Publish Date:Aug 31, 2025
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు, అవకతవకల వ్యవహారంలో బీఆర్ఎస్ గాభరా పడుతోంది. భయపడుతోంది. మాజీ మంత్రి హరీష్ రావు కంగారు పడుతున్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బీఆర్ఎస్ ను మరీ ముఖ్యంగా ఆ పార్టీ అగ్రనేతలు కేసీఆర్, హరీష్ రావులను బెంబేలెత్తిస్తోంది. దీంతో కాళేశ్వరం రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా ఆదేశించాలని కోరుతూ హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. ఒక వేళ ప్రవేశపెట్టినా.. ఎలాంటి చర్యా తీసుకోవద్దనైనా ఆదేశించాలని ఆ పిటిషన్ లో కోరారు.
సరే కోర్టు నిర్ణయం ఏమిటన్నది పక్కన పెడితే.. అసలు కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేపెట్టి చర్చిస్తామన్న రేవంత్ సర్కార్ నిర్ణయంపై హరీష్ రావు, కేసీఆర్, బీఆర్ఎస్ లు ఎందుకు అంత గాభరాపడిపోతున్నారు? హరీష్ రావు శనివారం (ఆగస్టు 30) హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం ఆదివారం (ఆగస్టు 31) కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుంది. శనివారం సాయంత్రం వరకూ హరీష్ రావు పిటిషన్ కోర్టులో విచారణకు రాలేదు. అదలా ఉంచితే.. కళేశ్వరం కమిషన్ నివేదికను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలంటూ గతంలోనే హరీష్ రావు, కేసీఆర్ లు పిటిషన్లు వేశారు. కానీ కోర్టు వాటిని నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టి సమగ్రంగా చర్చించిన తదుపరి మాత్రమే చర్యలు తీసుకుంటామని అప్పట్లో ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీంతో నివేదికపై స్టే ఇవ్వడానికి అప్పట్లో కోర్టు నిరాకరించింది.
అయినా హరీష్ రావు కాళేశ్వరం రిపోర్టునున అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా ఆదేశాలివ్వాలంటూ మరో సారి కోర్టును ఆశ్రయించారు. . ఆయన గాభరా ఏమిటంటే.. ఒక సారి కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెడితే.. ఆ తరువాత ఆ నివేదిక చట్టబద్ధతపై కోర్టులు నిర్ణయం తీసుకోజాలవు. అంత మాత్రాన అంతా అయిపోయినట్లు కాదు... ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలంటే మాత్రం చట్టబద్ధంగానే తీసుకోవాలి. అంటే చర్యల అంశం కోర్టు పరిధిలోకి వస్తుంది.
అయినా కూడా అసెంబ్లీలో నివేదిక ప్రవేశపెడతారంటేనే హరీష్ కంగారు పడుతున్నారు. అంటే కాళేశ్వరంలో అవకతవకలు, అక్రమాలు, అవినీతి జరిగిందని పరోక్షంగా అంగీకరించేస్తున్నారా అన్నచర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. అందుకే కాళేశ్వరం కమిషన్ నివదిక అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకోవాలంటూ పదే పదే కోర్టును ఆశ్రయిస్తున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/harishrao-housemotion-petition-shows-fear-39-205335.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.