ప్రభుత్వ పాఠశాలలకేం తక్కువ!

Publish Date:May 12, 2016

Advertisement

 

 

ఒకప్పుడు ప్రైవేటు పాఠశాల అంటే ఎవరో ధనికుల బిడ్డలు చదువుకునే బడి అన్న అర్థం స్ఫురించేంది. మరోపక్క ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేయడం అంటే చాలా చులకనగా ఉండేది. ‘బతకలేని బడిపంతులు’ అన్న సామెత ఊరికనే రాలేదు కదా! కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. మరీ కటిక దారిద్ర్యంలో ఉంటే తప్ప ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోరన్న అపోహ స్థిరపడిపోయింది. ఒక పక్క ప్రభుత్వ ఉపాధ్యాయులకు సాఫ్టవేర్‌ జీతాలతో సమానమైన జీతాలు అందిస్తున్నా, విద్యార్థుల పరిస్థితి మాత్రం దయనీయంగా ఉంది. దీనికి కారణం ఏమిటి అని వెతికితే...

 

ప్రపంచీకరణ నేపథ్యంలో చదువుకి ప్రాధ్యాన్యత పెరిగిపోయింది. పిల్లల ప్రాథమిక స్థాయి నుంచి కూడా నాణ్యమైన చదువుని అందిస్తే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందన్న అభిప్రాయం స్థిరపడిపోయింది. మరి నాణ్యమైన చదువు ఎక్కడ దొరుకుతుంది అని తల్లిదండ్రులు వెతికితే వాటికి జవాబుగా వందలాది ప్రైవేటు బడులు కనిపించడం మొదలుపెట్టాయి. ప్రైవేటు బడుల్లో విద్య ఎంత నాణ్యంగా ఉంటుందో తెలిసే అవకాశం లేకపోవచ్చు. కానీ వారు చూపించే హంగూ, ఆర్భాటం తప్పకుండా చూపరుల మీద ప్రభావం కలిగిస్తాయి. ఇక మోడల్ స్కూల్‌, ఐఐటీ ఓరియంటెడ్‌ సిలబస్‌, ఇంగ్లీషులోనే మాట్లాడిస్తాం... లాంటి ప్రకటనలూ వారిని ఊరిస్తుంటాయి. సరైన చదువు లేకపోవడం వల్లే తమ జీవితాలు ఇలా అయిపోయాయనీ, కనీసం తమ పిల్లల బతుకులైనా అలా కాకూడదని వారు కోరుకుంటున్నారు. అందుకే తలకు మించిన భారమైనా అప్పోసొప్పో చేసైనా తమ పిల్లలని ఖరీదైన చదువులు చదివిస్తున్నారు. ఆ మధ్య ఎర్రచందనం కేసులో పట్టుపడిన ఓ ఇద్దరు దొంగలు తమ పిల్లల ఫీజులు కట్టడం కోసమే తాము దొంగతనాలకు దిగామని చెప్పడం చూస్తే తల్లిదండ్రుల్లో కార్పొరేట్‌ విద్య పట్ల ఎంత మోజు ఉందో అర్థమవుతోంది.

 

 

 

నిజానికి ప్రైవేటు పాఠశాలలు తమ వద్ద చేరిన పిల్లలకు తగిన చదువుని అందిస్తున్నాయా లేదా అంటే అందుకు స్పష్టమైన సమాధానం లభించదు. చాలా ప్రైవేటు బడులలో తగిన విద్యార్హత లేని ఉపాధ్యాయులే బోధిస్తూ ఉంటారు. పిల్లల్లో జ్ఞానాన్ని పెంపొందించడం కంటే, వారి మెదడులోకి పాఠాలను చొప్పించడం మీదే వీరి ధ్యాసంతా ఉంటుంది. అందుకోసం వీలైనంత ఎక్కువ సేపు, వీలైనంత ఎక్కువ పాఠాలు చదివించడం మీదే ప్రైవేటు పాఠశాలల దృష్టి అంతా ఉంటుంది. పిల్లల్లో మానసిక, శారీరిక వికాసానికి అవసరమైన ఆటపాటలకు ఏమాత్రం అవకాశం ఉండదు. ఆడుకోవడానికి తగిన ఆటస్థలాలు కానీ, తరగతి సమయాలు కానీ ఉండవు. ఇక సాంస్కృతిక కార్యక్రమాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇలా అన్ని ప్రైవేటు పాఠశాలలూ ఉన్నాయని కాదు కానీ, ఎక్కువ శాతం ప్రైవేటు పాఠశాలల్లోని తీరు ఇది. ఇలాంటి వాతావరణంలో పెరిగిన పిల్లవాడు మంచి మార్కులనైతే సాధిస్తాడేమో కానీ, జీవితానికి ఉపయోగపడే పాఠాలను నేర్చుకోలేదు. నిరంతరం చదువుతోనే అతని బాల్యం సాగిపోవడంతో... భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే మానసిక స్థైర్యం కానీ, శారిరక దృఢత్వం కానీ అతనికి ఉండవు.

 

ఒకవైపు ప్రైవేటు పాఠశాలల తీరు ఇలా ఉంటే, ప్రభుత్వ పాఠశాలల తీరు మరోలా ఉంటోంది. ప్రైవేటు పాఠశాలల్లో నిపుణులైన అధ్యాపకులు ఉన్నప్పటికీ వారు ఉద్యోగాన్ని తెచ్చుకునేటప్పుడు చూపిన శ్రద్ధ ఆ ఉద్యోగాన్ని నిర్వర్తించడంలో చూపరన్న అపవాదు ఉంది. బడులకు సరిగా రారనీ, వచ్చినా సరిగా పాఠాలు చెప్పరనీ, చెప్పినా ఫలితాల మీద దృష్టి పెట్టరనీ... నానారకాల విమర్శలు ఉన్నాయి.

 

పాఠశాలల నిర్వహణ మీద కూడా చెప్పలేనన్ని ఆరోపణలు వినిపిస్తూ ఉంటాయి. బడికి సంబంధించిన ప్రతి పనీ కాంట్రాక్టు పద్ధతి మీదే సాగుతూ ఉండటంతో, ఎవరికి వారు లాభాలను వెనకేసుకునేవారే కానీ... తాము చేసిన పని పది తరాల పాటు అక్కడ చదువుకునే పిల్లలకు ఉపయోగపడిందా లేదా అని ఆలోచించేవారు తక్కువ. అందుకే తాగునీటి వసతి దగ్గర్నుంచీ మరుగుదొడ్లు వరకూ అంతా నాసిరకంగా ఉంటాయి. ఇక మధ్యాహ్న భోజన పథకం, యూనిఫారాలు, తాగునీరు... ఇలా పిల్లలకు కల్పించే ప్రతి వసతిలోనూ ఏదో ఒక కొరత కనిపిస్తూనే ఉంటుంది.

 

తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు చూపడానికి మరో కారణం ఆంగ్లంలో విద్యాబోధన. పిల్లలకు ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో విద్యను అందిస్తేనే వాళ్లలో జ్ఞానం పాదుకొంటుందనీ, తమ భావాలను స్పష్టంగా వ్యక్తం చేయగలుగుతారనీ, మున్ముందు మరో భాషని సైతం తేలికగా నేర్చుకోగలుగుతారనీ పరిశోధనలన్నీ రుజువు చేస్తున్నాయి. కానీ మనమేమో పిల్లవాడికి ఒకటో క్లాసు నుంచే ఆంగ్లం మీద మంచి పట్టు ఉండాలని మురిసిపోతున్నాము. ఆఖరికి పిల్లవాడు ఆంగ్లాన్ని ఎక్కడ మర్చిపోతాడో అని ఇంట్లో కూడా ఆంగ్లంలోనే మాట్లాడుకునే దుస్థితి మనది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు వివరించాల్సిన ప్రభుత్వాలు తాము కూడా అదే బాట పట్టేందుకు ప్రయత్నించడం విచారకరం.

 

నిదానంగా ప్రభుత్వ పాఠశాలలు ఒక్కొక్కటీ మూతపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా పాఠశాలల్లో సున్నా శాతం హాజరు నమోదు కావడంతో, వాటిని దగ్గరలోని మరో పాఠశాలలో విలీనం చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. విద్యార్థుల సంఖ్య ఇలా దారుణంగా పడిపోవడం మీద మొన్నటికి మొన్న సుప్రీం కోర్టు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తాము చేయగలిగింది ఏమీ లేదని తెలంగాణ తరఫు న్యాయవాది చేతులెత్తేయడంతో... ‘ఇలాగైతే తెలంగాణను తామే పాలించాల్సి ఉంటుంద’ని హెచ్చరించింది. నిజానికి ప్రభుత్వమూ, ఉపాధ్యాయులూ, తల్లిదండ్రులూ తల్చుకుంటే ప్రభుత్వ పాఠశాలలకు పునర్వైభవం సాధ్యమే!

 

- ప్రజల సంక్షేమం కోసం వందలాది కోట్లను ఖర్చుచేసే ప్రభుత్వానికి, పాఠశాలల కోసం తగినంత నిధులను ఖర్చుచేయడం భారమేమీ కాదు. ప్రతి పాఠశాలలోనూ అన్ని వసతులూ ఉండేలా తగినన్ని నిధులను ఖర్చుచేయడం, ఆ నిధులు సక్రమంగా అమలవుతున్నాయో లేదో పరీక్షించడం ప్రభుత్వ బాధ్యత. సంఘ రాజకీయాలకు అతీతంగా ఉపాధ్యాయుల హాజరు, పనితీరుని ఎప్పటికప్పుడు గమనించడం మరో ముఖ్య కర్తవ్యం.

 

- ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే అరకొర వసతుల సాయంతోనే కొందరు ఉపాధ్యాయులు సాధించే ఫలితాలు చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు. చదువుకోవలసిన అవసరం లేనివారే ప్రభుత్వ పాఠశాలలకు వస్తారన్న అపోహను వదిలిపెట్టి, తమ వద్దకు వచ్చిన ప్రతి పిల్లవాడి మీదా వ్యక్తిగత శ్రద్ధను చూపవలసిన ఉపాధ్యాయులది. తాము ఓ మనిషి జీవితాన్ని తీర్చిదిద్దుతున్నామన్న భావన ఉపాధ్యాయులలో కలిగిన రోజున, ప్రతి ఉపాధ్యాయుడు అద్భుతమైన ఫలితాలను సాధించగలడు.

 

- చదువంటే కేవలం హంగూ, ఆర్భాగం, మార్కులూ, ఆంగ్లంలో ప్రావీణ్యం అన్న భావనను తల్లిదండ్రులు వీడాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే ఉపాధ్యాయులు విద్యను అందించేందుకు తగిన నైపుణ్యం ఉన్నవారన్న విషయాన్ని గ్రహించాలి. లక్షలు పోసి తాము చెప్పించే చదువుకీ దీటైన చదువు ప్రభుత్వ పాఠశాలల్లో అందించవచ్చని తెలుసుకోవాలి. అవసరమైతే ప్రభుత్వ పాఠశాలలో చదివే మిగతా తల్లిదండ్రులతో కలిసి తమ పిల్లలకు నాణ్యతతో కూడిన చదువు చెప్పేలా ఉపాధ్యాయులతో చర్చించాలి.

 

ఇంత చేశాక ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు మెరుగుపడవు!


 

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.