Publish Date:Oct 21, 2019
దీపావళి అనగానే మనకు ముందుగా గుర్తోచ్చేది రంగురంగుల టపాసులు, మిరుమిట్లు గొలిపే వెలుగులు, నిప్పులు కక్కుతూ దూసుకుపోయే దీపావళి రాకెట్లు. ధ్వని కాలుష్యం, వాయు కాలుష్యం, ఇలా చైనా టపాసులు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చైనా టపాసుల విక్రయం తగ్గించే క్రమంలో గ్రీన్ దీపావళి అనే అంశం ప్రజల ముందుకు వచ్చింది .గ్రీన్ దీపావళికి భారీ స్పందన వస్తోంది. ప్రజల నుంచే కాకుండా వ్యాపారస్తులు సైతం గ్రీన్ దివాలీ వైపు కదులుతున్నారు. ఈ సారి చైనా టపాసుల్ని నిషేధించారు. తక్కువ కాలుష్యం వెదజల్లే టపాసుల్ని విక్రయిస్తున్నారు. చైనా టపాసుల్ని పంతొమ్మిది వందల ఎనభై ఆరు పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం కేంద్రం పంతొమ్మిది వందల తొంభై రెండులో చైనా బాణాసంచా ఉత్పత్తులపై పరోక్షంగా నిషేధాన్ని విధించింది. కానీ ఆ దేశ ఫైర్ వర్క్స్ దిగుమతులను మాత్రం అడ్డుకోలేకపోతోంది.
చైనా టపాసుల్లో పొటాషియం క్లోరైడ్ వాడతారు. వీటి వాడకం పై భారత్ లో ఆంక్షలున్నాయి. తక్కువ ధరకు బాణాసంచ ఉత్పత్తి చేయాలంటే అతి తక్కువ రేటు ఉన్న ముడి సరుకును ఉపయోగించాలి. మిగతా వాటితో పోలిస్తే పొటాషియం క్లోరైట్, సల్ఫరైట్, నైట్రేట్ రసాయనాలు చైనాలో అత్యంత చౌక. ఈ హానికారక రసాయనాలతో చేసిన బాణా సంచా ఎక్కువగా వెలుగులు విరజిమ్ముతాయి. పెద్ద శబ్దం వస్తుంది. సాధారణంగా భారత్ లో నూట నలభై ఐదు డెసిబుల్స్ కన్నా ఎక్కువగా శబ్దం వచ్చే బాణాసంచా తయారీ నిషేధం. చైనా టపాసులు నూట నలభై ఐదు డెసిబుల్స్ దాటి ధ్వని కాలుష్యం చేస్తాయి. ప్రతి ఏడాది వేల కోట్ల టపాసులు చైనా నుండి దొంగచాటుగా దిగుమతి అవుతున్నాయి. అయితే వీటివల్ల జరుగుతున్న నష్టాన్ని ఇపుడిపుడే గుర్తిస్తున్నారు ప్రజలు. అందుకే చైనా టపాసుల జోలికి వెళ్లటం లేదు. చివరకు వ్యాపారస్తులు సైతం స్వచ్ఛందంగా చైనా బాణా సంచాపై నిషేధాన్ని విధిస్తున్నారు.
గ్రీన్ దివాళి నినాదంతో వరంగల్ కు చెందిన వ్యాపారస్తులు చైనా టపాసుల్ని విక్రయించడం లేదు. ధ్వని కాలుష్యాన్ని నివారించేందుకు ఎనభై శాతం శబ్దం రాని వాటినే అమ్ముతున్నారు. ఈ సారి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చైనా టపాసుల్ని బహిష్కరించారు. మన దేశంలో తయారైన టపాసుల్నే విక్రయిస్తున్నారు. అది కూడా భారీ శబ్దం,కాలుష్యాం లేనివే అమ్ముతున్నారు. గ్రీన్ దీపావళి తమలో ఎంతో స్ఫూర్తి నింపిందని ప్రజలంతా ముక్త కంఠంతో చెబుతున్నారు. విపరీతమైన కాలుష్యానికి కారణమవుతున్న టపాసులను తగ్గించి గ్రీన్ దివాలీ వైపు అడుగులు వేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. వరంగల్ వాసులు ఈ సారి గ్రీన్ దివాలీ వైపు అడుగులు వేశారు. భారీగా కాలుష్యం వచ్చే టపాసుల జోలికి వెళ్లటం లేదు. భవిష్యత్ లో ఇది మరింత తగ్గి అసలైన దీపావళి జరుపుకోవాలని ఆశిద్దాం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/green-diwali-massive-response-from-warangal-25-90387.html
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.