Publish Date:Aug 31, 2025
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు, అవకతవకల వ్యవహారంలో బీఆర్ఎస్ గాభరా పడుతోంది. భయపడుతోంది. మాజీ మంత్రి హరీష్ రావు కంగారు పడుతున్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బీఆర్ఎస్ ను మరీ ముఖ్యంగా ఆ పార్టీ అగ్రనేతలు కేసీఆర్, హరీష్ రావులను బెంబేలెత్తిస్తోంది. దీంతో కాళేశ్వరం రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా ఆదేశించాలని కోరుతూ హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. ఒక వేళ ప్రవేశపెట్టినా.. ఎలాంటి చర్యా తీసుకోవద్దనైనా ఆదేశించాలని ఆ పిటిషన్ లో కోరారు.
సరే కోర్టు నిర్ణయం ఏమిటన్నది పక్కన పెడితే.. అసలు కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేపెట్టి చర్చిస్తామన్న రేవంత్ సర్కార్ నిర్ణయంపై హరీష్ రావు, కేసీఆర్, బీఆర్ఎస్ లు ఎందుకు అంత గాభరాపడిపోతున్నారు? హరీష్ రావు శనివారం (ఆగస్టు 30) హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం ఆదివారం (ఆగస్టు 31) కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుంది. శనివారం సాయంత్రం వరకూ హరీష్ రావు పిటిషన్ కోర్టులో విచారణకు రాలేదు. అదలా ఉంచితే.. కళేశ్వరం కమిషన్ నివేదికను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలంటూ గతంలోనే హరీష్ రావు, కేసీఆర్ లు పిటిషన్లు వేశారు. కానీ కోర్టు వాటిని నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టి సమగ్రంగా చర్చించిన తదుపరి మాత్రమే చర్యలు తీసుకుంటామని అప్పట్లో ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీంతో నివేదికపై స్టే ఇవ్వడానికి అప్పట్లో కోర్టు నిరాకరించింది.
అయినా హరీష్ రావు కాళేశ్వరం రిపోర్టునున అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా ఆదేశాలివ్వాలంటూ మరో సారి కోర్టును ఆశ్రయించారు. . ఆయన గాభరా ఏమిటంటే.. ఒక సారి కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెడితే.. ఆ తరువాత ఆ నివేదిక చట్టబద్ధతపై కోర్టులు నిర్ణయం తీసుకోజాలవు. అంత మాత్రాన అంతా అయిపోయినట్లు కాదు... ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలంటే మాత్రం చట్టబద్ధంగానే తీసుకోవాలి. అంటే చర్యల అంశం కోర్టు పరిధిలోకి వస్తుంది.
అయినా కూడా అసెంబ్లీలో నివేదిక ప్రవేశపెడతారంటేనే హరీష్ కంగారు పడుతున్నారు. అంటే కాళేశ్వరంలో అవకతవకలు, అక్రమాలు, అవినీతి జరిగిందని పరోక్షంగా అంగీకరించేస్తున్నారా అన్నచర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. అందుకే కాళేశ్వరం కమిషన్ నివదిక అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకోవాలంటూ పదే పదే కోర్టును ఆశ్రయిస్తున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/harishrao-housemotion-petition-shows-fear-39-205335.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.