సర్కారీ బడుల్లో మౌళికవసతుల లోపం వెనుక పాపం ఎవరిదీ?
Publish Date:Oct 4, 2012
Advertisement
నిన్న కాక మొన్న కట్టిన ప్రైవేటు స్కూలు మౌళికవసతుల్లో ముందుంటోంది. మరి అరవైఏళ్ల క్రితం ప్రారంభమైన సర్కారీ బళ్లలో మాత్రం మౌళికవసతుల లేమి కొట్టచ్చినట్లు కనబడుతోంది. ఈ లోపం వెనుక పాపం ఎవరిదీ? అని ఒక్కసారి పరిశీలిస్తే నిజాలు అందరినీ కలిచివేస్తున్నాయి. ఈ బళ్లలో చదువుకునే నేతలుగా ఎదిగిన వారు సైతం గతాన్ని మరిచిపోతున్నారన్నది వాస్తవం. భారతరాష్ట్రపతులు కూడా సర్కారీబళ్లలో చదువుకున్న వారే. గతంలో సర్కారీబళ్లే తప్ప ప్రైవేటు విద్యాలయాలు ఉండేవి కావు. అటువంటి కీలకమైన ఈ బళ్లలో మౌళిక వసతులు కల్పించాలని సీరియస్గా అరవైఏళ్ల క్రితం నిర్ణయం తీసుకున్న వారే లేరు. అలాగని అప్పట్లో అవకాశాలు లేవా? అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు నిధుల నుంచి స్కూలుభవనాలకు కేటాయింపులు జరిగేవి. కానీ, నిర్మాణంలో నాణ్యతాలోపాలు ఎక్కువ. అయితే మరుగుదొడ్లు, మంచినీరు వంటి వసతుల విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక నేతలు కూడా పెద్దగా పట్టించుకోలేదు. వాస్తవానికి విద్యార్థినులు, స్కూలు టీచర్లు(మహిళలు) బాగా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం గమనించినా ప్రభుత్వాలు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నాయి. కానీ, ఒక్కసారి తలుచుకుంటే ఈ సమస్యలు పరిష్కరించటం ఏమంత కష్టం కాదు. తాజాగా సుప్రీం కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సర్కారీ బళ్లలో మౌళికవసతుల కల్పనకు ప్రాధాన్యత కల్పించాలని ఆదేశించింది. దీని కోసం తాము ఇచ్చిన మార్గదర్శకాలను కూడా అనుసరించాలని ఉత్తర్వులు ఇచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్21`ఏ ప్రకారం బాలికల మరుగుదొడ్ల వంటి మౌళికవసతుల విషయంలో చట్టాన్ని ఉల్లంఘించినట్లు ప్రభుత్వ పనితీరును పరిగణించాల్సి వస్తుందని సుప్రీం హెచ్చరించింది. ప్రస్తుతం రాజకీయ సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆదేశాలను ఎంత వరకూ అమలు చేస్తారనే ప్రశ్న ఎదురవుతోంది. ఈ తీర్పు అమలు కోసం మరోసారి సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజనవ్యాజ్యం దాఖలు కావాల్సి ఉంటుందేమో కూడా.
http://www.teluguone.com/news/content/government-schools-24-17901.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





