Publish Date:Dec 13, 2024
ఫార్ములా ఈ కార్ రేసు కుంభకోణంలో మాజీమంత్రి కెటిఆర్ పై కేసు నమోదు చేయడానికి తెలంగాణ గవర్నర్ ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది. రేవంత్ సర్కార్ గత నెలలో కెటీఆర్ ను అరెస్ట్ చేయాలని నిర్ణయించి హైద్రాబాద్ లో 144 సెక్షన్ విధించింది. తెలంగాణలో దీపావళి తర్వాతపొలిటికల్ బాంబులు పేలతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు చేసిన ప్రకటనతో కెటీఆర్, హరీష్ రావు, కెసీఆర్ అరెస్ట్ పక్కా అని ప్రచారం జరిగింది. ప్రజా ప్రతినిధిని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ ఆమోదం తప్పనిసరి. కెటీఆర్ సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిద్యం వహిస్తున్నారు. కెటీఆర్ ను అరెస్ట్ చేసే ముందు గవర్నర్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఫార్ములా ఈ రేస్ కుంభకోణం కేవలం కల్వకుంట్ల కుటుంబ ప్రయోజనాల కోసం చేసినట్లు కాంగ్రెస్ సర్కార్ భావిస్తుంది. కెటీఆర్ కొడు కు హిమాన్షు కోరికమేరకు కెటీఆర్ బావమరిది ఈ ఈవెంట్ చేపట్టినట్టు తెలంగాణ సర్కార్ భావిస్తోంది. ఫార్ములా ఈ రేస్ నిర్వహణా సంస్థకు తెలంగాణ సర్కార్ 46 కోట్ల రూపాయల విదేశీ కరెన్సీ ముట్ట జెప్పింది. హెచ్ఎండీఏ నిబంధనలను ఉల్లంఘించినట్లు అవినీతినిరోధకశాఖ గుర్తించింది. బోర్డు అనుమతి లేకుండానే హెచ్ ఎండీ ఏ దూకుడు ప్రదర్శించింది. బిఆర్ఎస్ ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రదాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఈ కుంభకోణంలో కీలక పాత్ర వహించారు. కెటీఆర్ ఆదేశాల మేరకే తాను చెక్కులను రిలీజ్ చేసినట్టు అరవింద్ కుమార్ పేర్కొన్నారు. ఒక విదేశీ నిర్వహణ సంస్థకు 46 కోట్ల రూపాయలు విడుదల చేయాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి తప్పనిసరి. కానీ బిఆర్ఎస్ ప్రభుత్వం నిబవధనలను ఉల్లంఘించింది. ఫార్ములా ఈ రేస్ కుంభకోణంపై ఇద్దరు అధికారులపై ఇప్పటికే విచారణ జరుగుతోంది. ఇంత పెద్ద ఈవెంట్ అయిన ఫార్ములా ఈ రేస్ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా ఆదాయం లేకపోవడంతో కాంగ్రెస్ సర్కార్ సీరియస్ గానే తీసుకుంది. డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ కుంభకోణం వెలికి తీసారు. తెలంగాణ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లడానికి ఫార్ములా ఈ రేస్ నిర్వహించినట్టు మాజీ మంత్రి కెటీఆర్ చెప్పుకోవడం గమనార్హం. గవర్నర్ ఆమోదం లభించిన నేపథ్యంలో ఈ నెలాఖరులో కెటీఆర్ అరెస్ట్ కావడం తథ్యమని తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/governor-green-signal-for-ktr-arrest-25-189785.html
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్తో పునాదులు పడ్డాయి. అక్కడి నుంచి ఈ పార్టీ అంచలంచలుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గతంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాసన రుచి చూపడంతో.. ఇప్పుడు వరుసగా మూడు పర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్రస్తుతం అప్రతిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.