హరీశ్, ఈటల జంపేనా! రేవంత్ చెప్పిందే నిజమా?

Publish Date:Mar 1, 2021

Advertisement

రేవంత్ రెడ్డి మాట వెనుక మర్మం దాగుంటుంది. ఆయన నెట్ వర్క్ ఓ రేంజ్ లో ఉంటుంది. రేవంత్ ఒక డైలాగ్ వేశారంటే దానికి ఎంతో లెక్క ఉంటుంది. తెలంగాణ ఆక్టోపస్ రేవంత్ రెడ్డి. గతంలో టీఆర్ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పార్టీని వీడుతారని అందరికన్నా ముందే చెప్పింది రేవంత్ రెడ్డినే. అచ్చం ఆయన చెప్పినట్టే జరిగింది. అప్పటి వరకూ కొండాపై ఎవరికీ అనుమానం  లేకుండే. కానీ, రేవంత్ చెప్పినట్టే జరిగింది. కొన్ని రోజులకే ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ ను వీడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. లేటెస్ట్ గా రేవంత్ రెడ్డి మరో బాంబు వేశారు. టీఆర్ఎస్ లో ఇప్పటికే మంత్రి ఈటల రాజేందర్ పని అయిపోయిందని.. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత హరీశ్ రావు పని కూడా అయిపోతుందని రేవంత్ రెడ్డి సంచలన కామెంట్లు చేశారు. ఈసారి కూడా రేవంత్ రెడ్డి చెప్పినట్టే జరుగుతుందా? అధికార పార్టీలో అలజడి పక్కానా? ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్.

హరీశ్ రావు పని అయిపోయిందా?

కల్వకుంట్ల ఫ్యామిలీలో జరిగే రాజకీయ డ్రామా ఓ పట్టాన బయటి వారికి అర్థం కాదు. ఒక్క రేవంత్ రెడ్డికి తప్ప. మామకు అల్లుడి గండం ఉందంటూ మొదటి నుంచీ ప్రచారం. హరీశ్ రావు ఎప్పటికైనా ఏకు మేకవుతాడని కేసీఆర్ కు భయం. అందుకే, కొడుకు కేటీఆర్ కు లైన్ క్లియర్ చేసేందుకు.. హరీశ్ ను నెంబర్ టూ పొజిషన్ నుంచి తప్పించారు. నెంబర్ జీరో చేశారు. ఒకప్పటి ట్రబుల్ షూటర్ ఇప్పుడు ట్రబుల్స్ లో ఉన్నారు. హరీశ్ రావు పేరుకే టీఆర్ఎస్ లో ఉన్నారు. పార్టీలో ఆయన రోల్ జీరో. పేరుకే ఆయన ఆర్థిక మంత్రిగా మంచి పదవిలో ఉన్నారు. ప్రభుత్వంలో ఆయనకు జరిగే మంచంటూ ఏమీ లేదు. హరీశ్ రావు కారు పార్టీకి గోడ మీది పిల్లిలా మారారని అంటుంటారు. ఇలా కేసీఆర్ గ్రాఫ్ పడిపోగానే.. పార్టీని చీల్చి అలా జంప్ అయిపోదామనే ఆలోచనతో ఉన్నాడనేది కొందరి మాట. గత ఎన్నికల్లో గజ్వేల్ లో స్వయానా కేసీఆర్ ను ఓడించేందుకు హరీశ్ రావు ప్రయత్నించారని అప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్య్రర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఏకంగా బహిరంగ సభ వేదిక మీది నుంచే ప్రకటించడం సంచలనం. హరీశ్ రావు కుట్రలు ఆ రేంజ్ లో ఉంటాయని చెబుతుంటారు. హరీశ్ రావుతో పడలేకే, ఒకప్పటి టీఆర్ఎస్ కీలక నేత, ప్రస్తుతం బీజేపీలో ఉన్న రఘునందన్ రావు పార్టీని వీడారు. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సైతం హరీశ్ రావు అంటే వామ్మో అంటారు. అంతటి ఖతర్నాక్ లీడర్ హరీశ్ రావు. అంతకుమించి మాస్టర్ మైండ్ కేసీఆర్. అందుకే మామ ముందు అల్లుడి పప్పులేమీ ఉడకడం లేదట. ఇక మామ చెంతన ఉంటే తనకు భవిష్యత్ ఉండదని భావిస్తున్న హరీశ్.. అదును కోసం ఎదురు చూస్తున్నారని చెబుతుంటారు. దుబ్బాక ఎన్నికతో పార్టీలో హరీశ్ రావు ఇమేజ్ దారుణంగా డ్యామేజ్ అయింది. అందుకే, ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత హరీశ్ రావు పని అయిపోతుందని రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ త్వరలోనే నిజమైనా ఆశ్చర్యపోనక్కరలేదు అంటున్నారు.

ఈటల పని కూడా అయిపోయిందా?

ఆరోగ్యశాఖ మంత్రి ఈటల. ఉద్యమ సమయంలో పార్టీలో నెంబర్ టూ. ఫస్ట్ టర్మ్ ప్రభుత్వంలోనూ టాప్ ప్లేస్. సెకండ్ టర్మ్ వచ్చే సరికి అంతా ఉల్టా పల్టా. ఈటల పార్టీని వీడిపోతారంటూ ఒకటే ప్రచారం. కేసీఆర్ తో విభేదాలంటూ లీకులు. ప్రచారానికి తగ్గట్టే పరిస్థితులూ కనిపిస్తున్నాయి. కీలకమైన ఆర్ధికం నుంచి ఆరోగ్యానికి డిమోషన్. అంతర్గత సమావేశాల సమాచారం మీడియాకు, విపక్షాలకు లీక్ చేస్తున్నారంటూ ఈటలను దోషిగా నిలబెట్టే ప్రయత్నం. అందుకే, ఒళ్లు మండి, తీవ్ర అసహనానికి లోనై.. కడుపులోని ఆవేశం బయటకు కక్కేశారు ఈటల. గులాబీ జెండాకు అసలైన ఓనర్లం తామేనంటూ గులాబీ బాస్ పై ఎర్రజెండా ఎగరేశారు మంత్రి ఈటల. ఆ తర్వాత నుంచీ పార్టీలో ఆయన ప్రాధాన్యం మరింత తగ్గుతూ వస్తోంది. ఈలోగా కరోనా రావడంతో కేవలం ఆరోగ్య శాఖ కార్యకలాపాలకు మాత్రమే పరిమితమయ్యారు. ఇటు పార్టీ, అటు ప్రభుత్వంలో ఈటల గ్రాఫ్ రోజురోజుకీ పడిపోతోంది. తాజాగా,  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి టీఆర్‌ఎస్‌ సన్నద్ధతపై సీఎం కేసీఆర్‌ నిర్వహించిన సమీక్షా సమావేశానికి మంత్రి ఈటల రాజేందర్‌కు ఆహ్వానం అందలేదు. ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని పలు గ్రామాలు వరంగల్‌ అర్బన్‌ జిల్లా పరిధిలోకి వస్తాయి. అంటే, వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం పరిధిలో ఈటల సొంత నియోజకవర్గం గ్రామాలూ ఉన్నాయి. అయినప్పటికీ.. ఆయనను సీఎం వద్ద జరిగిన భేటీకి పిలవలేదు. ఈటల వైఖరి మారిన కారణంగానే ఆయనను టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం కొంత దూరం పెడుతున్నట్లు ఇప్పటికే పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో కరీంనగర్ నుంచి టీఆర్ఎస్ తరఫున ఎంపీగా పోటీ చేసిన వినోద్ కుమార్ కు ఈటల రాజేందర్ సహకరించలేదని, ఆయన కుట్రతోనే వినోద్ కుమార్ ఓడిపోయారని.. అప్పటి నుంచి కేసీఆర్ ఈటల రాజేందర్ ను పక్కన పెట్టారని అంటుంటారు. ఈటల సైతం కేసీఆర్ తీరుపై తీవ్ర అసహనంతో రగిలిపోతున్నారని.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం కోసం వేచి చూస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. లేటెస్ట్ గా రేవంత్ రెడ్డి సైతం టీఆర్ఎస్ లో ఈటల పని అయిపోయిందని అనడంతో.. ఇక ఈటల పని అయిపాయ్.. అంటూ అంతా ఫిక్స్ అయిపోతున్నారు. 

టీఆర్ఎస్ లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఇద్దరు నేతలు ఈటల, హరీశ్ రావుల ప్రభ ఇప్పుడు మసకబారిపోయింది. తెలంగాణ ఆక్టోపస్ రేవంత్ రెడ్డి చెప్పినట్టు త్వరలోనే వారిద్దరి పని అయిపోతుందా? అనే చర్చ మొదలైంది. ఏమో.. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.

By
en-us Political News

  
నార్సీ వ్యాధికి వున్న కొన్ని లక్షణాలను ఫస్ట్ పార్ట్.లో చెప్పడం జరిగింది. ఈ మానసిక వ్యాధిగ్రస్థులకి వుండే మరికొన్ని లక్షణాలను చూద్దాం.
మనీలాండరింగ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఇప్పట్లో ఊరట లభించే అవకాశాలు కనిపించడం లేదు. ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే . గత ఏడాది ఫిబ్రవరి 26న అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ సిఎం మనీష్ సిసోడియాకు ఇంత వరకు బెయిల్ లభించలేదు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. అసలు స్వరూపం ఏమిటో మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ బట్టబయలు చేశారు. ఆ యాక్ట్ ను తీసుకువచ్చేసి.. ఇంకా అమలులోకి రాలేదు. పరిశీలనలో ఉంది అంటూ ఏపీ మంత్రులు చేస్తున్న ప్రకటనల డొల్ల తనాన్ని ఆయన ఒకే ఒక్క ట్వీట్ తో బయటపెట్టేశారు. తాను ప్రత్యక్ష బాధితుడిని అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు రాష్ట్రంలో దుమారం రేపుతోంది. జగన్ ప్రభుత్వ దొడ్డిదారి యవ్వారాల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
జగన్‌కి వున్న మానసిక వ్యాధి గుట్టు రట్టయింది.. ఆ వ్యాధి పేరు ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’, షార్ట్‌కట్‌లో ‘నార్సీ’ అంటారు.
హైదరాబాద్ బిజెపి అభ్యర్థి మాధవిలత తరపున కేంద్ర హోం మంత్రి అమిత్ షా రోడ్ షో తర్వాత కాంగ్రెస్, ఎంఐఎం ఒక్కటయ్యాయి. ప్రత్యర్థి బిజెపి అభ్యర్థిని ఎదుర్కోవడానికి ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించాలని నిర్ణయించాయి.
ఒక నాయకుడు ప్రజల విశ్వాసాన్ని పొందాలంటే వారి మనస్సులు గెలవాలి. అయితే ఇంట్లోనే ఆయన తీరుకు, వైఖరికీ నిరసన వ్యక్తం అవుతుంటే..సొంత కుటుంబ సభ్యులే బయటకు వచ్చి తమ వారిని నమ్మొద్దని చెబుతుంటే ఆ నేతను జనం ఎలా నమ్ముతారు. ఎందుకు విశ్వసిస్తారు. ముందు ఇంట గెలు.. ఈ తరువాత రచ్చగెలవడం గురించి ఆలోచించు అంటారు కదా?
ఏపీ ఇన్‌ఛార్జ్ డీజీపీగా శంఖబ్రతా బాగ్చి నియమితులయ్యారు. ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయి డీజీపీని నియమించేవరకు బాగ్చి డీజీపీ
చంద్రబాబు చండ్ర నిప్పులు చెరిగారు. తన స్వభావానికి విరుద్ధంగా ఆగ్రహాన్ని ప్రదర్శించారు. స్కిల్ కేసులో తనను అక్రమంగా అరెస్టు చేసిన్పుడు కూడా ఆయన శాంతంగానే ఉన్నారు. న్యాయస్థానాలలోనే తేల్చుకుంటానని, తనపై కేసే తప్పంటూ క్వాష్ పిటిషన్ వేశారు. ఎక్కడా ఆగ్రహం ప్రదర్శించలేదు. జనాలకు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల సంఘం ఎట్టకేలకు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎ వేటు వేసింది. అయితే ఇప్పటికే ఆలస్యమైపోయిందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఎన్నికల సంఘం తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విపక్షాల ఫిర్యాదులు, ఆరోపణలకు పూచికపుల్ల విలువ ఇవ్వకుండా ఎన్నికల సంఘం వ్యవహరించిందని అంటున్నారు.
ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటలాంటిదని చెప్పవచ్చు. పార్టీకి వ్యతిరేక పవనాలు వీచిన 2019 ఎన్నికలలో కూడా ప్రకాశం జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలలో తెలుగుదేశం విజయం సాధించింది. అయితే దర్శినియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ఒకింత భిన్నంగా మారాయి.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం (మే6) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 19 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
డాక్టర్ గౌతమ్ అంబటి రాంబాబు కుమార్తె డాక్టర్ వెంకట మనోజ్ఞకు భర్త. ఈ మేరకు ఆయన ఆదివారం నాడు ఒక షాకింగ్ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో ఆయన... ‘‘నాపేరు డాక్టర్ గౌత్. నేను సిట్టింగ్ ఎమ్మెల్యే, మినిస్టర్ అయిన అంబటి రాంబాబు అల్లుడిని.....
కాపులందరికీ తానే ప్రతినిధినని చెప్పుకునే ముద్రగడ పద్మనాభాన్ని ఆయన కుమార్తె క్రాంతి తీసి అవతల పారేసిన విషయం తెలిసిందే
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.