Publish Date:Feb 16, 2025
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రోడ్లు అద్దాల్లా మెరిసిపోతున్నాయ్. జగన్ హయాంలో అడుగుకో గుంత అన్నట్లుగా ఉండే రోడ్లు.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువు దీరిన తరువాత బాగుపడ్డాయి. జగన్ తన ఐదేళ్ల పాలనలో బటన్ నొక్కుడుకు తప్ప మరే విషయాన్నీ పట్టించుకోలేదు. ప్రజల గుంతల రోడ్లపై ప్రయాణించలేక నరకయాతన అనుభవిస్తున్నా పట్టించుకోలేదు. ఉచితాలు పందేరం చేస్తున్నా.. నన్ను కాక ఇంకెవరిని ఎన్నుకుంటారు అన్నట్లుగా వ్యవహరించారు. అయితే కేవలం బటన్ నొక్కి సొమ్ములు పందేరం చేయడం ఒక్కటే పాలన అని ప్రజలు భావించలేదు. ఐదేళ్ల పాటు తమకు నరకాన్ని చూపించిన జగన్ కు గత ఏడాది జరిగిన ఎన్నికలలో గుణపాఠం చెప్పారు. జగన్ బాబూ మీకు పాలన చాతకాదు.. ఇక ఇంటికి దయచేయడం అని ఓటుతో గట్టి బుద్ధి చెప్పారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా వైసీపీని అసెంబ్లీలో కేవలం 11 అంటే 11 సీట్లకు పరిమితం చేశారు. జగన్ కు ఆయన సొంత నియోజకవర్గం అయిన పులివెందుల ప్రజల సైతం గట్టి షాక్ ఇచ్చారు. సొంత జిల్లా కడపలో మెజారిటీ సీట్లలో ఓడించిన జనం.. పులివెందులలో జగన్ మెజారిటీని గణనీయంగా తగ్గించేశారు.
ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపడుతూనే రోడ్ల మరమ్మతులపై దృష్టి సారించారు. నిర్దిష్ట సమయంలో రోడ్లపై గుంతలు కనిపించకుండా మరమ్మతులు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో రోడ్లు అద్దాల్లా తయారయ్యాయి. మచ్చుకైనా ఒక్కటంటే ఒక్క గుంత కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాడు జగన్ హయాంలో రోడ్లపై ప్రయాణం అంటే నరకంలా ఉందనీ, ఇప్పుడు స్వర్గంలా మారిందని అంటున్నారు. ఇదే విషయాన్ని నెటిజనులు కూడా సాక్ష్యాలుగా అప్పటి ఫొటోలు, ఇప్పటి ఫోటోలు సామాజిక మాధ్యమంలో పోస్టు చేస్తూ జగన్ పాలన నరకం, బాబు పాలన స్వర్గం అంటూ కామెంట్లు పెడుతున్నారు. తాజాగా గుంటూరులోని ఆగ్రహారం రోడ్లుకు సంబంధించి జగన్ పాలనలో ఆ రహదారి దుస్థితిని, ఇప్పుడు అద్దంలా మెరిసిపోతున్న పరిస్థితిని తెలియజేసేలా ఫొటోలు పోస్టు చేశారు. ఆ ఫొటోలు వెంటనే తెగ వైరల్ అయ్యాయి. జనం.. చంద్రబాబు సమర్ధతను, ప్రజల ప్రయోజనాలు, వారి సమస్యల పరిష్కారానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో చెప్పడానికి ఇదే నిదర్శనం అంటున్నారు.
ఇదే అగ్రహారం రోడ్డు జగన్ హయాంలో గుంతలతో నిండి, వర్షాకాలంలో స్విమ్మింగ్ పూల్ ను తలపించేలా ఉండేది. అప్పట్లో ఈ రోడ్డుపై తరచూ ప్రమాదాలు సంభవించేవి. పలువురు మరణించగా, మరింత మంది ఆస్పత్రుల పాలయ్యారు. అదే రోడ్డు ఇప్పుడు గుంతలనేవి లేకుండా, రోడ్డు మధ్య డివైడర్ తో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా మారిపోయింది. జనం ఈ రోడ్డు పై ప్రయాణిస్తూ నిత్యం జగన్ పాలనలో ఈ రోడ్డు పై ప్రయాణం అంటే నరకయాతనగా ఉందని, ఇప్పుడెంతో హాయిగా ఉందని వ్యాఖ్యలు చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/guntur-agraharam-road-without-pits-39-192979.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.