సబితకు చుక్కెదురు.. ఉద్వాసన తప్పదా ?

Publish Date:Jul 6, 2022

Advertisement

కాంగ్రెస్ టికెట్ మీద గెలిచి, తెరాసలో చేరి, ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నవిద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చిక్కుల్లో చిక్కుకున్నారా? ఓ వంక శాఖపరమైన సమస్యలు, మరోవంక రాజకీయ సవాళ్ళు ఒకేసారి దండయాత్ర చేయడంతో ఆమె ఉక్కిరి బిక్కిరి అవుతున్నారా, అంటే, అవును, ఆమె ఒక్కసారిగా ముప్పేట దాడిని ఎదుర్కుంటున్నారు.  ఇంటా బయటా విమర్శలు ఎదుర్కుంటున్నారని, అంటున్నారు.  

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల ఆందోళనను పరిష్కరించే క్రమమలో విద్యార్ధుల డిమాండ్లు సిల్లీగా ఉన్నాయని ఆమె చేసిన వ్యాఖ్యలు, ఆమెనే సిల్లీ మంత్రిని చేశాయి. రాష్ట్రంలోని అత్యంత ప్రతిష్టాత్మక విద్యా సంస్థలలో ఒకటిగా పేరొందిన, బాసర ట్రిపుల్ ఐటీలో కనీస మౌలిక వసతులు లేవని విద్యార్ధులు ఆందోళనకు దిగితే, మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, విధ్యార్దుల డిమాండ్లు సిల్లీగా ఉన్నాయని అన్నారు. ఆమె చేసిన ఆ వ్యాఖ్య పెద్ద దుమారమే రేపింది. ఒక విధంగా విధ్యర్ధులను రెచ్చ గొట్టి, ఉద్యమం ఉధృతం కావడానికి కూడా ఆమె వ్యాఖ్యలే కారణ మయ్యాయి. మరోవంక  విద్యార్ధుల నుంచే కాకుండా సామాన్య ప్రజల నుంచి కూడా ఆమె, విమర్శలు ఎదుర్కున్నారు.

అలాగే, గురుకుల పాఠశాలలలో, పిల్లలకు సన్న బియ్యంతో, పౌష్టిక ఆహారం అందిస్తున్నామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నా, వాస్తవంలో బియ్యంలో పురుగులు వస్తున్న ఉదంతాలు, వెలుగు చూస్తున్నాయి. పిల్లలు పురుగుల అన్న తినలేక పస్తులుంటున్నారు. ఆకలితో  రోదిస్తున్నారు. అస్వస్థకు గురవుతున్నారు. ఇదంతా కూడా ఎక్కడో కాదు, మంత్రి సబితా ఇంద్ర రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజక వర్గం పరిధిలోని, పాఠశాలలలోనే ఈ పరిస్థితులు ఉన్నాయని, మీడియాలో సచిత్ర కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఇక పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల, ఉపాధ్యాయుల కొరత ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనే విమర్శలు ఉండనే ఉన్నాయి. ఇంటర్ పరీక్షా ఫలితాల విడుద ఎన్నిసార్లు సార్లు వాయిదా పడిందో  విద్యాశాఖ  అధికారులకు అయినా తెలుసో లేదో అనుమానమే. నిజానికి లోపం, ఎక్కడుందో కానీ, ఇప్పటికే కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య వాగ్దానం గాలికి వదిలేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం, ఇప్పుడు, సబితా ఇంద్రా రెడ్డి   అవగాహన రాహిత్యం కారణంగా మరింత అభాసు పాలవుతోందని, అంటున్నారు. 

అదొకటి అలా ఉంటే, ముందూ వెనకా చూసుకోకుండా ప్రభుత్వ  పాఠశాలలలో  పని చేసే టీచర్లు అందరూ తమ వార్షిక ఆదాయాన్ని ప్రకటించాలంటూ పాఠశాల విద్యా శాఖ జారీ చేసిన జీవో పెద్ద దుమారమే రేపింది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పాటు.. ప్రతిపక్షాలు కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి.. తప్పుపట్టాయి.  ఉపాధ్యాయులను టార్గెట్‌ చేసి ఉద్దేశ్ పూర్వకంగా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందనే విమర్శలు వచ్చాయి. దీంతో,వెంటనే ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్టు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.

ఇలా అడుసు తొక్కడం, కాలు కడగడం విద్యాశాఖకు, విద్యాశాఖ మంత్రికి అలవాటుగా మారి పోయిందని వస్తున్న విమర్శలు ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చి వేస్తున్నాయని తెరాస శ్రేణులే అంటున్నాయి.   
ఇవన్నీఒకెత్తు అయితే, సొంత పార్టీ నుంచే మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. మంత్రి భూకబ్జాలు ప్రోత్సహిస్తున్నారని, మాజీ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు తీగల కృష్ణా రెడ్డి గత కొద్ది రోజులుగా ఆమెపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అంతే కాకుండా ఆమె భూకబ్జాల చిట్టా మొత్తం బయట పెడతానని బహిరంగంగా ప్రకటనలు గుప్పిస్తున్నారు. తగ్గేదేలే’ అంటూ సవాలు విసురుతున్నారు. మరో వంక సబితా సబితా ఇంద్రారెడ్డి, అలాంటిదేమీ లేదంటూనే, ఉన్నా,  ముఖ్యమంత్రి చూసుకుంటారని, సీఎం చాటున రక్షణ పొందే ప్రయత్నం చేస్తున్నారు.

ఇరువురు నేతల మధ్య బాహాటంగా జరుగుతున్న రగడ పార్టీలో చర్చకు కారణంగా మారింది. పబ్లిక్ లో పార్టీ ప్రతిష్టను దిగజార్చింది.  కాగా, మంత్రి పై తీవ్ర విమర్శలు చేసిన తీగల, కబ్జాకు కాదేదీ అనర్హం అన్నట్లుగా చెరువులు, పాఠశాలల స్థలాలను కూడా సబితా కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. అలాగే, ఆమె రాజకీయ చరిత్రను వదలకుడా తీగల రాజకీయ విమర్శలు చేశారు. రాజకీయ అస్త్రాలు సంధించారు.ను  ఆమె తెరాస టికెట్ మీద గెలలేదని, గుర్తు చేసిన ఆయన, మంత్రి సబితా ఇంద్రారెడ్డి వైఖరిపై సీఎం కేసీఆర్ తో కూడా తాను చర్చిస్తానని పేర్కొన్నారు.

అయితే, రేపో మాపో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమవుతున్న తీగల ఆరోపణలను ముఖ్యమంత్రి ఎంతవరకు సీరియస్ గా తీసుకుంటారనేది,చూడవలసి ఉందని అంటున్నారు. అయితే, విద్యా శాఖ పనితీరు పై వస్తున్న విమర్శలు, రాజకీయంగా వస్తున్న విమర్శల నేపధ్యంలో ముఖ్యమంత్రి, ఆమెకు ఉద్వాసన పలికే అవకాశం లేక పోలేదని పరిశీలకులు అంటున్నారు. అలాగే, ఇంతాకాలం ప్రత్యర్ధులు టార్గెట్ గా ఎన్నికల వ్యూహ రచన చేస్తున్న ముఖ్యమంత్రి, అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ దూకుడు పెంచిన నేపధ్యంలో ఇక పార్టీ, ప్రభుత్వ పక్షాళనపై దృష్టి పెట్టే అవకాశం లేక పోలేదని అంటున్నారు.అదే జరిగితే, కొందరు ఫిరాయింపు మంత్రులకు ఉద్వాసన తప్పక పోవచ్చని, ఆ జాబితాలో సబితా ఇంద్రా రెడ్డి పేరు ఖాయంగా ఉంటుందని అంటున్నారు.

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.