బాబు అరెస్టుకు రంగం సిద్ధం?.. ఆధారాలెందుకు అధికారం ఉందన్నదే వైసీపీ ధీమా

Publish Date:May 10, 2022

Advertisement

నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా ఉంది వైసీపీ వ్యవహారం. నారాయణ అరెస్టు వార్త బయటకు వచ్చిన మరుక్షణం నుంచీ వైసీపీ కి చెందిన సోషల్ మీడియాలో మరో వార్త ట్రెండింగ్ అవుతోంది. నారాయణ తరువాతి వంతు నారా చంద్రబాబునాయుడేనని. ఇందుకు వారు కారణాలు కూడా చెబుతున్నారు. అమరావతిలో అక్రమాలకు పాల్పడ్డారన్న కేసు ఇప్పటికే ఆయన మీద ఉందనీ, సీబీసీఐడీ దర్యాప్తు కూడా చేస్తోందని పేర్కొంటున్నారు. చంద్రబాబుపై ఈ ఫిర్యాదు చేసింది ఎవరో కాదు.. సాక్షాత్తూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి. ఆ అక్రమాల వల్ల ప్రజలకు నష్టం జరిగిందన్నది ఆయన ఫిర్యాదు సారాంశం. ఎక్కడైనా ఎప్పుడైనా నష్టపోయిన వారు ఫిర్యాదు చేస్తారు.

కానీ ఇక్కడ మేం నష్టపోయామంటూ ఏ ఒక్క ఫిర్యాదూ లేకపోయినా, ఎమ్మెల్యే మాత్రం ప్రజలు నష్టపోయారంటూ చంద్రబాబుపై చేసిన ఫిర్యాదుకు సీబీసీఐడీ స్వీకరించింది.తొలుత అమరావతి కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా భూముల సమీకరణలో అక్రమాలు జరిగాయంటూ పెట్టిన కేసులన్నీ వీగిపోవడంతో.. తాజాగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పుల్లో అక్రమాలంటూ మరో ఫిర్యాదు చేశారు. దీనిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ప్రాథమిక ఆధారాలున్నాయంటూ ఎఫ్ఐఆర్ కూడా ప్రిపేర్ చేసేసింది. 
ఇప్పుడు వైసీపీ లక్ష్యం ఈ కేసు ఆధారంగా చంద్రబాబును అరెస్టు చేయడమే. ఇదే ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో జోరుగా ట్రెండ్ అవుతోంది. అయితే ఇదే విషయం రాష్ట్రంలో రాజకీయ వర్గాలలో కూడా చర్చ జరుగుతోంది.  గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ   అడ్డగోలు అరెస్టులు చేసేలా ఒక విధానాన్ని డెవలప్ చేసుకుంది. అధికార పార్టీ వాళ్లు ఫిర్యాదు చేస్తారు. అది చాలు ఆధారాలు, విచారణలతో పని లేకుండా అరెస్టులు చేసేయడమే..ఆ కేసులు కోర్టులో నిలబడతాయా, లేదా అన్నది తరువాత సంగతి ముందు అరెస్టు చేసేయాలి. అంతే. వైసీపీ ప్రభుత్వం ఈ విధానంతోనే ప్రత్యర్థి పార్టీల నేతలు, ప్రభుత్వ నిర్ణయాలను ఎత్తి చూపే వారిని వేధింపులకు గురి చేస్తున్నది. కరోనా సమయంలో ప్రభుత్వ వైద్యులకు మాస్క్లలు కూడా ఇవ్వడం లేదంటూ ప్రభుత్వంపై విమర్శలు చేసిన పాపానికి సుధాకర్ అనే వైద్యుడిని నడిరోడ్డుపై పోలీసులు లాఠీలతో కొట్టి పిచ్చోడని ముద్రవేసి వేధింపులకు గురి చేయడం దగ్గర నుంచి.. మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీ హయాంలో  అడ్డగోలు అరెస్టులకు ఎన్నో ఉదాహరణలు చెప్పుకుంటూ పోవచ్చు. ఆరెస్టులను తప్పుపడుతూ న్యాయస్తానాలు బెయిలు ఇస్తే కోర్టులను తప్పుపట్టం వైసీపీకి అలవాటుగా మారిపోయింది.  తాజాగా మాజీ మంత్రి నారాయణ అరెస్టు కూడా ఈ కోవలోకే వస్తుంది.

టెన్త్ పేపర్ల లీకేజీ కేసులో ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండా ఏపీ సీఐడీ పోలీసులు నారాయణను అరెస్టు చేశారు. కుమారుడి ఆబ్దికం కార్యక్రమంలో ఉన్న ఆయనను అరెస్టు చేశారు. ఇంతకీ టెన్త్ పరీక్ష పేపర్లు లీకయ్యాయంటూ ఆరోపణలు వెల్లువెత్తిన వెంటనే చర్యలు తీసుకోవలసింది పోయి, ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అసలు పేపర్లు లీక్ కాలేదని విలేకరుల సమావేశం పెట్టి మరీ ఖండించారు. ఇప్పటి వరకూ ఆయన ఆ మాటను వెనక్కు తీసుకోలేదు. పేపర్ల లీకయ్యాయని అంగీకరించనూ లేదు. కానీ ఏపీలో టెన్త్ పేపర్ల లీకేజీకి బాధ్యులంటూ అరెస్టులు జరిగాయి. నారాయణ అరెస్టుకు ముందు ఇదే కేసులో 60 మందిని అరెస్టు చేశారు. వీరిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, సిబ్బంది 38 మంది ఉంటే..ప్రైవేటు విద్యాసంస్థల సిబ్బంది 22 మంది ఉన్నారు. అయినా సరే ఏపీలో టెన్త్ పరీక్ష పత్రాల లీకుకు మంత్రిగారు బాధ్యత తీసుకోరు. మొత్తం తప్పంతా నారాయణ విద్యా సంస్థలదే అని తేల్చేసి నారాయణను అరెస్టు చేస్తారు. 

ఇదే విధంగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో చంద్రబాబు అరెస్టుకు జగన్ డైరెక్షన్ లో అరెస్టుకు రంగం సిద్ధమౌతోందని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.  ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్పు వల్ల నష్టపోయామంటూ అందుకు సంబంధించిన ఏ ఒక్క రైతూ ఫిర్యాదు చేయకపోయినా, అధికార పార్టీ ఎమ్మెల్యే ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన సీఐడీ ప్రాథమిక ఆధారాలున్నాయని ఎఫ్ఐఆర్ లో పేర్కొనడమే ఇందుకు నిదర్శనంగా పరిశీలకులు చెబుతున్నారు. ఏ క్షణంలోనైనా చంద్రబాబునూ అరెస్టు చేసే అవకాశాలున్నాయని వారు విశ్లేషిస్తున్నారు. అయితే కోర్టు సెలవుల సమయంలో బాబును అరెస్టు చేసి వెంటనే బెయిలు వచ్చే అవకాశం లేకుండా చేయాలన్నది జగన్ ఆలోచనగా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి.
వైకాపాకు చెందిన కొందరు రౌడీ మూకలు రక్తం పారిస్తాం, నరికేస్తాం అంటూ కెమెరాల ముందు ప్రగల్భాలు పలుకుతున్నారని, అలాంటి పిచ్చి చేష్టలు తమ వద్ద సాగవని పవన్ కళ్యాణ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
లాకర్లలో సుమారు రెండున్నర కిలోల బంగారు ఆభరణాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. మరో లాకర్‌లో సుమారు రూ.1.50 కోట్ల నగదు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే నరహరి నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ, ఇప్పుడు లాకర్ల నుంచి మరో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకోవడంతో మొత్తం నగదు రూ.3 కోట్లకు పైగా చేరింది.
కేంద్రకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. దీనికి ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. అయితే దీనికి నిర్దిష్టమైన ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు.
జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ హడావిడి వెనుక సాయికృష్ణ కుటుంబంపై ప్రేమ ఎంతమాత్రం లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ స్పష్టం చేశారు. జగన్ అసలు టార్గెట్ సీఐ నాగరాజు కాదనీ.. ఆయన ప్రధాన లక్ష్యం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అని విశ్లేషించారు.
అధికార కూటమికి చెందిన నాయకులు, చివరికి హోం మంత్రి సైతం క్షేత్రస్థాయికి వెళ్లి బాధితులను పరామర్శించకపోవడం, సరైన క్లారిటీ ఇవ్వకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేలా ప్రవర్తిస్తున్న అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ బాస్ ను ఆదేశించారు.
ఒక బలమైన ప్రజాధారణ కలిగిన సరికొత్త వేదిక ఏర్పడితే ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
లకమైన రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రతిపక్షాల మద్దతుతో సంబంధం లేకుండా.. స్వతంత్రంగా ఆమోదింప చేసుకోవడమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు రహస్యం.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో కలిపి ఇప్పటికే దాదాపు 20 లక్షల మందికి పైగా సభ్యులు జనసేనలో చేరారనీ.. ఈ బలంతో తెలంగాణ రాజకీయాల్లో తమ ఉనికిని గట్టిగా చాటుతామని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు, 2028లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీకి దిగుతుందని పవన్ ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఏపీ రాజకీయాలలో కాపు సామాజికవర్గం ఓటు బ్యాంకుకు ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలిగే సత్తా ఉంది. అటువంటి కాపు సామాజికవర్గం విషయంలో జగన్ అనుసరిస్తున్న వ్యూహం మొదటికే మోసం తెచ్చేలా ఉందన్న ఆందోళన వైసీపీ వర్గాలలో వ్యక్తం అవుతున్నది.
శివసేన ఏక్ నాథ్ షిండే, శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకరే అసలైన వారసులం తామేనంటూ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గం, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని యూబీటీ వర్గం పోటాపోటీగా భారీ బహిరంగ సభలను నిర్వహించడంతో ముంబైలో ఉద్రిక్తతలు పీక్స్ కు వెళ్లాయి.
విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీకి సాయికృష్ణ అదృశ్యం ఘటనను అందివచ్చిన అవకాశంగా భావించి.. పొలిటికల్ మైలేజీ గెయిన్ చేయడానికి శతధా ప్రయత్నించింది. అయితే చంద్రబాబు తన చాణక్యంతో ఆ ప్రయత్నాలకు చెక్ పెట్టారు.
తెలంగాణ రాజకీయాల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం మరోసారి తీవ్ర ఉత్కంఠకు వేదికగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.