Publish Date:Jul 11, 2025
ఏపీకి అప్పులు పుట్టకుండా, పెట్టుబడులు రాకుండా ఒక కుట్ర. అది కూడా విదేశాల నుంచి వైసీపీ చేస్తోన్న పన్నాగం. జర్మనీలో ఒక ప్రముఖ సంస్థలో పని చేసే ఉదయ్ భాస్కర్ అనే ఒక వైసీపీ మద్ధతుదారు చేత బాంబే ఎక్స్ ఛేంజీకి ఏకంగా 200 మెయిళ్లు పంపేలా చేశారంటే పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.
ఈ విషయాన్ని ఏపీ ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. ఆధారాలతో సహా చూపించారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు.. విచారణకు ఆదేశించారు. అంతే కాదు దీని వెనక ఎంతటి వారున్నా వదలకూడదని స్పష్టం చేశారు. దీంతో పాటు.. ఈ విషయం పబ్లిక్ లోకి మరింతగా తీసుకెళ్లే బాధ్యత కూటమి నేతలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.
ఈ విషయంపై స్పందించిన ఆర్ధిక శాఖ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు బుగ్గన... తమ హయాంలో కూడా ఎందరో ఇలాంటి కథనాలు వండి వార్చారు. అలాగని మేము ఆగామా? అంటూ లైట్ తీసుకునే మాటలు మాట్లాడారు. అంతే కాదు.. ఒక మెయిల్ వల్ల మీ రుణాలు, పెట్టుబడులు ఆగిపోతాయా? అని ప్రశన్నించారు. అయితే.. బుగ్గన వ్యాఖ్యలకు స్పందించిన మంత్రి పయ్యావుల కేశవ్.. ఇది స్టేట్ ఫైనాన్షియల్ క్రెడిబిలిటీకి సంబంధించిన విషయంమన్నారు. గతంలో మీ హయాంలో 2024 మార్చిలో 7 వేల కోట్లకు ఇలాగే రుణం కోసం ప్రయత్నించారు. మీపై నమ్మకం లేక పెట్టుబడి దారులు రుణం ఇవ్వలేదు. ఇది విశ్వాసానికీ, విశ్వసనీయతకూ సంబంధించిన అంశం కనుకే.. ఇటువంటి చర్యలను దేశ ద్రోహం కింద తీసుకుని.. తద్వారా.. కేసులు నమోదు చేయాలని సీఎం చంద్రబాబును కోరామని చెప్పారు.
వైసీపీకి తొలి మొదటి నుంచీ ఇలాంటి అలవాటు ఉందనీ, వారు రాష్ట్ర పరువు ప్రతిష్టలను దెబ్బ తీయడమే ధ్యేయంగా పని చేస్తుంటారని.. ఇప్పటి వరకూ అదే జరిగిందనీ అన్నారు. ఈ విషయంపై పూర్తి విచారణ చేసి.. దీని వెనక ఎవరున్నారో కనిపెట్టి తీరాలని పయ్యవుల కేశవ్ అన్నారు. అయినా ఇలాంటి వాటి ద్వారా కూడా నష్టం జరుగుతుందా? అంటే ఇది వరకు హిడెన్ బర్గ్ రిపోర్ట్ అదాని సంస్థలను తీవ్రంగా దెబ్బ తీయలేదా? ఇదీ అలాంటిదేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ కేసు ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి మరి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇలా విద్వేషపూరిత పనులు చేసే వారికి విదేశాల్లో చాలా పెద్ద శిక్షలే వేస్తారు. దానికి తోడు ఇది నైతికతకు సంబంధించిన విషయం. ఇటీవలి కాలంలో కొందరి ఉద్యోగాలు సరిగ్గా ఇలాంటి అనైతిక కార్యకలాపాల వల్లే పోయాయని గుర్తు చేస్తున్నారు. ఉదయ్ భాస్కర్ వంటి వారు ఇలాంటి చర్యలకు పాల్పడే ముందు ఆలోచించాలని సూచిస్తున్నారు నిపుణులు. రాజకీయ ఆరోపణలు చేయడం వేరు. ఇలా పకడ్బందీగా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీసేవిధంగా వ్యవహరించడం వేరని.. ఇలాంటి వారికి గట్టిగా బుద్ధి చెప్పకుంటే కష్టమనీ సూచిస్తున్నారు రాష్ట్ర శ్రేయోభిలాషులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hatred-mails-harmful-to-state-intrests-25-201739.html
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.