విశ్వనగరంగా ఘనంగా చెప్పుకునే హైదరాబాద్ మహానగరం గురువారం సాయంత్రం గంట పాటు కురిసిన భారీ వర్షానికి విశ్వనరకంగా మారిపోయింది. ఎడతెరిపి లేకుండా గంట పాటు కురిసిన భారీ వర్షానికి భాగ్యనగరం రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ప్రధానంగా ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాహనదారులు నానా యాతనలూ పడ్డారు.
గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, బయోడైవర్సిటీ, ఐకియా సెంటర్, ఏఎంబీ, ఇనార్బిల్ మాల్, రాయదుర్గం, హైటెక్ సిటీ, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్ తాలలో వాహనాలు నిలిచిపోయి చీమలబారును తలపించాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా గురువారం (ఆగస్టు 7) భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా యాదాద్రి జిల్లా ఆత్మకూరులో 15.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక నల్గొండ జిల్లా శాలిగౌరారంలో 14.3 సెంటీమీటర్లు, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో 14, యాదాద్రి జిల్లా అడ్డగూడూరులో 13.2, వలిగొండ వెంకటపల్లెలో 11.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో 12.7 సెంటీమీటర్లు, సరూర్నగర్లో 12.8, ఖైరతాబాద్లో 12.6, గండిపేటలో 12.2, యూసుఫ్గూడలో 12.4 సెంటీటర్లు, అదే విధంగా ఉప్పల్లో 11.7, ఎల్బీనగర్లో 11.3,
అమీర్పేటలో 11.1, షేక్పేటలో 11.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/globalcity-hyderabad-lashed-by-heavy-rain-39-203750.html
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.