రాష్ట్ర విభజన కోసం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పేర్లు ఖరారు

Publish Date:Oct 8, 2013

Advertisement

 

ఒకవైపు సీమంద్రా జిల్లాలు సమైక్యాంధ్ర ఉద్యమాలతో అట్టుడికిపోతుంటే, కేంద్రం మాత్రం రాష్ట్ర విభజనకి రంగం సిద్దం చేస్తోంది. కేంద్రం మొన్న ఖరారు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ప్యానల్ ను పూర్తిగా మార్చి ఈరోజు సరికొత్త ప్యానల్ ను ప్రకటించింది.

 

రక్షణ మంత్రి ఏకే అంటోనీ ఛైర్మన్ గా ఉండే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లో హోంమంత్రి సుషీల్ కుమార్ షిండే, ఆర్ధిక మంత్రి పీ.చిదంబరం, పెట్రోలియం మరియు గ్యాస్ మంత్రి యం. వీరప్ప మోయిలీ, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి గులాం నబీ ఆజాద్ మరియు పట్టణాభివృద్ది శాఖా మంత్రి జై రాం రమేష్ దీనిలో సభ్యులుగా ఉంటారు. ప్రధాని కార్యాలయానికి చెందిన మంత్రి వ్.నారాయణ స్వామీ ఇందులో ప్రత్యేక ఆహ్వానితులుగా వ్యవహరిస్తారు.

 

గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చూడవలసిన అంశాలు:

 

1. రెండు రాష్ట్రాల సరిహద్దులను గుర్తించడం. రెండు రాష్ట్రాలలో నియోజక వర్గాలను నిర్దారించడం. ఆర్ధిక, అధికారిక, పరిపాలనా పరమయిన వ్యవస్థల నిర్ధారణ చేయడం.

 

2. రెండు రాష్ట్రాలు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా చేసుకొని 10సం.లు సజావుగా పాలన చేసుకొనేందుకు వీలుగా అవసరమయిన న్యాయపరమయిన మరియు పరిపాలనా వ్యవస్థలను నిర్దారించడం.

 

3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధానికి అవసరమయిన న్యాయ, ఆర్ధిక, పరిపాలనా ఏర్పాట్లకి సూచనలు, సలహాలు.

 

4. రెండు రాష్ట్రాలలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి అవసరమయిన సూచనలు, సలహాలు.

 

5. రెండు రాష్ట్రాలలో శాంతి భద్రతలు, ప్రజల రక్షణకు మరియు రాష్ట్ర విభజన కారణంగా ఏర్పడే దీర్గకాలిక సమస్యల అధ్యనం మరియు వాటికి తగిన పరిష్కారాలు.

 

6. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటింపబడ్డ పోలవరం ప్రాజెక్టుతో సహా రెండు రాష్ట్రాల మధ్య జలవనరులు మరియు సహజ నిక్షేపాలు (బొగ్గు, నీళ్ళు, గ్యాస్ మరియు చమురు) పంపకాలపై తగిన సలహాలు మరియు ఇతర రాష్ట్రాలతో పంపకాలను పునర్నిర్వచించడం.

 

7. రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలకి అవసరమయిన సలహాలు, సూచనలు.

 

8. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పులు, కేంద్ర ప్రభుత్వ సంస్థల పంపకాలు.

 

9. రెండు రాష్ట్రాల మధ్య అఖిల భారత ఉద్యోగులతో సహా ఉద్యోగుల నియామకాలు, సర్దుబాట్లలలో ఇమిడి ఉన్నసమస్యలను గుర్తించడం, తగిన పరిష్కారాలు సూచించడం.

 

10. రాష్ట్ర విభజన నేపద్యంలో ఉద్యోగుల నియామకం, బదిలీలు తదితర అంశాలకు సంబంధించి సెక్షన్ 371డీ జారీ చేయబడిన రాష్ట్రపతి ఆర్డర్ ద్వారా తలెత్తే సమస్యలను అధ్యయనం, పరిష్కారం.

 

11. రాష్ట్ర విభజన సందర్భంగా తలెత్తే మరే ఇతర సమస్యల అధ్యయనం మరియు పరిష్కారాలు సూచించడం.

 

ఆరువారాలలోగా ఈ వ్యవహారాలనీటిపై ఒక సమగ్ర నివేదిక ఈయవలసి ఉంటుంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.