సిద్దిపేట నియోజకవర్గంలో మొక్కల సంరక్షణకై హరిష్ రావు ప్రత్యేక శ్రద్ద

Publish Date:Oct 17, 2019

Advertisement


మనం ఒకప్పుడు విన్న  డైలాగ్   ఇప్పుడు  కళ్ళ ముందు  కనిపిస్తుంది మొక్కె కదా అని పీకేస్తే పీక తెగుద్ది ఇది ఓ పాపులర్ సినిమా లోని డైలాగ్ ఇప్పుడు సిద్దిపేటలో ఇదే జరుగుతుంది. కాకపోతే పీక తెగకుండా మొక్క పీకితే జేబులు ఖాళీ కావచ్చు, జైలుకు వెళ్లవచ్చు, హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను ఎవరు ధ్వంసం చేసిన అనుమతి లేకుండా కొమ్మలూ నరికిన మొక్కలకు అమర్చిన ట్రీగార్డు ఎత్తుకెళ్లిన జరిమానాలు విధిస్తున్నారు. లేదంటే కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారు. సిద్దిపేటలో ఇప్పటికే జరిమానాలతో పాటు కేసులు కూడా నమోదయ్యాయి.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కల సంరక్షణకు సిద్దిపేటలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. హార్టికల్చర్ అధికారులు ఆకస్మిక తనిఖీలను చేపడుతున్నారు. మొక్కల సంరక్షణలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా, తొలగించిన సదరు వ్యక్తులపై అక్కడికక్కడే చర్యలు తీసుకుంటున్నారు, జరిమానాలు విధిస్తున్నారు.

మొక్క, చెట్టు ఏజ్ ను బట్టి వెయ్యి నుంచి గరిష్ఠంగా ఇరవై ఐదు వేల వరకు జరిమానా విధిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే పట్టణంలో మొక్కల నరికిన దాదాపు పదిహేను మందికి జరిమానాలు విధించారు. వీరిలో కొందరిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. ముఖ్యంగా పట్టణాల్లో సీసీ ఫుటేజ్ ఆధారంగా మొక్కలు నరికిన వ్యక్తులను గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. రోడ్డుపై లేదా డివైడర్లపై మొక్కలూ చెట్లూ పడిపోయి ఉన్న ట్రీగార్డులు ఎత్తుకెళ్లిన, ఎంక్వైరీ చేసి మరీ జరిమానాలు విధిస్తున్నారు.ఇప్పటిదాక జరిమానాల ద్వారా దాదాపు నలభై వేల రూపాయలు మునిసిపల్ అకౌంట్ లో జమ చేశారు.

మాజీ మంత్రి హరీశ్ రావు సిద్దిపేట నియోజకవర్గంలో మొక్కల రక్షణకు అనుక్షణం తపిస్తున్నారు. చెట్టు పడింది కనపడటం లేదా అంటూ అక్కడే నిలదీస్తారు. ఇటీవల సిద్దిపేట పట్టణంలో పర్యటిస్తున్న హరీశ్ రావు పాత బస్టాండ్ కరీంనగర్ రోడ్డులో ఒక షాపు ముందు పడి ఉన్న చెట్టును గమనించి కారులోంచి దిగి నేరుగా షాపు యజమాని దగ్గరికి వెళ్లారు.

ఏం బాబు చెట్టు కింద పడింది కనబడటం లేదా షాపు ఓపెన్ చేసేటప్పుడు చెట్టును చూడలేదా రోజు ఉన్న చెట్టు లేదని గమనించలేదా చెట్టంటే అంత నిర్లక్ష్యమా అని షాపు యజమానిని నిలదీశారు. అక్కడే ఉండి అతనితో కింద పడిన మొక్కను కర్రతో కట్టించి సరి చేపించారు. మన ప్రాణం ఎంతో మొక్క ప్రాణం అంతే అని మరోసారి మొక్కను నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరించారు. అలాగే ప్రభుత్వ శాఖలను కూడా ఆయన వదిలిపెట్టటం లేదు.

ఇటీవల సిద్దిపేట నుండి సీతారాంపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గాన వెళ్తూ పట్టణంలోని ముస్తాబాద్ రోడ్డులో చెట్లను నరకడం గమనించిన హరీశ్ రావు కారులోంచి దిగి చెట్ల కొమ్మలు తీసేస్తున్న విద్యుత్ లైన్ మెన్ పై సీరియస్ అయ్యారు. విద్యుత్ డీఈ, ఏఈలపై ఫోన్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము మొక్కలు నాటుతూ పోతే మీరు నరుక్కుంటూ పోతారా అని సీరియస్ అయ్యారు.

శాఖల మధ్య సమన్వయంతో వ్యవహరించి చెట్లను సంరక్షించాలని సూచించారు. చెట్లను నరకొద్దు ఇబ్బందిగా ఉన్న కొమ్మలను కట్ చేయాలి తప్ప గొడ్డలిపెట్టి నరకొద్దు. మొక్కలు తీసేస్తే చర్యలు తప్పవని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. మొత్తమ్మీద హరితహారం కార్యక్రమంతో సిద్దిపేటని హరితవనంగా మార్చడానికి అటు హరీశ్ రావు ఇటు అధికారులు అహర్నిశలు కృషి చేస్తున్నారు.  

By
en-us Political News

  
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు.
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ పట్ల దురుసుగా వ్యవహరించి గాయపరచడాన్ని ఖండిచిన ఆయన రక్త గాయమైనా రాహుల్ గాంధీ వెనక్కు తగ్గకుండా పోరాట పటిమ చూపారని కొనియాడిన రేవంత్ రె్డి.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే ప్రాథమిక హక్కులపై కేంద్రం ప్రత్యక్ష దాడికి పాల్పడిందని విమర్శించారు.
తోపులాటలో రాహుల్ గాంధీ గాయపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం కారింది. పోలీసులు ఆయనను బలవంతంగా నిలువరిస్తున్న సమయంలో ఆయన ముక్కుకు గాయమై రక్తం కారుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. దీనిపై సర్వ్రతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
మద్యం కుంభకోణంలో ఈడీ విచారణ.. ప్రధాన లబ్ధిదారుడికి చేరువ అవుతోందనీ, ఈ నేపథ్యంలోనే జగన్ పేరు ప్రచారంలోకి వచ్చిందని అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ తనకు నోటీసులు పంపే అవకాశం ఉందన్న సమాచారంతోనే మోడీ, అమిత్ షాల అప్పాయింట్ మెంట్ కోసం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.