Publish Date:Jul 10, 2019
కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతూనే ఉన్నాయి. మొన్న తెలంగాణాలో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీనే లేకుండా టీఆర్ఎస్ లో కలిసిపోగా, నిన్న కర్ణాటకలో ఎమ్మెల్యేలు అలకపాన్పు ఎక్కి కూర్చున్నారు. ఈ సంకోభం నుండే గట్టేక్కేందుకు తంటాలు పడుతుండగానే ఇప్పుడు గోవాలోనూ కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు చీలిక వర్గంగా ఏర్పడి అధికార బీజేపీలో లెజిస్లేటివ్ పార్టీని విలీనం చేయాలని కోరుతూ స్పీకర్కు లేఖ సమర్పించారు.
ప్రతిపక్ష నేత చంద్రకాంత్ కవలేఖర్ నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం బుధవారం సాయంత్రం స్పీకర్ను కలిసింది. తమ వర్గానికి చెందిన 10మంది ఎమ్మెల్యేలను బీజేపీ శాసనసభాపక్షంలో విలీనం చేయాలని స్పీకర్కు లేఖ సమర్పించారు. ఈ అనూహ్య పరిణామంతో కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. బీజేపీ బలం 27కు చేరిందని సీఎం స్పీకర్ కి లేఖ రాశారు. అయితే ఈ 10మందిని బీజేపీ శాసనసభాపక్షంలో కలుపుతూ స్పీకర్ రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని అంటున్నారు.
నిజానికి 2017లో గోవాలో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్కు దెబ్బ వేసి బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆనాటి నుండే ప్లాన్ చేస్తూ వచ్చి ఈరోజు ఏకంగా పదిమందిని తమ పార్టీలో చేర్చుకునే ప్లాన్ చేసింది. స్పీకర్కు లేఖ ఇచ్చిన ఆ ఎమ్మెల్యేలు అందరూ ఢిల్లీ పయనమైనట్లు, బీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో వీరంతా బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది.
అలాగే బీజేపీకి మిత్రపక్షంగా, ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న గోవా ఫార్వర్డ్ పార్టీకి చెందిన డిప్యూటీ సీఎం విజయ్ సర్దేశాయ్ సహా ఇతర మంత్రులను తొలగించి కొత్తగా కాంగ్రెస్ నుంచి వచ్చి వారికి మంత్రి పదవులు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు గోవా సీఎం ప్రమోద్ సావంత్. ప్రస్తుత అసెంబ్లీలో బిజెపి -17, కాంగ్రెస్ 15, గోవా పార్వర్డ్ పార్టీ 3, మహారాష్ట్రవాదీ గోమాంతక్ పార్టీ 1, ఎన్సిపి, స్వతంత్రులు ఇద్దరు చొప్పున ఉన్నారు. తాజా పరిణామాలతో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య ఐదుకు పడిపోగా బీజేపీ బలం ఇరవై ఏడుకు చెరనుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/goa-congress-mlas-joining-into-bjp-39-87955.html
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం జులై 17న రైల్ రోకోకు ఆమె పిలుపునిచ్చారు.
మాజీ మంత్రి శిద్దారాఘవరావు ఒకప్పుడు తెలుగుదేశంలో కీలక నేత. చంద్రబాబుకి సన్నిహితుడిగా పార్టీలో పలు కీలక పదవులు కూడా అనుభవించారు. కానీ తెలుగుదేశం 2019 ఎన్నికలలో అధికారం కోల్పోయిన తరువాత వైసీపీ గూటికి చేరారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఆ మాజీ మంత్రిని పెద్దగా పట్టించుకున్న దాఖలులు లేవు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు వల్లభనేని వంశీ ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ను గురువారం (జులై 3) భేటీ అయ్యారు.
పటాన్ చెరు లోని పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ పరిశ్రమలో జరిగిన ప్రమాదం ఆ కంపెనీ షేర్లపై తీవ్ర ప్రభావితం చూపింది. ప్రమాదం జరిగిన తరువాత ఆ కంపెనీ షేర్లు దారుణంగా పతనమయ్యాయి. 3 రోజుల్లోనే దాదాపు 24 శాతం షేర్ వాల్యూ పడిపోయింది.
ఎంతైనా ట్రంపు ట్రంపే.. ప్రపంచంలో ఉన్న ఎన్నో వివాదాలను పరిష్కరించారు. ఆయనకా క్రెడిట్ దక్కాల్సిందే... ఈ మాట అన్నది ఎలాన్ మస్క్. ఇన్నాళ్లూ ఉప్పూ- నిప్పుగా ఉన్న ఈ ఇద్దరూ ఇపుడు కలిసిపోయారా?
వరుసగా జరుగుతున్న విమాన ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా పుణె నుంచి గోవా వెడుతున్న ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది.
పరిశ్రమలలో వరుస ప్రమాదాలు భయాందోళనలను కలిగిస్తున్నాయి. సిగాచీ పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటన అనంతరం మేడ్చల్ లోని ఓ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది.
తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ సమీపంలోని ఓ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఉదయం చెలరేగిన మంటలు ఆలయం ముందున్న చలువ పందిళ్లకు వ్యాపించాయి.
ములుగు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభోట్లు అన్నట్లుగా తయారౌతోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడి అనాలోచిత నిర్ణయాలతో బీఆర్ఎస్ ములుగులో పట్టు కోల్పోతోంది.
తిరుమల అంటే కోట్లాది మంది హిందువులు మనోభావాలతో ముడిపడిన అంశం. టీటీడీ పై దుష్ప్రచారం పోయినంతగా మంచి బయటకు పోవడానికి కొంత ఆలస్యమవుతుంది.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గత రెండు రోజులుగా స్వల్పంగా తగ్గిన భక్తుల రద్దీ గురువారం (జూలై 3)న పెరిగింది.
శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం మండలం, టి.బరంపురం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి తిప్పన. పురుషోత్తం రెడ్డి గ్రామానికి విచ్చేసిన సందర్బంగా గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.
టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ పేరును దుర్వినియోగం చేస్తూ, కళాకారుల నుంచి లక్షల రూపాయలు తీసుకొని మోసగించిన కేసులో కేటుగాడిని తిరుమల వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు.