Publish Date:Jul 11, 2025
ఏపీకి అప్పులు పుట్టకుండా, పెట్టుబడులు రాకుండా ఒక కుట్ర. అది కూడా విదేశాల నుంచి వైసీపీ చేస్తోన్న పన్నాగం. జర్మనీలో ఒక ప్రముఖ సంస్థలో పని చేసే ఉదయ్ భాస్కర్ అనే ఒక వైసీపీ మద్ధతుదారు చేత బాంబే ఎక్స్ ఛేంజీకి ఏకంగా 200 మెయిళ్లు పంపేలా చేశారంటే పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.
ఈ విషయాన్ని ఏపీ ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. ఆధారాలతో సహా చూపించారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు.. విచారణకు ఆదేశించారు. అంతే కాదు దీని వెనక ఎంతటి వారున్నా వదలకూడదని స్పష్టం చేశారు. దీంతో పాటు.. ఈ విషయం పబ్లిక్ లోకి మరింతగా తీసుకెళ్లే బాధ్యత కూటమి నేతలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.
ఈ విషయంపై స్పందించిన ఆర్ధిక శాఖ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు బుగ్గన... తమ హయాంలో కూడా ఎందరో ఇలాంటి కథనాలు వండి వార్చారు. అలాగని మేము ఆగామా? అంటూ లైట్ తీసుకునే మాటలు మాట్లాడారు. అంతే కాదు.. ఒక మెయిల్ వల్ల మీ రుణాలు, పెట్టుబడులు ఆగిపోతాయా? అని ప్రశన్నించారు. అయితే.. బుగ్గన వ్యాఖ్యలకు స్పందించిన మంత్రి పయ్యావుల కేశవ్.. ఇది స్టేట్ ఫైనాన్షియల్ క్రెడిబిలిటీకి సంబంధించిన విషయంమన్నారు. గతంలో మీ హయాంలో 2024 మార్చిలో 7 వేల కోట్లకు ఇలాగే రుణం కోసం ప్రయత్నించారు. మీపై నమ్మకం లేక పెట్టుబడి దారులు రుణం ఇవ్వలేదు. ఇది విశ్వాసానికీ, విశ్వసనీయతకూ సంబంధించిన అంశం కనుకే.. ఇటువంటి చర్యలను దేశ ద్రోహం కింద తీసుకుని.. తద్వారా.. కేసులు నమోదు చేయాలని సీఎం చంద్రబాబును కోరామని చెప్పారు.
వైసీపీకి తొలి మొదటి నుంచీ ఇలాంటి అలవాటు ఉందనీ, వారు రాష్ట్ర పరువు ప్రతిష్టలను దెబ్బ తీయడమే ధ్యేయంగా పని చేస్తుంటారని.. ఇప్పటి వరకూ అదే జరిగిందనీ అన్నారు. ఈ విషయంపై పూర్తి విచారణ చేసి.. దీని వెనక ఎవరున్నారో కనిపెట్టి తీరాలని పయ్యవుల కేశవ్ అన్నారు. అయినా ఇలాంటి వాటి ద్వారా కూడా నష్టం జరుగుతుందా? అంటే ఇది వరకు హిడెన్ బర్గ్ రిపోర్ట్ అదాని సంస్థలను తీవ్రంగా దెబ్బ తీయలేదా? ఇదీ అలాంటిదేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ కేసు ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి మరి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇలా విద్వేషపూరిత పనులు చేసే వారికి విదేశాల్లో చాలా పెద్ద శిక్షలే వేస్తారు. దానికి తోడు ఇది నైతికతకు సంబంధించిన విషయం. ఇటీవలి కాలంలో కొందరి ఉద్యోగాలు సరిగ్గా ఇలాంటి అనైతిక కార్యకలాపాల వల్లే పోయాయని గుర్తు చేస్తున్నారు. ఉదయ్ భాస్కర్ వంటి వారు ఇలాంటి చర్యలకు పాల్పడే ముందు ఆలోచించాలని సూచిస్తున్నారు నిపుణులు. రాజకీయ ఆరోపణలు చేయడం వేరు. ఇలా పకడ్బందీగా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీసేవిధంగా వ్యవహరించడం వేరని.. ఇలాంటి వారికి గట్టిగా బుద్ధి చెప్పకుంటే కష్టమనీ సూచిస్తున్నారు రాష్ట్ర శ్రేయోభిలాషులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hatred-mails-harmful-to-state-intrests-39-201738.html
హైదరాబాదులో మరొకసారి భారీ వర్షం కుమ్మేసింది.. మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్డు మీద వరద నీరు ఏరులై పారాయి.
వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ సెక్యూరిటీపై వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. జగన్ భద్రత కోసం మరో నలభై మంది ప్రైవేట్ సెక్యూరిటీ నియమించింది.
తెలంగాణ అంతర్జాతీయ స్పోర్ట్స్ చైర్మన్లు గా సంజీవ్ గోయంకా గ్రూప్ చైర్మన్ సంజీవ్ గోయంకా, యువర్ లైఫ్ సిఇఓ ఉపాసన కొణిదెల నియమితులయ్యారు.
ఏపీలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయవచ్చాని ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి తెలిపారు.
కాళేశ్వరం కమీషన్ నివేదికపై మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కమీషన్ రిపోర్ట్ ఊహించిందే. ఎవరు భయపడాల్సిన అవసరం లేదని గులాబీ బాస్ అన్నారు.
సిరాజ్ మ్యాజిక్.. విజయానికి ఏడు పరగుల దూరంలో ఇంగ్లాండ్ ఆలౌట్
ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఒవల్ లో జరిగిన ఐదో టెస్టులో భారత్ 6 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. దీంతో సిరీస్ ను 2-2తో సమం చేసుకుంది. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఐదో టెస్టులో హైదరాబాద్ కుర్రోడు సిరాజ్ అద్భుతంగా రాణించి భారత్ కు అసాధ్యమనుకున్న విజయాన్ని అందించాడు.
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన ఇంటి అద్దె భత్యం ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఒవల్ లో జరిగిన ఐదో టెస్టులో భారత్ 6 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. దీంతో సిరీస్ ను 2-2తో సమం చేసుకుంది. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఐదో టెస్టులో హైదరాబాద్ కుర్రోడు సిరాజ్ అద్భుతంగా రాణించి భారత్ కు అసాధ్యమనుకున్న విజయాన్ని అందించాడు.
అనకాపల్లి జిల్లాలో పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం చోటుచేసుకుంది. లూపిన్ ఫార్మా కంపెనీలో విషవాయువులు లీకవ్వడంతో ఆరుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు.
భారతీయ రాష్ట్ర సమితి నుంచి ఆ పార్టీ అధినేత కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఉద్వాసన తప్పదా? పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ దిశగా ఆలోచన చేస్తున్నారా? అంటే బీఆర్ఎస్ వర్గాల నుంచి ఔనన్న సమాధానమే వస్తున్నది. కవితను పార్టీ నుంచి బహిష్కరించే దిశగా కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని గట్టిగా చెబుతున్నారు.
తొమ్మిదో తేదీ రాఖీ పండగ వస్తోంది. అన్నా చెల్లెళ్ల బంధం మరంత పెరుగుతుందేమో అని చూస్తే.. కేటీఆర్ టార్గెట్ గా కవిత మరిన్ని అస్త్రాలు సంధించడంతో గులాబీ దళాలు మరింత నీరసపడ్డట్టు తెలుస్తోంది. జగదీశ్వర్ రెడ్డిలాంటి వారి చేత తనను తిట్టించడం వెనక పెద్ద నాయకుడు ఉన్నాడంటూ ఆమె చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయ్.
హైదరాబాద్లో కుండపోత వర్షం కురిస్తోంది. ఒక్కసారిగా వాతావరణం మారింది. దీంతో పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది
సాధారణంగా, ఏ పార్టీ అయినా పార్టీకి కష్టపడి పనిచేసే ఎమ్మెల్యే లేదా ఎంపీని ప్రోత్సహిస్తుంది. పదవులిచ్చి గౌరవిస్తుంది. అసెంబ్లీలో, లోక్ సభలో స్వేచ్ఛగా మాట్లాడి పార్టీ గొంతు, రాష్ట్ర సమస్యలు వినిపించడానికి అవకాశాలు ఇస్తుంది.