హరిరాం అక్రమాస్తులు.. వంద కోట్లు పైమాటే!?

Publish Date:Apr 28, 2025

Advertisement

కాళేశ్వరం మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్‌ భూక్యా హరిరాంని అక్రమాస్తుల కేసులో అరెస్టు చేసింది  ఏసీబీ. హరిరాంతో సంబంధమున్న 14 ప్రదేశాలతో దాడులు చేసింది అవినీతి నిరోధకశాఖ. ఈ దాడుల్లో భూక్యా హరిరాంకి సంబంధించిన భారీ ఎత్తున అక్రమాస్తులున్నట్టు గుర్తించిన ఏసీబీ  హరిరాంను గజ్వేల్ లో శనివారం (ఏప్రిల్ 26)అరెస్టు చేసింది. ఈ సందర్భంగా హరిరాం విలాసవతంతమైన ఆస్తుల జాబితా విడుదల చేసింది. దాని ప్రకారం చూస్తే..

షేక్‌పేటలో లగ్జరీ విల్లా, కొండాపూర్‌లో లగ్జరీ విల్లా, శ్రీనగర్ కాలనీలో ఫ్లాట్, మాదాపూర్‌లో ఫ్లాట్, నార్సింగిలో ఫ్లాట్, అమరావతిలో ఒక కమర్షియల్ కాంప్లెక్స్, మర్కూక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి, పటాన్‌చెరులో 20 గుంటల భూమి, శ్రీనగర్ కాలనీలో 2 ఇండివిడ్యువల్ హౌసెస్, బొమ్మలరామారంలో ఆరు ఎకరాల్లో మామిడి తోటతో కూడుకున్న ఫామ్ హౌస్. కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న ఒక భవంతి, కుత్బుల్లా పూర్ లో ఓపెన్ ప్లాట్, మిర్యాలగూడలో మరో ఓపెన్ ప్లాట్, ఒక బీఎండబల్యూ కారుతో సహా.. 2 ఇతర వామనాలు తమ సోదాల్లో వెలుగులోకి తీశారు అధికారులు. ఇంకా బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లతో కలుపుకుని సుమారు ఈ అక్రమాస్తుల   విలువ వంద కోట్ల మేర ఉండొచ్చని అంచనా. 

హరిరాంను అదుపులోకి తీసుకుని జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు అధికారులు. కాళేశ్వరం రూపకల్పన, నిర్మాణం నిర్వహణలో తీవ్రమైన లోపాలను బయట పెట్టింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. నివేదిక విడుదలైన కాసేపటికే ఇది జరగడం గమనార్హం.

By
en-us Political News

  
కోకో గింజలు కొనుగోలు ధరపై రాష్ట్ర ప్రభుత్వం ఏలూరు కలెక్టరేట్ లో నిర్వహించిన ద్వైపాక్షిక చర్చలు పూర్తిగా విఫలమైనట్లు ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర నాయకులు ప్రకటించారు.
తెలంగాణలో మొదటి కరోనా కేసు నమోదైంది. హైదరాబాద్, కూకట్‌పల్లిలోని డాక్టర్‌కు కరోనా పాజిటివ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్నిసార్లైనా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని హుగ్గెళ్లి చౌరస్తాలో బసవేశ్వరుడి విగ్రహాన్నిముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
ఏపీ లిక్కర్ స్కామ్‌లో కసిరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కెసిరెడ్డి ఉపేంద్రరెడ్డి, రాజ్‌ కెసిరెడ్డి పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
ఏపీ మాజీ సీఎం జగన్ చాలాకాలం తర్వాత అమరావతి రాజధానిపై విచిత్రంగా స్పందించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇక్కడ ల్యాండ్ స్కామ్ చేస్తుందని పాత ఆరోపణలే తిరిగి గుప్పించారు.
మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణకు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టెటివ్ కమిటీ తెలంగాణ ఛైర్ పర్సన్‌గా డీకే అరుణని నియమించారు.
హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తెలంగాణ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ఆరు వారాల్లో సమగ్ర నివేదిక అందించాలని హైదరాబాద్ సీపీ ఆనంద్‌కు నోటీసులు జారీ చేసింది.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖపై మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కవితతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉత్తరం రాయించారేమోనని ఆయన అన్నారు. తెలంగాణ రాజకీయాల్లో కవిత మరో షర్మిల కాబోతోంది అని హాట్ కామెంట్స్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. కేంద్రమంత్రులతో సీఎం వరుసగా భేటీలు అవుతున్నారు.
క‌ల్వకుంట్ల క‌విత త‌న తండ్రిని విబేధిస్తూ రాసిన లేఖ ఒక చిన్న లీడ్ మాత్ర‌మేన‌ట‌. వ‌చ్చే రోజుల్లో క‌విత నుంచి భారీ బ్లాస్టింగ్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. కార‌ణం క‌విత పార్టీ బ‌య‌ట‌కొచ్చి కొత్త పార్టీ పెట్టేలా ఎత్తుగ‌డ వేస్తున్న‌ట్టు సమాచారం.
తిరుమలలో సదుపాయాలు చాలా మెరుగు పడ్డాయిని ప్రముఖ దర్మకుడు రాఘవేంద్రరావు అన్నారు. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడిని శుక్రవారం ఉదయం పలువురు ప్రముఖులు కలిశారు. సినీ దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌, మాజీ తానా అధ్యక్షుడు వేమన సతీశ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు.
వైసీపీ సోషల్ మీడియా వింగ్ మాజీ హెడ్ సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్ తగిలింది. సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది.
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మళ్లీ కోరలు చాస్తున్నది. 2019 నుంచి 2021 మూడు దశలలో కరోనా మహమ్మరి ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఉసురు తీసింది. జనం నెలల తరబడి కరోనా కర్ఫ్యూ కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు. మాస్కు లేకుండా అడుగు బయటపెట్టలేని పరిస్థితి ఎదుర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ మరో సారి కరోనా విజృంభిస్తోందన్న వార్తలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.