సెల్ ఫోన్లలో లైవ్ లొకేషన్ ట్రాకింగ్.. కేంద్రం యోచన

Publish Date:Dec 6, 2025

Advertisement

నిరసనలూ, వ్యతిరేకతలను ఇసుమంతైనా పట్టించుకోకుండా అన్ని మొబైల్ ఫోన్లలోనూసైబర్ సెక్యూరిటీ అప్లికేషన్ ‘సంచార్ సాథి’ని అమలు చేయాలన్న భావనకే కేంద్రం కట్టుబడి ఉంది. గతంలో వ్యతిరేకతకు వెరసి దానిని ఉపసంహరించుకున్నప్పటికీ.. ఇప్పుడు మాత్రం  దేశ వ్యాప్తంగా అన్ని స్మార్ట్‌ఫోన్‌లలోనూ ఆన్ లైన్  లొకేషన్ ట్రాకింగ్‌ను అమలు చేసే అంశాన్ని కేంద్రం చాలా సీరియస్ గా పరిశీలిస్తోంది.   వాస్తవానికి గోప్యతా సమస్యల కారణంగా దీనికి ప్రముఖ సెల్ ఫోన్ తయారీ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.   

కేసుల దర్యాప్తు కోసం  టెలికాం సంస్థలు  చట్టపరంగాకోరిన సందర్భాలలో  ఖచ్చితమైన లొకేషన్‌లను పొందగలిగేలా స్మార్ట్ ఫోన్ లలో లోకేషన్ ట్రాకింగ్ ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసే దిశగా అడుగులు వేస్తున్నదని సమాచారం.

 ప్రస్తుతం, టెలికాం ఆపరేటర్లు  సెల్యులార్ టవర్ డేటా ద్వారా సుమారు లొకేషన్ ను మాత్రమే అందించే అవకాశం ఉంది. ఇలా చేయడం వ్యక్తిగత గోప్యత హక్కును ఉల్లంఘించడమే కాకుండా సున్నితమైన రంగాలకు హాని చేకూరే ప్రమాదం ఉందని అంటున్నారు. పైగా ఈ విధానాన్ని అమలు చేయడాన్ని మొబైల్ వినియోగదారులు కూడా ఇష్టపడరని చెబుతున్నారు.  అయితే ఈ విషయంలో ఇప్పటివరకు  ప్రభుత్వం ఎటువంటి విధాన నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈ విషయంపై  చర్చించడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ  అగ్రశ్రేణి స్మార్ట్‌ఫోన్  సంస్థల ఉన్నతాధికారులతో నిర్వహించతలపెట్టిన సమావేశం వాయిదా పడింది. అయితే ఆన్ లైన్ లైవ్ ట్రాకింగ్ విషయంలో ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉందన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.  

By
en-us Political News

  
విద్యా బుద్దులు నేర్పాల్సిన ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ విద్యార్థిని లోబర్చుకొని గర్భవతిని చేశాడు.
గోవా నైట్ క్లబ్‌‌ అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
గోవాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వల్ల రాష్ట్రం దశ డా మారుతుందనే చర్చ దేశవ్యాప్తంగా జోరుగా సాగుతోంది.
ఇండిగోలో అస‌లు స‌మ‌స్య ఏంటి అని చూస్తే కొత్త పైల‌ట్ డ్యూటీ రూల్స్
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
తిరుమల పరాకామణి కేసు నిందితుడు రవికుమార్ తప్పు అంగీకరిస్తూ వీడియోను విడుదల చేశారు.
ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్ల‌ను మంత్రి పొంగులేటి శనివారం పరిశీలించారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు
ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సంక్షోభం వేళ టికెట్ల ఛార్జీలపై కేంద్రం నియంత్రణ చర్యలు చేపట్టింది.
తెలంగాణలోని తాటిపల్లి గ్రామ సమీపంలోని మహరాష్ట్ర కుచెందిన థరూర్‌ గ్రామ వద్ద వార్దా నది వద్ద పులి అడుగు జాడలను గమనించిన అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.
బీహార్ సర్కార్ పాట్నాలో టీటీడీ ఆలయం నిర్మాణానికి అంగీకరించింది.
మార్కెట్ విలువ పది లక్షల రూపాయల కంటే తక్కువ ఆస్తల రిజిస్ట్రేషన్ ఫీజును వంద రూపాయలు గా ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా వారసత్వ ఆస్తుల, భూముల రిజిస్ట్రేషన్ ను సులభతరం చేయడం వల్ల దాదాపు 3,9 లక్షల మంది భూమి యాజమాన్య హక్కులు పొందే అవకాశం ఉంటుంది. అలాగే భూ వివాదాలు గణనీయంగా తగ్గుతాయని అంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.