జీహెచ్‌ఎంసీ డివిజన్ల పునర్విభజనపై హైకోర్టులో పిటిషన్‌

Publish Date:Dec 15, 2025

Advertisement

 

జీహెచ్‌ఎంసీ డివిజన్ల పెంపు వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరింది. డివిజన్ల పెంపును సవాల్ చేస్తూ వినయ్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బి.విజయ్ సేనరెడ్డి విచారణ చేపట్టారు. డివిజన్ల పునర్విభజనలో అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని వినయ్‌కుమార్‌ పిటిషన్‌లో తెలిపారు.  

డివిజన్‌పై తన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్‌ కోరారు. అనంతరం పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. మరోవైపు రేపు బల్ధియా ప్రత్యేక కౌన్సిల్ ప్రత్యేక సమావేశం కానుంది. ఈ సమావేశంలో కార్పొరేటర్ల అభిప్రాయాన్ని తీసుకోనున్నారు. 

 ఇప్పటి వరకు 1,328 అభ్యంతరాలు వచ్చాయిని  జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌ తెలిపారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్, జోనల్, సర్కిల్ ఆఫీసుల్లో అభ్యంతరాలు స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ 17వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు.   

By
en-us Political News

  
తమిళనాడు రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
వికారాబాద్ జిల్లాలో డ్రోన్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రమాదం చోటుచేసుకుంది
సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం దిశగా సాగుతున్న సమయంలో ఈ ఆసక్తికరమైన సన్నివేశం కనిపించింది.
వైద్య వృత్తిని కేవలం వృత్తిగా మాత్రమే కాకుండా, సామాజిక బాధ్యతగా భావించే వ్యక్తులు అరుదుగా ఉంటారు.
అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో కీలకమైన హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఒకవైపు మంచి ఉద్యోగం, మరోవైపు సమాజం నుంచి వచ్చే విమర్శలు.. ఇవన్నీ దాటుకుని తన కలల దిశగా అడుగులు వేయడం సాధారణమైన విషయం కాదు
ఐపీఎల్‌‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మరో రికార్డును బ్రేక్ చేశాడు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ సర్జరీకి అపోలో ఆస్పత్రిలో ఎంత బిల్ అయ్యింది? దాన్ని ఎవరు చెల్లించారు? చర్చ ఒకటి నడుస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం సందర్భంగా అన్న క్యాంటీన్ల కు రూ.76 లక్షల విరాళం ఇచ్చిన భువనేశ్వరి
సీఎం చంద్రబాబు నాయుడు పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో ఎన్నికల సమరానికి సిద్ధమయ్యారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాల అంశం హాట్ టాపిక్‌గా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిత్యం గొడవలు, విమర్శలు సర్వసాధారణం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.