రాష్ట్రపతి రేసులో ఆజాద్!!.. క‌శ్మీర్ ఫైల్స్‌ను మించి పాలిటిక్స్‌!?

Publish Date:Mar 28, 2022

Advertisement

రాష్ట్రపతి రామ్ నాధ్ కొవింద్ పదవీకాలం మరో మూడు నెలల్లో ముగుస్తుంది. భారత 14వ రాష్ట్రపతిగా రామనాథ్ కొవింద్ 2017 జూలై 25 ప్రమాణస్వీకారం చేశారు. సో ..ఆయన ఐదేళ్ళ పదవీ కాలం 2022 జులై 24తో ముగుస్తుంది. ఈ నేపధ్యంలో ఈ సంవత్సరం జులైలో జరిగే రాష్ట్రపతి ఎన్నిక పై ఇటు రాజకీయ వర్గాల్లో, అటు మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. నిజానికి  ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలే కాదు, రాజకీయ విశ్లేషకులు కూడా, బీజేపీ అభ్యర్ధి గెలుపు అంత ఈజీ కాదనే అనుకున్నారు. నిజం, బీజేపీ నాయకులు కూడా అదే అభిప్రాయం వ్యక్త పరిచారు. ప్రతిపక్షాలు కూడా అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వగలమనే విశ్వాసంతో వ్యూహాలు రచించుకున్నాయి. శరద్ పవార్ మొదలు  కేసీఆర్’ దాకా చాలా మంది పేర్లను ప్రతిపక్ష పార్టీలు చర్చకు తెచ్చాయి. అలాగే, కాంగ్రెస్ పార్టీ అసమ్మతి నేత గులాంనబీ ఆజాద్, బీస్పీపీ అధినేత్రి మాయావతితో పాటుగా బీజేపీకి కొంచెం దగ్గరగా ఉండే మరికొందరి పేర్లు కూడా ప్రముఖంగా వినిపించాయి. అయితే, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో దేశంలో బీజేపీ తన మరింత బలాన్ని పెంచుకుంది. ఇటు అసెంబ్లీలోబలం పెరగడంతో పాటుగా, మార్చి 31న జరిగే రాజ్యసభఎన్నికల తర్వాత పెద్దల సభలోనూ బీజేపీ బలం మొదటి సారిగా, మూడంకెల సంఖ్య (100) మార్క్’ను దాటుతోంది. మరో వంక వైసీపీ, బీజేడీ వంటి విపక్ష మిత్ర పక్షాల మద్దతు ఎటూ ఉంటుంది కాబట్టి, బీజేపీ అభ్యర్ధి ఎవరైనా, ఆ అభ్యర్థి గెలుపు లాంఛనమే అనేది ఇప్పటికే తేలిపోయింది. 

రాష్ట్రపతిని పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు 776 మందితో పాటుగా, దేశం మొత్తంలో ఉన్న 4,120 మంది ఎమ్మెల్యేలతో కూడిన ఎలక్ట్రోల్ కాలేజీ ఎన్నుకుంటుంది. మొత్తం ఎలక్ట్రోల్ కాలేజ్‌లో ఓట్ల సంఖ్య 10,98,903 కాగా.. ఇందులో బీజేపీ బలం సగం కంటే ఎక్కువే ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థి గెలుపు విషయంలో పెద్దగా శ్రమ పడవలసిన అవసరం లేదని, అంటున్నారు. 
అయితే అభ్యర్ధి ఎవరనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రావలసి వుంది. రామనాధ్ కోవింద్’కు మరో అవకాశం ఇవ్వవచ్చనే ఉహాగానాలు సాగుతున్నా, అలాంటి అవకాశం ఉండకపోవచ్చని, అంటున్నారు. అలాగే, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా రేసులో ముందున్నారని అంటున్నారు. అలాగే, బీస్పీపీ అధినాయకురాలు మాయావతి పేరు కూడా వినవచ్చినా, ఆమె క్లారిటీ ఇచ్చేశారు. బీజేపీ ఆఫర్ చేసినా స్వీకరించేందుకు ఆమె సుముఖంగా లేరు. బీజేపీనే కాదు ఏ పార్టీ నుంచి రాష్ట్రపతి పదవికి ఆహ్వానం వచ్చినా తీసుకునే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు. రాష్ట్రపతి పదవిని అంగీకరిస్తే, బీఎస్పీ పార్టీ అంతమవుతుందని తెలిసినప్పుడు తాను అలాంటి (రాష్ట్రపతి) పదవికి ఎలా అంగీకరిస్తానని ప్రశ్నించారు. బీజేపీనే కాదు ఏ పార్టీ నుంచి రాష్ట్రపతి పదవికి ఆహ్వానం వచ్చినా తీసుకునే ప్రసక్తే లేదన్నారు. 

ఇదిలా ఉండగా, రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై పలు పరిశీలనలు అవసరమని, వివిధ అంశాలను బేరీజు వేసుకుని దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ తుది నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, రాజకీయంగా కాంగ్రెస్ అసమ్మతి నేత గులాం నబీ ఆజాద్ లేదా కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహ్మద్ ఖాన్’లలో ఒకరు రాష్ట్రపతి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బీజేపీ అంతర్గత వర్గాల సమాచారంగా వినవస్తోంది. గులాం నబీ రాజ్యసభ పదవీ కాలం ముగిసిన సమయంలో పెద్దల సభలో ప్రధాని మోడీ, ఆయన్ని గురించి గొప్పగా చెప్పడమే కాకుండా ఎమోషన్’కు లోనై కన్నీళ్లు పెట్టుకుంది మొదలు గులాం నబీ కాషాయ దళానికి దగ్గరవుతున్నారు. ఈ సంవత్సరం మోడీ ప్రభుత్వం ఆయన్ని ‘పద్మవిభూషణ్’తో సత్కరించింది. అన్నిటినీ మించి తాజాగా, గులాం నబీ, తమ కుటుంబంతో సహా జమ్ము కశ్మీర్’లో ప్రతి కుటుంబం ఒకప్పుడు హిందువులే అని చేసిన వ్యాఖ్యతో గులాం నబీ, కాషాయం కట్టని కాషాయదారిగా ముద్రవేసుకున్నారు. అదలా ఉంటే  ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఉమ్మడి అభ్యర్ధిని నిలబెట్టి అధికారపార్టీని ఇరకాటంలో పెట్టాలని ఎంతో కొంత ఉత్సాహం చూపిన విపక్షాలు, ఇప్పుడు ఎవరిని బరిలో దిచాలనే విషయంలోనే కాదు, అసలు పోటీకి దిగాలా వద్దా అనే విషయంలోనూ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.

By
en-us Political News

  
బీఎస్పీ గతంలో నాలుగుసార్లు అధికారంలో ఉన్న విషయాన్ని గుర్తుచేస్తూ ..2027 ఎన్నికలలో ప్రజలు మరోసారి బీఎస్పీని అధికారంలోకి తీసుకురావాలని ఆశపడుతున్నారన్నారు. యూపీలో బీఎస్పీ ఐదో సారి అధికారంలోకి రావడం ఖాయమన్న ధీమాను మాయావతి వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో టీడీపీకి ఒక బెర్త్ క‌న్ఫ‌ర్మ్ అయిన‌ట్టు క‌నిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో టెండరింగ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందనీ, కేవలం మైనింగ్ మాత్రమే కాకుండా, విద్యుత్, ఇరిగేషన్, రోడ్లు ఇలా ప్రతి రంగంలోనూ నచ్చిన వారికి కాంట్రాక్టులు కట్టబెడుతూ అడ్డగోలు దోపిడీకి తలుపులు బార్లా తెరిచారని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
జగన్ పాలనా వైఫల్యాలు అంటూ వైసీపీయులు కలలో కూడా అంగీకరించడానికి సాహసించని మాటలను పేర్ని నాని నోటి వెంట రావడం రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది. జగన్ పాలనా వైఫల్యం కారణంగానే 2019 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని ఘోరపరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందని పేర్ని నాని యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంగీకరించేశారు.
రాజకీయాల్లో నాయకులపై విమర్శలు, ఆరోపణలు సహజం. వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవడం అన్నది సాధారణంగా అధకారంలో ఉన్న వారిపై కంటే అధికారంలో లేని వారిపైనే ఎక్కువగా జరుగుతుంటుంది. అయితే ఈ పద్ధతిని బ్రేక్ చేసి.. ఇది ప్రజాస్వామ్యం, తన, పర తేడా లేకుండా ఎవరిపై ఆరోపణలు వచ్చినా విచారణ జరుపుతామని,తప్పు చేశారని నిర్ధారణ అయితే చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ చెబుతున్నారు.
ముంబైపై పట్టు సాధించడమే లక్ష్యంగా థాక్రే బదర్స్ కలవడం ప్రాథాన్యత సంతరించుకుంది. ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ-షిండే కూటమి విజయం సాధించే అవకాశం ఉందని తెలినప్పటికీ, థాక్రేల కలయిక నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందన్న ఉత్కంఠ ముంబై వాసులలోనే కాకుండా, దేశ వ్యాప్తంగా వ్యక్తం అవుతోంది.
రాష్ట్రంలో మునిసిపోల్స్ దగ్గర పడుతున్న తరుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శుక్రవారం నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నిర్మల్ జిల్లాలో సదర్ ఘాట్ బ్యారేజీకి, అలాగే ఆదిలాబాద్ జిల్లాలో చనాక-కోరట పంప్ హౌస్ కు ప్రారంభోత్సవం చేయనున్నారు.
రాయలసీమ లిఫ్ట్ విషయంలో మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆ ప్రాంతానికి ద్రోహం చేశారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు.
తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠమనేని సారథ్యంలో వాస్తవ వేదిక ఎనిమిదో ప్రోమో విడుదలైంది.
అనంతపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత దగ్గుబాటి ప్రసాద్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
తెలంగాణలో ఒక రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన సమయంలో ఈ బ్రిడ్జి పనులకు నిధులు తెచ్చింది తామంటే తామంటూ బీజేపీ, బీఆర్ఎస్ లు క్రెడిట్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ వ్యవహారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డిగా మారింది.
స్కిల్ కేసు పేరుతో జగన్ సర్కార్ 2023 సెప్టెంబర్ 9నచంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు ఆ తరువాత హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆధునిక శుక్రాచార్యుడిగా అభివర్ణించారు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువన్న సంగతి తెలిసిందే. ఇక కేటీఆర్ ను అయితే ఆయన ఏకంగా మారీచుడిగా అభివర్ణించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.