అమలాపురం అల్లర్ల వెనక సర్కార్ హస్తం

Publish Date:May 25, 2022

Advertisement

అనాలోచిత, బాధ్యతా రహిత ప్రభుత్వ నిర్ణయాలు, ఎలాంటి అనర్ధాలకు దారి తీస్తాయో చూపేందుకు, ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మూడేళ్ళ పాలనలో అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. జగన్  రెడ్డి మూడేళ్ళ  తిరగేస్తే అడుగు కొకటిగా అనేక ఉదాహరణలు కపిస్తాయి. పంచాయతీ కార్యాలయాలకు వైసీపే జెండా రంగులు వేయడం మొదలు మూడు రాజధానుల నిర్ణయం వరకు జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలు, వివాదంగా మారాయి.

ఆందోళనలకు దారి తీశాయి  న్యాయస్థానాలకు చేరాయి. ఇంచుమించుగా అన్ని కేసులలోనూ, సర్కార్ వెనక్కి తీసుకోక తప్పలేదు. వందల కోట్లు కాదు వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయింది. ఈ క్రమంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఎబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ తాజా ఉదాహరణగా నిలుస్తుంది. రెండు సంవత్సరాల తర్వాత కోర్టు ఆదేశాల మేరకు ఆయనని సర్వీస్’లోకి తీసుకోక తప్పలేదు. ఇదొక తాజా ఉదాహరణ మాత్రమే, ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు ఇంకా అనేకం.. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనుభవ రాహిత్యం, 151 మంది ఎమ్మెల్యేల బలముందనే రాజకీయ దురహంకారం, ఈ అన్నిటినీ మించి ముఖ్యమంత్రి  సహజ నైజం,  

ఈ   అన్నీ ఒకదానికి ఒకటి తోడై ప్రభుత్వ నిర్ణయాలు రాజకీయ, ఆర్థిక, సామాజిక అనర్ధాలకు దారి తీస్తున్నాయి.  ఇందులో భాగమే ఇప్పుడు, కోనసీమ జిల్లా పేరు విషయంలో ప్రభుతం తీసుకున్న అనాలోచిత నిర్ణయం సృష్టించిన అరాచకం. అందుకే అమలాపురంలో చెలరేగిన హింసకు ప్రభుత్వం, ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.   నిజం అమలాపురం అల్లర్లు తీరు, ప్రభుత్వ స్పందన చూస్తే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నట్లుగా అమలాపురం అల్లర్లు ప్రభుత్వ స్పాన్సర్డ్‌ విధ్వంసమని వేరే చెప్పనవసరం లేదు. నిజానికి ఈ మొత్తం వ్యవహరం ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా, ప్రణాళిక బద్దంగా నడిపించిన నాటకం అని, ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు.  సెక్షన్‌ 144 అమలులో ఉన్నప్పుడు, నలుగురు వ్యక్తులు ఒక దగ్గర చేరితేనే పోలీసులు జోక్యం చేసుకుంటారు.

అలాంటిది అమలాపురంలో, సెక్షన్‌ 144 అమలులో ఉండగానే, వందల మంది వీదుల్లోకి రావడమే కాదు, మంత్రి ఇంటికి నిప్పు పెట్టారు. ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేశారు. అయినా  అక్కడా, ఇక్కడా పోలీసులు ప్రేక్షక పాత్రనే పోషించారు. అందుకే,  ఈ దాడులు సర్కార్ స్పాన్సర్డ్ దాడులని  అచ్చెన్నాయుడు ఆరోపించారు. మంత్రి ఇంటిని దుదగులు తగల పెట్టారంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని నిలదీశారు. మంత్రి విశ్వరూప్‌ ఇంటికి ఎందుకు భద్రత కల్పించలేకపోయారని అడిగారు. అమలాపురం ఘటన వెనుక ప్రభుత్వమే ఉందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. హత్య ఘటన నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ విధ్వంసమని అన్నారు. ప్రజల దృష్టి మళ్లించడం డైవర్షన్‌ సీఎంకు బాగా అలవాటని యెద్దేవా చేశారు. కోనసీమను విధ్వంసం చేయాలని జగన్‌ కంకణం కట్టుకున్నారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.అది ధర్మాగ్రహం. ముఖ్యమంత్రి కోనసీమ పై ఎందుకనో కట్టి కట్టారు, అది రాజకీయ ఆరోపణ కాదు, నిజం. అందుకే ఆ ఆరోపణలో నిజం ఉందని కోనసీమ వాసులే కాదు రాష్ట్ర ప్రజలు అందరూ ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు.  

అలాగే  ప్లాన్‌ ప్రకారమే కోనసీమలో అల్లర్లు సృష్టించారని బీజేపీ నేత సత్యకుమార్‌ ఆరోపించారు. మంత్రి ఇంటినే దహనం చేశారంటే రాష్ట్రంలో పరిస్థితి అర్థమవుతోందన్నారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే దాడులు చేశారని మండిపడ్డారు. కోనసీమ కుట్రలో అధికార పార్టీ భాగస్వామ్యం ఉందని అన్నారు. వైసీపీ నేతల్లో కొందురు దాడులను ప్రేరేపిస్తున్నారని విశ్వరూప్‌ అన్నారని తెలిపారు. మరో బీజేపీ నాయకుద రాజయ్ సభ సభ్యుడు, జీవీఎల్ నరసింహ రావు వైకాపాకు అంబేడ్కర్‌ పట్ల గౌరవం ఉంటే,  నవరత్నాలకు ఆయన పేరు పెట్టొచ్చుగా అని ప్రశ్నించారు. అంబేడ్కర్‌ పేరును ఈ ప్రభుత్వం రాజకీయ వివాదంలోకి లాగిందని ఆరోపించారు. విపక్షాల ఆరోపణల విషయం ఎలా ఉన్నా, జగన్ రెడ్డి ప్రభుత్వం గత చరిత్రను చూసినా, కోనసీమ వివాదానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

By
en-us Political News

  
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజకీయంగా ఎదుర్కొనలేకే.. దర్యాప్తు సంస్థల ద్వారా తమ విజయాన్ని అడ్డుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనాభా నియంత్రణ శిక్షా? బహుమతా? అని నిల‌దీస్తున్నారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పెంచాలని చూస్తోంది. ఆనాడు కేంద్రం పిలుపునిచ్చిందని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయి. ఫలితంగా ఇక్కడ జనాభా పెరగలేదు.
ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.