Publish Date:Jun 24, 2021
బంగారం ఆ పేరు వింటే కళ్ళు జిగేల్మంటాయి. అది ఆడవాళ్ళకైనా.. మగవాళ్ళకైనా.. లైఫ్ లో ప్రతి ఒక్కరు ఏదో సందర్బంగా బంగారం కొని ధరించాలనుకుంటారు. అందుకే ఆ ప్రాణం లేని బంగారానికి అంత ధర.. అయితే ఈ మధ్య కాలంలో బంగారాన్ని సప్లై చేస్తూ చాలా మంది పోలీసుల చేతికి చిక్కుకుంటున్నారు. ఎయిర్ పోర్ట్ లో అయితేనేమి జాతీయ రహదారి లో అయితేనేమి ప్రయాణం ఏదైనా పోలీసులకు పట్టుపడడం కాయం అయిపోతుంది ఈ రోజుల్లో. అయితే ఆ బంగారు స్మగ్లర్స్ కూడా పోలీసుల కంటికి కనిపించకుండా రకరకాలుగా సప్లై చేస్తున్నారు. పండు ముసలికి సంసారం ఎలా చెయ్యాలో నేర్పడం లాంటిదనే చెప్పాలి పోలీసులకు. వాళ్ళ కుప్పి గంతులు పోలీసుల ముందు ఏ మాత్రం ప్రభావం చూపడం లేదని చెప్పాలి. తాజాగా ఒకటి కాదు రెండు కాదు దాదాపు 5 కేజీల 85 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు కర్నూల్ పోలీసులు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎట్ సిఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో లోకల్,సెబ్ పోలీసులు కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో హైదరాబాదు నుండి బెంగళూరు వెళుతున్న AP 39 TG8888 విక్షం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లో ప్రయాణిస్తున్న బెంగళూరుకు చెందిన నగల వ్యాపారి మహావీర్ జైన్ దగ్గర ఈ బంగారం పట్టుబడింది. విలువ సరైన పత్రాలు , ఆధారాలు లేని కారణంగా సదరు బంగారం బిస్కెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్నూల్ జిల్లా ఎస్పీ డాక్టర్ పక్కీరప్ప, కాగినెల్లి ఎపియస్, ఇంకా సెట్ అడిషనల్ ఎస్పీ గౌతమి సాలి ఆదేశాల మేరకు పంచ లింగాల రాష్ట్ర సరిహద్దు సిట్ చెక్ పోస్టులో తెల్లవారుజామున చేసిన తనిఖీల్లో పెద్ద ఎత్తున బంగారం చిక్కింది. కాగా, మహావీర్ జైన్ బెంగళూరులోని శివాజీ నగర్ లో ఉన్న అరిహంత్ జ్యువెలరీ షాప్ యజమాని. అతని బ్యాగులో సుమారు 5 కేజీల 85 గ్రామలు (45 బంగారు బిస్కెట్లు , రెండు నెక్లెస్ లు) సోదాల్లో గుర్తించారు . వాటికి సంబంధించి సరైన పత్రాలు , ఎలాంటి ఆధారాలు , ఈ – వే బిల్లులు చూపనందున వాటిని కర్నూల్ తాలూకా పోలీస్ స్టేషన్ నందు తదుపరి చర్య నిమిత్తం అప్పగించారు .
ఈ సందర్భంగా కర్నూలు పట్టణ డిఎస్పీ కె.వి మహేష్ , కర్నూలు తాలుకా ఏవి కంటగిరి రాముడు కలిసి తాలూకా పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించి బంగారం వివరాలు వెల్లడించారు. కాగా, చెక్ పోస్టు దగ్గర చేసిన వాహన తనిఖీలలో సిఐ కంటగిరి రాముడు , ఎస్ఐలు ఖాజా వాలి, లక్ష్మి నారాయణ, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/gold-worth-nearly-rs-5-5-crore-seized-kurnool-police-25-118314.html
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.