ఒక్కసారిగా కూలిన బ్రిడ్జి.. నదిలో పడిన వాహనాలు
Publish Date:Jul 9, 2025
Advertisement
గుజరాత్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. గుజరాత్ వడోదరాలోని మహిసాగన్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జి ఒక్కసారిగా కూలింది. ఆ సమయంలో బ్రిడ్జిపై ప్రయాణాలు సాగిస్తున్న రెండు లారీలతో పాటు పలు వాహనాలు నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు 10 మందిని రక్షించారు. చిక్కుకుపోయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఈ వంతెన 45 ఏళ్ల కిందట నిర్మించిందిగా అధికారులు తెలిపారు. చాలా కాలంగా ఇది శిథిలావస్థలో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. మరోవైపు అధికారులు వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. ఇతర మార్గాల ద్వారా వాహనాలను మళ్లిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/gujarat-state-39-201641.html
http://www.teluguone.com/news/content/gujarat-state-39-201641.html
Publish Date:Dec 10, 2025
Publish Date:Dec 10, 2025
Publish Date:Dec 10, 2025
Publish Date:Dec 10, 2025
Publish Date:Dec 9, 2025
Publish Date:Dec 8, 2025
Publish Date:Dec 8, 2025
Publish Date:Dec 8, 2025
Publish Date:Dec 8, 2025
Publish Date:Dec 7, 2025
Publish Date:Dec 7, 2025
Publish Date:Dec 7, 2025
Publish Date:Dec 6, 2025





