సీఎం కేసీఆర్  పిసిరిగొట్టా.. నరసింహన్ ఎందుకలా అన్నారు? 

Publish Date:Jun 20, 2021

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను భోళా శంకరుడు అంటుంటారు. ఎవరూ ఏ సాయం అడిగినా చేస్తారని  చెబుతారు. ముఖ్యమంత్రిగా కూడా ఆయన భారీ వ్యయాలతో కూడిన ప్రాజెక్టులకే డిజైన్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ భారీ బడ్జెట్ పథకాలే. తెలంగాణలో అమలవుతున్న రైతు బంధు పథకానికి కూడా ఏటా 15 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు భారీగా కనిపిస్తున్నా... ఆయన పిసిరోడట. ఈ మాట అన్నది ఎవరో కాదు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి, తెలంగాణ, ఏపీ ఉమ్మడి గవర్నర్ నరసింహన్ అట. ఈ విషయాన్ని స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే  చెప్పారు. 

సిద్దిపేట, కామారెడ్డిలో పర్యటించిన కేసీఆర్.. కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కామారెడ్డిలో నిర్వహించిన సభలో సుదీర్ఘంగా మాట్లాడిన కేసీఆర్.. పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. తన గురించి కూడా ఇప్పటివరకు ఎవరికీ తెలియన రహస్యాలు చెప్పారు. అందులో ఒకటి మాజీ గవర్నర్ నరసింహన్ తనను పిసిరిగొట్టు అన్నారన్న విషయాన్ని చెప్పి అందరిలో నవ్వులు పూయించారు గులాబీ బాస్.

తెలంగాణలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేశారు కేసీఆర్. అప్పడు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా నరసింహన్ ఉన్నారు. సీఎం కాగానే కేసీఆర్ కు... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రికి ఉన్న కాన్వాయ్ వచ్చిందట. అయితే ఆ కాన్వాయ్ లోని వాహనాలన్ని బ్లాక్ కలర్ లో ఉండేవి. కేసీఆర్ కు ఆ కలర్ నచ్చలేదట. ఇదే విషయాన్ని అప్పటి సీఎంవో పోలీస్ అధికారి, ప్రస్తుత రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ కు చెప్పారట కేసీఆర్. అప్పుడు మహేష్ భగవత్ కొత్త కార్లు తీసుకుందామని సలహా ఇచ్చారట. అయితే రాష్ట్ర ఆదాయం ఎంత ఉంటుందో తెల్వదు... ఇలాంటి సమయంలో అడ్డగోలుగా ఖర్చు చేయకూడదని కేసీఆర్ చెప్పారట. ఆయనే మహేష్ భగవత్ కు ఓ ఐడియా కూడా ఇచ్చారట. అది ఏమిటంటే... కాన్వాయ్ లోని కార్లకు ఉన్న బ్లాక్ కలర్ పై వైట్ కలర్ వేయించమని చెప్పారట.

సీఎం కేసీఆర్ చెప్పినట్లే బ్లాక్ కార్లకు కలర్ మార్చి వైట్ కాన్వాయ్ గా మార్చేశారట. ఆ కాన్వాయ్ లోనే ఐదు నెలల పాటు తిరిగానని కామారెడ్డి సభలో కేసీఆర్ చెప్పారు.  ఈ విషయాన్ని ఏదో సమయంలో మహేష్ భగవత్ .. గవర్నర్ నరసింహన్ కు చెప్పారట. కొన్ని రోజుల తర్వాత తనను కలిసిన సీఎం కేసీఆర్ దగ్గర కార్ల విషయాన్ని ప్రస్తావించారట గవర్నర్. కేసీఆర్ కార్ల కలరు మార్చుకుని తిరుగుతున్నావా.. నువ్వెంత పిసిరిగోట్టువయ్యా అని అన్నారట. అది కాదు సార్.. రాష్ట్ర ఖజానా ఎలా ఉంటుందో ఇంకా అంచనాకు రాలేదు కదా.. అందుకే ఖర్చు పెట్టడానికి వెనుకాడానని గవర్నర్ కు చెప్పారట కేసీఆర్.  కొన్ని రోజుల తర్వాత పరిస్థితి పూర్తిగా అవగాహనకు వచ్చాకా కొత్త కాన్వాయ్ తీసుకున్నారట ముఖ్యమంత్రి కోసం.  కామారెడ్డి సభలో కేసీఆర్ చెప్పిన ఈ విషయాలను విని అంతా అశ్చర్యానికి లోనయ్యారు. 

By
en-us Political News

  
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ బ‌లోపేతం, స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం, క‌మిటీల నిర్మాణం లాంటి అంశాల‌పై నేతలతో చర్చించిన కేటీఆర్ . స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను ఈ సందర్భంగా అభినందించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత.. ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నందుకు ఆమె కేటీఆర్‌పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్‌మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.
ఒకప్పుడు సోషల్ మీడియాలో లోకేష్‌ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీకి ఆయన తన పనితీరుతోనే సమాధానం చెప్పారు. 400 రోజులకు పైగా సాగిన యువగళం పాదయాత్ర లోకేష్‌ను ప్రజలకు చేరువ చేయడమే కాకుండా.. ఆయనలోని నాయకత్వ పటిమను బయటపెట్టింది. ఆ యాత్రలో ఆయన సేకరించిన ప్రజా సమస్యలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలకు పునాదిగా మారాయి.
కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానంలో భాగంగా యువతతో విస్తృతంగా మమేకమవ్వాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. ఏపీ రాజకీయాలలో కూడా సంచలనం సృష్టించింది. ఆమె పార్టీ ప్రకటన వైసీపీకి ఒకింత ఇబ్బందికరంగా మారగా, తెలుగుదేశం, జనసేన పార్టీల్లో జోష్ ను నింపింది. టీడీపీ-జనసేన కూటమికి కవిత కొత్త పార్టీ ఒక గొప్ప వ్యూహాత్మక అవకాశాన్ని అందించినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
ఎమ్మెల్యేల పనితీరును ప్రజల నుంచే తెలుసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. మే 1 నుంచే ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసిటివి దృశ్యాలను టీవీలో చూసినప్పుడు తనకు అనుమానం కలిగిందనీ.. అందుకే స్వయంగా తనిఖీ చేయడానికి వచ్చానని మమతా బెనర్జీ తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అయినా సరే ప్రజా తీర్పును కాపాడుకుంటామన్న మమతా బెనర్జీ.. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.