తెరాస, తెదేపాలు సవాళ్ళు దేనికి?

Publish Date:Jun 1, 2013

Advertisement

 

 

 హరీష్ రావు: తెలంగాణాకి అనుకూలంగా లేఖ ఇచ్చి, పార్లమెంటులో తెలంగాణా బిల్లుకు మద్దతు ప్రకటించి, అధికారంలోకి వస్తే తెలంగాణకు చెందిన దళిత వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేస్తానని హామీ ఇస్తే, తెరాసను తెదేపాలో విలీనం చేయడానికి మేము సిద్దం.

 

రేవంత్ రెడ్డి: హరీష్ రావు ప్రతిపాదనను మేము స్వాగతిస్తున్నాము. అయితే, దానిని తెరాస రాజకీయ కమిటీలో ఆమోదించి, కేసీఆరే స్వయంగా లిఖిత పూర్వకంగా ఇస్తే, మేము కేసీఆర్ కేంద్రానికి వ్రాసి పంపదలచిన ఏ లేఖమీదయినా సంతకం పెట్టడానికి సిద్దం.

 

తెలంగాణా ఇస్తే తెరాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని కేసీఆర్ చెపితే, ఆయన మేనల్లుడు హరీష్ రావు మూడు షరతుల మీద తమ పార్టీని తెదేపాలో విలీనం చేస్తామని తాజాగా ప్రకటించడం, దానిని తెదేపా స్వాగతించడంపై ప్రస్తుతం రాజకీయ వర్గాలలో రసవత్తర చర్చ జరుగుతోంది.

 

సీమంద్రా పార్టీలయిన తెదేపా, వైకాపాలను తెలంగాణా నుండి తరిమికొట్టాలని కేసీఆర్ పిలుపునిస్తుంటే, హరీష్ రావు అదే సీమంద్ర పార్టీలో తమ ఉద్యమ పార్టీని విలీనం చేస్తామని చెప్పడం చూస్తే, రఘునందన్ రావు చెప్పినట్లు తెరాసలో ఆధిపత్యపోరు సాగుతోందని, హరీష్ రావు, కేసీఆర్ ల మధ్య తీవ్ర విభేదాలున్నట్లు స్పష్టం అవుతోంది. లేకుంటే ఆయన ఇటువంటి కీలకమయిన ప్రతిపాదన తనంతట తానుగా చేయడానికి సాహసించేవారు కాదు. అందుకే, తెదేపా నేత రేవంత్ రెడ్డి ‘ఈ ప్రతిపాదనకు కేసీఆర్ ఆమోదం ఉందా లేదా? అని ప్రశ్నించారు.

 

ఏమయినప్పటికీ, హరీష్ రావు ప్రకటన తెలంగాణా ఉద్యమాలలో తెరాస నిబద్ధతపై అనుమానాలు రేకెత్తిస్తోంది. అసలు ఆ పార్టీ లక్ష్యం తెలంగాణా సాధనా లేక వచ్చే ఎన్నికలలో విజయం సాదించడమా? అనే అనుమానం రేకెత్తిస్తోంది. కానీ, ఇటువంటివి వాటిని అవలీలగా కొట్టిపారేయగల వాక్చాతుర్యం కేసీఆర్ స్వంతం గనుక, పార్టీలో లొసుగులు బయటపడకుండా, ఏదో ఒక మెలికతో ఆయన బంతిని మళ్ళీ తెదేపా కోర్టులో పడేయడం ఖాయం.

 

ఇక, రేవంత్ రెడ్డి కూడా హరీష్ రావు ప్రతిపాదనను స్వాగతించడం చూస్తే, మరి ఆయన ప్రతిస్పందనకు చంద్రబాబు ఆమోదం ఉందాలేదా? అనే సంగతి ఆయనే స్పష్టం చేయాలి. వచ్చే ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న చంద్రబాబుని కాదని, తెలంగాణకు చెందిన ఒక దళిత వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని పార్టీ తరపున ఆయన చెప్పడం ఎంతవరకు సాధ్యమో, అది సాధికార ప్రతిస్పందనో కాదో ఆయనే చెప్పాలి.

 

ఈ మద్య తరచుగా తెరాస నేతలు, “తెదేపాలో అయితే చంద్రబాబు లేకుంటే బాలకృష్ణ తప్ప తెలంగాణకు చెందిన వారు ఎన్నటికీ ఆ పార్టీ అధ్యక్షులు కాలేరు, ముఖ్యమంత్రి అసలే కాలేరని” తెదేపాలో తెలంగాణా నేతలను రెచ్చగొడుతున్నారు. బహుశః తెదేపాలో తెలంగాణా నేతలు వారి మాటలకు ప్రభావితమయినందునే లోనయ్యరేమోనని రేవంత్ రెడ్డి ప్రతిస్పందన అనుమానాలు రేక్కిత్తిస్తోంది.

 

వచ్చేఎన్నికలలో కాంగ్రెస్, వైకాంగ్రెస్ పార్టీలు ఒకవేళ చేతులు కలిపితే, వాటిని ఎదుర్కోవడానికి మళ్ళీ తెదేప, తెరాసలు పొత్తులు పెట్టుకొని ఎదుర్కొనే అవకాశం ఉందని కూడా ఈ సవాలు, ప్రతిసవాళ్ళు అన్యాపదేశంగా చెపుతున్నట్లు భావించవచ్చును.

 

ఏమయినప్పటికీ, తమ ఉనికిని నిలుపుకోవడానికి తిప్పలుపడుతున్న తెదేపా, తెరాసాలు ఇటువంటి వివాదాస్పద ప్రకటనలు, విమర్శలు, సవాళ్ళు ప్రతిసవాళ్ళతో మీడియా ద్వారా జనం నోళ్ళలో నిత్యం నానేలా చూసుకొంతున్నాయని చెప్పవచ్చును.

By
en-us Political News

  
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నార‌న్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణ‌లో తీన్మార్ మ‌ల్ల‌న్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భార‌త్ పర్యటనకు వ‌చ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంట‌ర్వ్యూలో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.