హస్తం గూటికి హరీష్..? బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణ!

Publish Date:Apr 29, 2024

Advertisement

హరీష్ రావు.. బీఆర్ఎస్ లో అధిష్ఠానం పెద్దగా ఇష్టపడని కీలక నేత. పార్టీలో ఆల్ఈజ్ వెల్ పరిస్థితి ఉన్న సమయాలలో ఆయనకు ఎప్పుడూ పెద్ద ప్రాధాన్యత లభించలేదు. అదే పార్టీ ఇబ్బందుల్లో ఉన్నా, అసంతృప్తి నేతలను బుజ్జగించాలన్నా పార్టీ హైకమాండ్ కు ముందుగా గుర్తుకు వచ్చేది హరీష్ రావే. ఆఘమేఘాల మీద ఆయన మెడలో వీరతాళ్లేసేసి పార్టీని ఇబ్బందుల నుంచి గట్టెక్కించుందుకు తెరమీదకు తీసుకు వస్తుంటుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడు విపక్షంలో ఉన్నప్పుడు కూడా పార్టీ సమస్యల పరిష్కారం విషయంలో హరీష్ రావుపైనే ఆధారపడుతున్న పరిస్థితి ఉంది. 

బీఆర్ఎస్ 2018 ఎన్నికలలో విజయం సాధించి రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్ ఆయనను కేబినెట్ లోకి తీసుకోకుండా పక్కన పెట్టారు. కేటీఆర్ కు సీఎం పగ్గాలు అప్పగించే విషయంలో హరీష్ రావుతో ట్రబుల్స్ వస్తాయన్న అంచనాతోనే అప్పట్లో హరీష్ రావును పక్కన పెట్టారని కూడా అప్పట్లో గట్టిగా వినిపించింది. కారణాలేమైతేనేం మంత్రివర్గ విస్తరణలో ఆయనకు అవకాశం కల్పించక తప్పలేదు కేసీఆర్ కు. ఇప్పుడు బీఆర్ఎస్ విపక్షంలో ఉన్న సమయంలో కూడా హరీష్ రావు పార్టీకి బలం, బలహీనతగా మారిపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అధికారంలో లేకపోవడంతో పార్టీలో గతంలోలా కేసీఆర్ మాట చెల్లు బాటు కావడం లేదంటున్నారు. ఇందుకు ఉదాహరణగా పార్టీ శాసనసభాపక్ష నేతగా కేటీఆర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి ఎమ్మెల్యేలు ససేమిరా అనడమేనని చెబుతున్నారు. అప్పట్లో హరీష్ రావును శాసనసభాపక్ష నేతను చేయాలని పలువురు ఎమ్మెల్యేలు గట్టిగా పట్టుబట్టినట్లు పార్టీ వర్గాలే చెప్పాయి. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో, అయిష్టంగానైనా కేసీఆర్ సీఎల్పీ నాయకుడిగా బాధ్యతలు చేపట్టారు. అయినా ఆ హోదాలో ఆయన అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కాలేదు అది వేరే సంగతి.

ఇప్పుడు కూడా కేసీఆర్, కేటీఆర్ కంటే హరీష్ రావే కాంగ్రెస్ పై విమర్శల విషయంలో, సవాళ్ల విషయంలో ఒకింత దూకుడు కనబరుస్తున్నారు. అటువంటి హరీష్ రావే తన మద్దతు దారులతో అంటే 20 మందికి పైగా ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ గూటికి చేరితే.. రాష్ట్రంలో ఇక బీఆర్ఎస్ ఉనికి మాత్రంగానైనా మిగులుతుందా? అయినా అసలు హరీష్ రావు ఏమిటి? కాంగ్రెస్ గూటికి చేరడమేమిటి? అనుకుంటున్నారా? 

ఇటీవలి కాలంలో మంత్రులు కోమటరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఒకటి రెండు సందర్భాలలో పాతిక మంది వరకూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు. ఏ క్షణంలోనైనా వారు కాంగ్రెస్ గూటికి చేరవచ్చు అని చెప్పిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా బీజేపీ శాసనసభాపతి ఏలేటి మహేశ్వరరెడ్డి కూడా అదే ఆరోపణ  చేశారు. ఎన్నికల తరువాత హరీష్ రావు 20 నుంచి 22 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని ఆరోపించారు. మెదక్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ తో భేటీ వెనుక ఉన్నది హరీష్ రావేనని ఆరోపించారు.  మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు తమతో టచ్ లో ఉన్నారంటూ చెప్పిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్యా, తాజాగా బీజేపీఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వరరెడ్డి హరీష్ మద్దతు దారులతో కలిసి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోవడానికి రెడీగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్యా దగ్గరదగ్గరగా ఉండటం గమనార్హం. 

By
en-us Political News

  
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-20
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళగిరి, పిఠాపురం నియోజకవర్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించి, ఫలితం ఎలా ఉంటుందన్న ఆసక్తి కలిగిస్తున్నది కడప లోక్ సభ నియోజకవర్గం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నారు. ఆమె ఎంట్రీతో కడప లోక్ సభ నియోజకవర్గ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఫలితాలు అధికారికంగా జూన్ 4న వెలువడతాయి. ఆ లోగా ఏ పార్టీని విజయం వరిస్తుందన్న అంచనాలతో జూన్ 1న ఎగ్జిట్ పోల్స్ వెలువడతాయి. అంతే అంత కంటే ముందు రాష్ట్రంలో విజయం తెలుగుదేశం కూటమిదా? వైసీపీదా అన్న విషయాన్ని సాధికారికంగా ఎవరూ చెప్పే అవకాశం లేదు.
భార‌త‌ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది ఒకరు తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ‌టం క‌ల‌క‌లం సృష్టిస్తోంది. స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జ‌వాన్ అయిన‌ ప్రకాశ్ కాప్డే (39).. సచిన్ వీవీఐపీ సెక్యూరిటీలో విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు. ఆయన ఇటీవలే విధులకు సెలవు పెట్టి స్వ‌గ్రామానికి వెళ్లాడు. ప్ర‌స్తుతం ఇంటి దగ్గరే ఉంటున్నాడు. 
రాష్ట్రంలో ఈ నెల 13న జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో హింస చెలరేగింది. పోలింగ్ పూర్తి కాకముందే పలు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా మాచర్ల,తాడిపత్రి,చంద్రగిరి,నరసరావుపేటలో చోటు చేసుకున్న ఘటనలపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఏపీలో వైసీపీకి ఓటర్లు దిమ్మతిరిగే షాకిచ్చారు. ఫలితాలు వెలువడకుండానే ఓటమి ఖాయమైందని వైసీపీ నేతలు తలలు పట్టుకునేలా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తి ఒటేసి తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల అరాచక, కక్షపూరిత పాలనను కూకటివేళ్లతో పెకిలించివేసేందుకు పోలింగ్ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేసేందుకు బారులు తీశారు.
ఓటమి భయంతో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు దారుణాలకు తెగబడుతున్నాని పులివర్తి నాని అన్నారు.  టీడీపీకి ఓట్లు వేశారని కూచువారిపల్లిలో చిన్న, పెద్ద, ముసలి, ముతకను పట్టుకుని చితక బాదారని, తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని పులివర్తి నాని చెప్పారు.
రాష్ట్రమంతటా ఒకెత్తు.. పాలకొల్లు ఒక్కటీ ఒకెత్తు. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి నిమ్మల రామబానాయుడి విజయంపై విపక్ష వైసీపీ అభ్యర్థికి కూడా ఎలాంటి అనుమానం లేదు.
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో తాజాగా జ‌రిగిన అసెంబ్లీ, లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు సంబంధించిన పోలింగ్ వివ‌రాల‌ను సీఈవో ముఖేష్ కుమార్ బుధ‌వారం నిర్వ‌హించిన ప్రెస్ మీట్ లో పంచుకున్నారు. ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్ న‌మోదైంద‌ని తెలిపారు. పోలింగ్ శాతంతో పాటు రాష్ట్రంలో చోటుచేసుకున్న ప‌లు హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు, భ‌ద్ర‌తా ప‌రంగా తీసుకున్న చ‌ర్య‌ల‌ను గురించి వివ‌రించారు. హింస చోటుచేసుకున్న చోట వెంట‌నే చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని తెలిపారు.
పవన్ విజయం సాధించిన తర్వాత తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని పెద్దాయన మాటిచ్చారు. ఆ మాటపై ఆయన నిలబడతారనే నమ్మకం తమకుంది. కాపులంతా ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని, దీన్ని విజయవంతం చేయాలని, కాకపోతే మీ ఉప్మా, కాఫీలు మీరే తెచ్చుకోవాలంటూ సెటైర్లు
ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ పూర్తి అయిన మరునాటి నుంచి వైసీపీ నేతల స్వరం మారిపోయింది. పరోక్షంగా ఓటమిని ఒప్పకుంటూ, వారికి మాత్రమే సాధ్యమైన విధంగా తమ ఓటమికి కారణం తెలుగుదేశం కారణమని చెప్పుకుంటున్నారు.
తిరుమల నడక మార్గంలో చిరుత పులులు సంచరిస్తుండటం భక్తులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. గతంలో ఏడు కొండల్లోని అడవుల్లో ఉండే చిరుతలు కొంత కాలంగా నడక మార్గం వద్దకు వచ్చేస్తున్నాయి. గత ఏడాది భక్తులపై చిరుతలు దాడి చేసిన ఘటనలు భక్తులను భయభ్రాంతులకు గురి చేశాయి. తాజాగా మరోసారి చిరుత కలకలం చెలరేగింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత కనిపించింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. చిరుతను వెంటనే పట్టుకోవాలని అధికారులను భక్తులు కోరుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.