Publish Date:Jul 19, 2022
అధికారంలో వున్నామని కుర్చీలు, బల్లలూ, పరికరాలు వాడినట్టు ప్రభుత్వ లాయర్లను వాడేయచ్చని తెలంగాణా ప్రభుత్వం అనుకుంది. కానీ అదంతా నడవదు.. ప్రభుత్వాధికారులైనంత మాత్రాన ప్రభుత్వ లాయర్లను వినియోగించుకోరాదని హైకోర్టు తెలంగాణా ప్రభుత్వాన్ని మందలించింది. అధికారుల కోర్టు ధిక్కారం కేసుల్లో సొంత ఖర్చులతో న్యాయవాదులను నియమించుకోవాల్సిందేనని మందలించింది. ప్రభుత్వాధి కారుల తరఫున అడ్వకెట్ జనరల్ కార్యాలయానికి చెందిన ప్రభత్వ న్యాయవాదులు హాజరు కావడంపై హైకోర్టు ఆగ్రహించింది.
ఒక కోర్టు ధిక్కరణ కేసులో అధికారుల తరఫున ప్రభుత్వ న్యాయవాదులు హాజరుకావడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. అధికారుల ధిక్కరణ కేసులకు ప్రజల సొమ్మును ఖర్చు చేస్తారా? అని ప్రశ్నించింది. రోడ్డు నిర్మాణం కోసం భూసేకరణ చట్టం-2013 ప్రకారం భూమిని సేకరించి.. నాలుగేళ్లుగా పరిహారం చెల్లించడం లేదంటూ రంగా రెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం నాగాహిల్స్లోని సర్వే నంబర్ 66లో ఉన్న 276 చద రపు గజాల ప్లాట్ విషయంలో ఆ భూమి యజమాని మహమ్మద్ ఖాజం అలీ కోర్టులో ధిక్కరణ పిటిషన్ వేశారు. జీహెచ్ ఎంసీ అధికారులు ఆ భూమి వివాదాస్పదమైనదని చెప్పడంపై ఇటీవల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భూసే కరణ చేసి.. రోడ్డు నిర్మాణం పూర్తయ్యాక.. ఇప్పుడు అది ప్రభుత్వ భూమి అని చెప్ప డాన్ని తప్పు బట్టింది. ఈ అంశంపై జీహెచ్ఎంసీ వెస్ట్ జోన్ డిప్యూటీ కమిషనర్ను కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. సోమవారం ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ సూరేపల్లి నందా నేతృత్వం లోని ధర్మాసనం విచారించింది.
జీహెచ్ఎంసీ వెస్ట్జోన్ డిప్యూటీ కమిషనర్ వెంకన్న కొవిడ్ కారణంగా విచారణకు హాజరుకాలేక పోయారు. కోర్టు ధిక్కరణ ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల తరఫున ఏజీ కార్యాలయం ప్రాతినిధ్యం వహించ డంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వివాదంలో ఉన్న భూమి గవర్నమెంట్ స్థలమని ప్రభు త్వం తరఫు న్యాయవాది పేర్కొనగా.. అయితే భూసేకరణ ఎందుకు చేశారని ధర్మాసనం ప్రశ్నించింది. కోర్టు ధిక్కరణ కేసులో భూమి టైటిల్ను తేల్చడం తమ పనికాదని.. పరిహారం అందిందా? లేదా? అన్న అంశాన్ని మాత్రమే పరిశీలిస్తామని స్పష్టంచేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/govtadvocates-not-allowed-for-court-contempt-cases-25-140103.html
తెలంగాణలో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న మాజీ ఐపీఎస్ ప్రభాకరరావు ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకున్నారు.
రాజకీయం, మీడియా ముసుగులో మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి, వారి వ్యక్తిత్వంపై దెబ్బ తీసే వారిని ఉపేక్షించేది లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హెచ్చరించారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. సోమవారం (జూన్ 9) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ ఎన్ డీ షెడ్ల వరకూ సాగింది.
అమరావతి రాజధానిపై వైసీపీ కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓటమి తర్వాత కూడా అమరావతి కోసం అన్ని అప్పుల అవసరమా అని మాజీ సీఎం జగన్ అక్కసు వెళ్లగక్కారు. వైసీపీ మీడియా రంగంలోకి దిగింది. అమరావతి ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యలతో రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
కాశ్మీరాన్ని భారత దేశంతో కలపాలనే శతాబ్దాల కల సాకారమైంది. చీనాబ్ వంతెన నిర్మాణం పూర్తయింది. ఎప్పుడో 132 ఏళ్లకు పూర్వం ఆనాటి, రాజరిక పాలకులు కన్న కలను, ఈ నాటి ప్రజాస్వామ్య ప్రభుత్వం సాకారం చేసింది.
బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు ముగిశాయి. ఆదివారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య మాగంటి అంత్యక్రియలు నిర్వహించారు. మాగంటి అంతిమ సంస్కారాలు కన్నీటి వీడ్కోలు నడుమ జరిగాయి
నెల్లూరు రామలింగాపురం సర్కిల్లో దివంగత నేత ఆనం వెంకటరెడ్డి కాంస్య విగ్రహాన్ని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించారు.
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అజాత శత్రువు అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ప్రజల కథే నా ఆత్మకథ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా స్కూల్ బీజేపీ..నా కాలేజీ టీడీపీ..నా ఉద్యోగం రాహుల్ దగ్గర అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ప్రజలు చైతన్యంతో ఉద్యమించి ,ఎన్నికల మానిఫెస్టోలో పోలీస్ సంస్కరణలు ప్రాధాన్యత అంశంగా పెట్టించి తద్వారా రాజకీయ సంకల్పాన్ని కలిగిస్తేనే భారతదేశంలో పోలీస్ సంస్కరణలు అమలై చట్టబద్ధ పాలన సాధ్యం అవుతుందని విశ్రాంత ఐపిఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు తెలిపారు.
అన్నమయ్య జిల్లా తంబల్లపల్లి అటవీప్రాంతంలో టాస్క్ఫోర్స్ పోలీసులు భారీగా ఎర్రచందనం దుంగలతో పాటు ఒక మోటారు సైకిల్ ను స్వాధీనం చేసుకుని, నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు.
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ జీవిత చరిత్ర ఆధారంగా రాసిన ప్రజల కథే నా ఆత్మకథ అనే ఆటో బయోగ్రఫీ పుస్తకావిష్కరణ హైదరాబాద్లోని శిల్పకలావేదికలో అలయ్ బలయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పార్థివ దేహానికి మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి నివాళులర్పించారు.
తెలంగాణ మంత్రులుగా గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో నూతన మంత్రులతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు.