కావటి మనోహర్ రాజీనామా!

Publish Date:Mar 16, 2025

Advertisement

సొంత పార్టీ నేతలపై నమ్మకం పోయిందా?
అవిశ్వాసంతో,పరువు పోగొట్టుకోవడం ఇష్టం లేకే పక్కకు తప్పుకున్నారా! 

గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు ఎందుకు రాజీనామా చేశారు ? అవిశ్వాస పోరాటంలో తాను నెగ్గలేనని మనోహర్ కి ముందే తెలిసిపోయిందా?  పోరాడి ఓడిపోవడం కంటే  ముందే పక్కకు తప్పుకోవడం బెటర్ అనుకున్నారా?  సొంత పార్టీ నాయకులు కనీసం తనకు మద్దతు పలకడం లేదన్న అంతర్మథనం మనోహర్ తో రాజీనామా చేయించిందా? గుంటూరులో మేయర్ రాజీనామాతో, జరగబోతున్న నష్టం ఎవరికి?  ఉన్న అధికారాన్ని కాపాడుకో లేకపోయిన వైసిపి కి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఈ దెబ్బకు గుంటూరులో  వైసిపి పట్టు పూర్తిగా కోల్పోయినట్లేనా? 

గుంటూరు నగరపాలక సంస్థను వైసిపి కోల్పోయింది.. ఆ పార్టీ నాయకుడు,  నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేసేశారు.  ఈ విషయంలో ప్రత్యర్థి కూటమి పార్టీ పవర్ కంటే ,సొంత పార్టీలోని నాయకుల అసమర్ధతే మేయర్ మనోహర్ తో రాజీనామా చేపించిందన్న చర్చ జరుగుతున్నది. నిజానికి మరి కొద్ది రోజుల్లోనే అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు టిడిపి పని మొదలుపెట్టింది.  కానీ టిడిపి చేతిలో దెబ్బతినకుండా, మనోహర్ చేసిన రాజీనామా..  రాజకీయాల్లో హత్యలు ఉండవు..  ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి అన్న దానికి పదానికి ప్రత్యక్ష ఉదాహరణ గా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. 
గుంటూరు కార్పొరేషన్ లో మొత్తం 57 డివిజన్లు ఉన్నాయి. .ఈ డివిజన్లో గతం లో  2021 లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు  46 మంది విజయం సాధించారు. కూటమి పార్టీలకు చెందిన కార్పొరేటర్లు కు 11 సీట్లు మాత్రమే వచ్చాయి.  దీంతో వైసీపీ నుండి కావటి మనోహర్ నాయుడు మేయర్ గా పనిచేస్తున్నారు.  ఐతే 2024 ఎన్నికల్లో ప్రభంజన విజయాన్ని అందుకున్న కూటమి నాయకులు  గుంటూరు మేయర్ స్థానం పై దృష్టి పెట్టారు.  మారుతున్న కాలంతో పాటు, కార్పొరేషన్ లో రాజకీయ నాయకుల్లో కూడా మార్పు వచ్చింది  2024 ఎన్నికలకు ముందే, ఆరుగురు వైసిపి కార్పొరేటర్లు కూటమి పార్టీల వైపు వెళ్లిపోయారు. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో, కూటమి భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో మరో ఆరుగురు కార్పొరేటర్లు కూటమికి జై కొట్టారు.  ఆరు, ఆరు 12 కదా ,ఈ బారా తో హైరానా ఎందుకనుకున్నారు వైసీపీ నేతలు. ఆ తర్వాత ఒక్కొక్క మార్పు జరిగే కొద్దీ , వైసీపీ నాయకులకు టెన్షన్ పుట్టుకొచ్చింది. ఈ వ్యవహారం ఓ వైపు పార్టీకి, మరోవైపు మేయర్ స్థానానికి చేటు తెచ్చేలా ఉంది  అని తెలుసుకున్నా సరే వైసిపి జిల్లా నాయకులు ఆలస్యంగా నిద్ర మేల్కొన్నారు.  ఇక్కడ వైసిపి నాయకులు నిద్ర పోయారు అనడం కంటే ,నిద్ర నటించారు అంటే బాగుంటుందని సొంత పార్టీ కాడరే దుమ్ముత్తిపోసే పరిస్థితికి తీసుకు వచ్చారు వ్యవహారాన్ని. ఈ లోపు కూటమి నాయకులు చేయాల్సిన డ్యామేజ్ అంతా చేసేసారట. 

కూటమి నుంచి విజయం సాధించిన నాయకులు, ఎమ్మెల్యేలు, కేంద్రమంత్రి గుంటూరులోనే మకాం వేసి, తమ దగ్గర ఉన్న వనరులను వైసీపీ కార్పొరేటర్ కు రుచి చూపించారు. దీంతో ఒక్కొక్కరుగా మొదలైన మార్పు వ్యవహారం,  చివరికి పాతిక మంది వైసీపీ కార్పొరేటర్లు, కూటమి పంచన చేరే వరకూ వెళ్లింది.  కౌన్సిల్లో 36 మంది కార్పొరేటర్ల మద్దతు కూడగట్టుకుంది. అనూహ్యంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది.  ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యులకు గాను ఆరుగురు సభ్యులు టిడిపికి చెందినవారు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గెలిచారు. దీంతోనే అర్థం అయిపోయింది  మనోహర్ కు గుంటూరు కార్పొరేషన్ రాజకీయాల్లో ఏం జరగబోతుందో అనేది...... అయితే ఈ వ్యవహారంలో మనోహర్ కు సహకరించాల్సిన సొంత పార్టీ నేతలు ,వెన్నుపోటు పొడిచారట ...స్టాండింగ్ కమిటీలో టిడిపి వాళ్ళు ఎట్టా గెలుస్తారో చూస్తామని, జబ్బలు చరిచిన వాళ్ళు ,చివరి రెండు రోజులు సైలెంట్ అయిపోయి సొంత కార్పొరేటర్ ను కాపాడుకోలేని పరిస్థితికి వచ్చారట.... గుంటూరు నగరంలోనూ జిల్లాలోనూ మా పవర్ ఏంటో చూపిస్తామని ,బీరాలు పలికే కొంతమంది సొంత పార్టీ నాయకుల వ్యవహారం  కళ్లారా చూసిన మనోహర్ వీళ్లేనా పార్టీని కాపాడుకునేది అని అప్పట్లోనే అంతర్మథనానికి గురయ్యారట. తన పక్కన ఉండే  కార్పొరేటర్లను పక్క పార్టీలోకి పంపించిన నాయకులు కొందరైతే,  కార్పొరేటర్లు వెళ్ళిపోతున్నా,  పోతే పోనీ మనకేంటి అని రెచ్చగొట్టిన నాయకులను చూసిన మనోహర్ ఇక కార్పొరేషన్ రాజకీయాల్లో ఉండకూడదని నిశ్చయిం చుకున్నట్లు ప్రచారం ఉంది. ఆ ప్రచారానికి తగినట్లుగానే ఎలాంటి హడావుడీ లేకుండా మేయర్  పదవికి రాజీనామా చేశారు.  

అయితే టిడిపికి చెందిన నాయకులు, మార్చిలో  గుంటూరు మేయర్ ను మార్చేస్తామని చెప్పినట్లుగానే, చెప్పిన పని చెప్పినట్లుగా తమ చేతికి మట్టి అంటకుండా చేసేసారు. నిజానికి, మేయర్ పై అవిశ్వాసం పెట్టాలంటే రాజకీయంగా, న్యాయపరంగా కొన్ని చిక్కులు వస్తాయని టిడిపి ఆలోచించింది.  సొంత పార్టీ కార్పొరేటర్ లను కాపాడుకునే ప్రయత్నాలు రాజకీయ పార్టీలు చేస్తుంటాయి. కానీ గుంటూరులో మాత్రం అలాంటిది జరగలేదు. వైసిపి నిట్ట నిలువునా చేతులెత్తేసింది. ఓ పక్కన కూటమికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్,కీలకంగా మారి గుంటూరులో చక్రం తిప్పుతుంటే , ప్రతిఘటించాల్సిన  వైసిపి నాయకులు బేర్ మన్నారట. దీంతో పెద్ద స్థాయి నాయకులే పార్టీని వదిలి వెళ్ళిపోతుంటే, ఇక మనకెందుకులే అనుకున్నారు క్షేత్రస్థాయిలో కార్పొరేటర్లు.  దీంతో ఎలాంటి ప్రతిఘటన లేకుండానే వైసిపి మేయర్ స్థానాన్ని కోల్పోయింది.... గుంటూరులో ఈ వ్యవహారం ,రాబోయే రోజుల్లో వైసిపి లో ఎలాంటి మార్పులు తీసుకు వస్తుందో చూడాలి.  

By
en-us Political News

  
ఎన్టీఆర్ పుట్ట‌క పోయి ఉంటే సినిమాల్లో మ‌న‌కు స్టార్ డ‌మ్ ఎలాంటిదో తెలిసేది కాదేమో. ఆనాటికి తెలుగు చిత్ర సీమ‌కు అతి పెద్ద హీరో చిత్తూరు నాగ‌య్య‌.. అప్ప‌ట్లో ఇటు చారిత్రక అటు పౌరాణిక అంటూ ఏ పాత్ర చేయాల్సి వ‌చ్చినా ఆయ‌నే చేసేవారు. ఎప్పుడైతే ఎన్టీఆర్ పాతాళ భైర‌వి(1951) అనే ఒక సినిమా చేశారో ఆనాటి నుంచి తెలుగు చిత్ర సీమ డైన‌మిక్స్ మొత్తం ఛేంజ్ అయిపోయాయి.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు మరోసారి ఎన్నియ్యారు. టీడీపీ నేత వర్ల రామయ్య ఈ విషయాన్ని మహానాడు వేదికగా ప్రకటించారు. చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ త్వరగా జరగకుండా కొందరు కుట్రలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బాబూ జగ్జీవన్‌రామ్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన గురుకుల అవార్డుల కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
తెలంగాణ చరిత్రలో జూన్ 2వ తేదీకి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. ఆరు దశాబ్దాల పోరాటం ఫలితంగా.. అమరవీరుల త్యాగాల ఫలంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన రోజు, జూన్ 2. అవును తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం జూన్ 2. ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ప్రపంచం నలుమూలల ఉన్న తెలంగాణ ప్రజలు రాష్ట్ర అవతరణ వేడుకలను, స్వాతంత్ర దినోత్సవ వేడుకలా ఘనంగా జరుపుకుంటారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబుకు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఇవాళ మహానాడు 2025 ప్రాంగణంలో యువగళం పాదయాత్ర పుస్తకాన్ని అందించారు. ఆ పుస్తకంలో అంశలను పరిశీలించి లోకేశ్‌ను చంద్రబాబు అభినందించారు.
యువనేత లోకేశ్‌కు తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కావాలని టీడీపీ కార్యకర్తల నుంచి బలంగా డిమాండ్ వస్తోందని ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. కడప మహానాడు’ ప్రాంగణంలో మంత్రి పయ్యావుల మాట్లాడుతూ… టీడీపీ కార్యకర్తలతో పాటు నేతలంతా ఈ డిమాండ్ నెరవేరాలని కోరుకుంటున్నారని చెప్పారు.
తెలంగాణ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత స్పీడ్ ఓ రేంజ్ లో ఉంది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. కవిత బీఆర్ఎస్ తో తెగతెంపులు చేసుకోవడానికే నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత మంత్రి నారా లోకేశ్‌కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేశ్‌ను నియమించాలని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల‌ నరేంద్ర మహానాడులో తీర్మానించారు. ఈ విష‌య‌మై గుంటూరు జిల్లా స్థాయిలో జ‌రిగిన మినీ మహానాడులో తీర్మానం చేసిన‌ట్లు చంద్ర‌బాబుతో ఎమ్మెల్యే తెలియ‌జేశారు
కడప మహానాడు వేదికగా ఐటీ, విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ప్రమోషన్ లంఛనమేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పార్టీలో, ప్రభుత్వంలో తనదైన ముద్ర వేస్తున్న నారా లోకేష్ కు టీడీపీలో నిర్ణయాత్మక పదవి ఇచ్చేందుకు కడప మహానాడు వేదిక అవుతుందన్న ప్రచారం జోరందుకుంది.
భవిష్యత్తులో పార్టీ కార్యకర్తలకే పెద్దపీట వేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు అన్నారు. రెండో రోజు మహానాడులో చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్రంలో పేదరికం లేని సమాజం కోసం కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు. వచ్చారు. అందులో విశేషం లేదు. మరో రెండు మూడు రోజుల్లో ఈ నెల 30న మరో సారి కూడా వెడతారు. గ డచిన 17 నెలల్లో మొత్తం 44 సార్లు.. అంటే సగటున నెలకు రెండు సార్లు ముఖ్యమంత్రి ఢిల్లీ యాత్రలు చేశారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. నెలలో రెండు సార్లు కాదు, ఒకే రోజులో రెండు సార్లు ఢిల్లీ వెళ్లి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.
వైసీపీ సోషల్ మీడియా వింగ్ మాజీ హెడ్ పిల్ల సజ్జల అదేనండీ.. సజ్జల భార్గవరెడ్డి మంగళగిరి పోలీసు స్టేషన్ లో ఉన్నారు. సామాజిక మాధ్యమంలో అనుచిత వ్యాఖ్యలు కేసులో ఆయనకు జారీ అయిన నోటీసుల మేరకు విచారణకు ఆయన మంగళగిరి పోలీసు స్టేషన్ కు వచ్చారు.
నటుడిగా, నాయకుడిగా అంతకు మించి గొప్ప దార్శనికుడిగా ఎన్టీఆర్ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా ప్రధాని ఆయనకు ఘన నివాళులర్పించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.