికెత్తుకోవడంతో తెలంగాణ ప్రజలకు దూరమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన  వైకాపా రెండు రాష్ట్రాల్లో పరాజయం చెందింది.  ఎపిలో ఒక శాతానికి పడిపోయింది. 
గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతో  వైకాపా పూర్తిగా చిత్తయ్యింది మాజీ ముఖ్యమంత్రి అనే పేరు తప్ప జగన్ సాధించింది ఏమీ లేదు.అక్రమాస్తులు, అరాచకపాలన తప్ప. 

By
en-us Political News

  
ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు.
భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అన్న విజయసాయి.. అటువంటి దేశంలో ఉంటూ.. బంగ్లాలో హిందువులు లక్ష్యంగా సాగుతున్న దాడులపై స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ దాడులకు ఖండించని వారు దేశ భక్తులే కాదని విజయసాయి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ కోర్టుకు వెడదామా? అంటే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటూ జీవోలోనే స్పష్టంగా పేర్కొంది. దీంతో ఆ పాయింట్ మీద కోర్టుకు వెళ్లడం ఎలా అన్నది అర్ధం కాక వైసీపీ మల్లగుల్లాలు పడుతోందని పరిశీలకులు అంటున్నారు.
తాను ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేసిన తొలి సారే పరాజయం పాలైన సంగతిని గుర్తు చేసుకున్న ఆయన, ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని, ఓడిన చోటే గెలవాలన్న పట్లుదలతో పని చేసి ఫలితం సాధించానని లోకేష్ వివరించారు.
ఆ సందర్భంగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు.. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గాన్ని మంగళగిరికి దీటుగా అభివృద్ధి చేస్తానన్నారు.
పార్టీ అధినేత కేసీఆర్ త‌ర్వాత అంత‌టి వాడిగా.. ఆయన పొలిటిక్ వారసుడిగా కేటీఆర్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన ఏ ఎన్నికలోనూ పార్టీ విజయాన్ని నమోదు చేసింది లేదు.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో నంబర్ 1, 2, 3 అంటూ హైరాక్కీని బట్టి చూస్తే లోకేష్ మూడో స్థానంలో ఉన్నారు. జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తరువాత రెండో స్థానంలో ఉన్నారని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ హైరాక్కీని దాటి త్వ‌ర‌లో లోకేష్ కి ముఖ్య‌మంత్రి ప‌ద‌విని అప్ప‌గించేందుకు గ్రౌండ్ వర్క్ జరుగుతోందా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి.
లోక్ సభలో కాంగ్రెస్ సంఖ్యా బలం 400కు మించి ఉన్న సందర్భాలు ఉన్నాయి. కానీ అప్పుడెవ‌రూ కాంగెస్ ని ఓట్ చోరీ అంటూ ఎగ‌తాళి చేయ‌లేదు. ఎవ‌రి క‌ష్టం వారు ప‌డుతూ.. ప్ర‌జ‌ల్ని మెప్పించే ప‌ని మాత్ర‌మే చేస్తూ వ‌చ్చేవార‌మ‌ని తాజాగా మాజీ ప్ర‌ధాని దేవెగౌడ‌ వ్యాఖ్యానించారు.
అసలింతకీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఒక్క చంద్రబాబు కాదు, కేంద్ర ప్రభుత్వం సహా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ అనుసరిస్తున్నాయి. ఈ పీపీపీ విధానం వల్ల ఎటువంటి నష్టం లేదని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. ఎవరెంతగా చెప్పినా జగన్ మాత్రం తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లు వ్యవహరిస్తున్నారు.
పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించిన అధికారులను అభినందించిన ఆయన ఈ ఎన్నికలలో పార్టీ విజయం కోసం కష్టపడిన కార్యకర్తలకు, అలాగే పార్టీని ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ణతలు తెలిపారు.
ఈ పథకంలో ఉన్న లోపాలన సవరించి రాష్ట్రాల బాధ్యతను మరింత పెంచి పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా చెబుతోంది. అయితే కాంగ్రెస్ మాత్రం మోడీ సర్కార్ ఉద్దేశాలను తప్పుపడుతోంది.
బీజేపీ ఉనికి రాష్ట్రంలో నామమాత్రంగానే మిగిలిందని ఈ ఎన్నికల ఫలితాలు తేల్చాయి. అవన్నీ పక్కన పెడితే ఈ పంచాయతీ ఎన్నికల మూడో విడతలో ఓ ఆసక్తికర విషయంపై తెలుగు రాష్ట్రాలలో చర్చ మొదలైంది.
ల్లమల సాగర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణా జలవనరులశాఖ అధికారులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు హస్తిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.