హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు.. బీజేపీకి ఓ హెచ్చరిక!

Publish Date:Oct 10, 2024

Advertisement

హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ కు, బీజేపీకి గొప్ప రిలీఫ్ కలిగించాయని పలు విశ్లేషణలు వస్తున్నాయి. అయితే వాస్తవానికి ఆ రెండు రాష్ట్రాల ఎన్నికలలోనూ బీజేపీకి చావుతప్పి కన్నులొట్టపోయిందన్న చందంగానే ఫలితాలు వచ్చాయని రాజకీయ వర్గాలలో ఓ టాక్ నడుస్తోంది. వాస్తవానికి హర్యానాలో బీజేపీకి దక్కింది ఊరటలాంటి విజయమే కానీ, హ్యాట్రిక్ సాధించేశామంటూ భుజాలు తడుముకోవలసిన పని లేదని పరిశీలకులు అంటున్నారు.

హర్యానాలో బీజేపీ గెలుపు పూర్తిగా బీజేపీ యేతర పార్టీల అనైక్యత కారణంగానే అని చెబుతున్నారు. కాంగ్రెస్ అతి విశ్వాసంతో ఆప్ తో పొత్తుకు వెళ్లకపోవడమే ఆ పార్టీ కొంప ముంచింది. అంటే కాంగ్రెస్ వ్యూహాత్మక తప్పిదం బీజేపీ నెత్తిన పాలు పోసిందనే చెప్పాలి. నిజానికి గత పదేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ పై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉంది. దానికి తోడు మోడీ సర్కార్  రైతాంగ వ్యతిరేక విధానాల కారణంగా రైతులూ బీజేపీ పట్ల ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ఎన్నికల ప్రకటనకు ముందే బీజేపీ ఓటమిని అంగీకరించేసిన పరిస్థితి. అందుకే హర్యానాపై బీజేపీ పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. అంతర్గత సంభాషణల్లోనూ, మీడియా చిట్ చాట్ లోనూ కూడా హర్యానా బీజేపీ నేతలు ఈ సారి హర్యానాలో అధికారం చేపట్టడం కష్టమన్న అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. ఆ పార్టీ అంతర్గతంగా చేయించుకున్న సర్వేలు సైతం అదే విషయాన్ని తేటతెల్లం చేశాయి. ఇక ఎగ్జిట్ పోల్స్ అయితే బీజేపీ పరాజయాన్ని  ఖరారు చేసేశాయి. తీరా ఫలితాలు వెలువడిన తరువాత  బీజేపీ విజయం ఆ పార్టీకే ఆశ్చర్యం కలిగించిందనడంలో ఇసుమంతైనా ఆశ్చర్యం లేదు.

అందుకే జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ పరాజయాన్ని తక్కువ చేసి చూపి అక్కడ బలోపేతమయ్యామంటూ సొంత భుజాలను చరుచుకుంటోంది. హర్యానా ఎన్నికలలో పోలింగ్ సరళిని చూస్తే బీజేపీ సొంత బలంతో కాక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక కారణంగానే విజయం సాధించిందన్నది తేటతెల్లమౌతోంది. ఈ ఎన్నికలలో దాదాపు రెండు శాతం ఓట్లు సాధించిన ఆప్ గేమ్ ఛేంజర్ గా నిలిచింది. విజయంపై అతి విశ్వాసంతో ఆప్ తో పొత్తుకు నో అన్న కాంగ్రెస్ ఫలితం అనుభవించింది. 

ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే ఇక్కడ ఇండియా కూటమి విజయం   బీజేపీకి నిజంగా శరాఘాతమే. అత్యంత కీలకమైన ఈ రాష్ట్రంలో ఎలాగైనా అధికారం చేపట్టాలన్నది బీజేపీ ధ్యేయం. అందుక గతంలోనే ఎన్నో విన్యాసాలు చేసింది. సైద్ధాంతిక సారూప్యత అన్నది ఇసుమంతైనా లేని పీడీపీతో పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో అధికారంలో భాగస్వామి అయ్యింది. ఆ పొత్తు విచ్ఛిన్నమైన తరువాత రాష్ట్రంలో ఎన్నికలకు జరగలేదు. రాష్ట్రపతి పాలనే కొనసాగింది. అంటే దాదాపుగా జమ్మూ కాశ్మీర్ కేంద్రంలోని మోడీ సర్కారే గుప్పెట్లో పెట్టుకుంది. ఆ తరువాత ఆర్డికల్ 370ని రద్దు చేసి ఎన్నికలలో లబ్ధి పొందేందుకు శతథా ప్రయత్నించింది. ఇంత కాలం దూరం పెట్టిన రామ్ మాధవ్ ను మళ్లీ తీసుకువచ్చి రాష్ట్ర ఇన్ చార్జిగా నియమించింది. తిమ్మిని బమ్మిని బమ్మిని తిమ్మిని చేసైనా గెలవాలని భావించింది. అయితే బీజేపీని జమ్మూ కాశ్మీర్ జనం నమ్మలేదు. కాంగ్రెస్ నేతృత్వంతోని ఇండియా కూటమికే పట్టం కట్టారు.  దీంతో పైకి గంభీరంగా హర్యానా విజయాన్ని మోడీ సర్కార్ పట్ల ప్రజలలో ఉన్న ఆదరణకు నిదర్శనంగా చెప్పుకుంటున్నా,   జమ్మూకాశ్మీర్ ఓటమి బీజేపీకి శరాఘాతంగానే చెప్పుకోవాలి. 

By
en-us Political News

  
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.