హీరోయిన్ ఛార్మి ఈమధ్య జనాలకి ట్విట్టర్ ద్వారా షాకులిస్తోంది. మూడు రోజుల క్రితం ‘ఓ ఎస్ అయాం ఇన్ లవ్’ అని ట్విట్ చేసింది. దాంతో టాలీవుడ్ జనంతోపాటు మామూలు జనం కూడా ఛార్మి మనసు దోచుకున్న మగానుభావుడెవరబ్బా అని బుర్రలు పగిలిపోయేలా ఆలోచించారు. అయితే సమాధానం మాత్రం దొరకలేదు. ఛార్మి లవ్వులో పడ్డానని చెప్పిందిగానీ, ఎవరితో పడిందో మాత్రం చెప్పలేదు. జనం ఇంకా ఆమె లవ్వుకి సంబంధించిన సందేహాల్లో మునిగి తేలుతూ వుండగానే ఛార్మి మంగళవారం నాడు మరో షాకింగ్ ట్విట్ చేసింది. ‘‘ఈరోజు నేను పెళ్ళి చేసుకుంటున్నాను’’ అని పోస్టు పెట్టింది. ఈ వాక్యం పక్కనే ఒక లవ్ సింబల్ కూడా పెట్టింది. అయితే కొంతమంది సినీ మేధావులు మాత్రం ఈ ట్విట్లను లైట్గా తీసుకోవాలని అంటున్నారు. ఛార్మి ప్రస్తుతం ‘జ్యోతిలక్ష్మి’ సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా షూటింగ్ సందర్భంగా హీరోతో లవ్లో పడిపోయిన సందర్భంలో అలా నేను ప్రేమలో పడ్డానని ట్విట్ చేసి వుంటుందని, మంగళవారం నాడు ఏదో పెళ్ళి సీన్లో యాక్ట్ చేసి ‘ఈరోజు నేను పెళ్ళి చేసుకుంటున్నాను’ అని ట్విట్ చేసి వుంటుందని చెబుతున్నారు. ఇలా చిలిపి పనులు చేయడం ఛార్మికి బాగా అలవాటని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ విషయంలో ఛార్మి క్లారిటీ ఇచ్చేవరకూ ఈ సస్పెన్స్ కొనసాగుతూనే వుంటుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/getting-married-today-39-44920.html
ఛత్తీస్గఢ్లో మరోసారి ఎన్కౌంటర్లో చోటుచేసుకుంది. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో శుక్రవారం భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మరో కీలక నేత మైలారపు ఆడెల్లు అలియాస్ భాస్కర్ మృతి చెందారు.
బీఆర్ఎస్ పార్టీలో దెయ్యాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలే విమర్శస్తుంటే మాజీ సీఎం కేసీఆర్ నోరు విప్పలేని స్ధితిలో ఉన్నారని సీఎం రేవంత్రెడ్డి ఎద్దేవా చేశారు.
వచ్చే ఏడేళ్లలో విశాఖను మరో ముంబైలా తీర్చిదిద్దాలని అధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు. ఇవాళ అమరావతిలో జరిగిన నీతి ఆయోగ్ భేటీలో సీఎం చంద్రబాబు ఈ మేరకు కీలక నిర్ణయాలు ప్రకటించారు.
గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పరామర్శించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 25 వేల కోట్ల అవినీతికి పాల్పడిందని గతంలో కేటీఆర్ ఆరోపణలు చేశారు
క్వార్జ్ట్ అక్రమ తవ్వకాల కేసులో నెల్లూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డికి ఇప్పట్లో బెయిల్ లభించే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా కోర్టు ఆదేశాలతో కాకాణిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
తన తండ్రి, వైసీపీ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం క్యాన్సర్తో బాధపడుతున్నారనీ, అయితే తన సోదరుడు ముద్రగిరి ఆయనకు కనీసం వైద్యం అందించకుండా వేధిస్తున్నారనీ, ఆయన ఎవరినీ కలవకుండా, ఆయనను ఎవరూ చూడకుండా అడ్డు పడుతున్నారనీ ముద్రగడ కుమార్తె క్రాంతి ట్వీట్ చేశారు.
ప్రపంచంలోనే ఎత్తయిన చినాబ్ రైల్వే వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అదేవిధంగా కట్రాలో రూ.46 వేల కోట్లతో విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలతో ప్రారంభోత్సవాలు చేశారు.
ఇప్పటి వరకూ అత్యధిక గెలుపులంటే అవి ఆస్ట్రేలియావే. ఇప్పటి వరకూ వరల్డ్ క్రికెట్ ని ఈ దేశం శాసించినంతగా మరే దేశం శాసించలేదు. తొలి రోజుల్లో వెస్టిండీస్ ఇలాగే ఉన్నా.. తర్వాతి కాలంలో ఆస్ట్రేలియా ఈ విజయ పరంపర అందిపుచ్చుకుంది.
విరాళాలిచ్చి మరీ ట్రంప్ ని గెలిపించిన మస్క్ రివర్స్ కు కారణమేంటి?
హైదరాబాద్ నగరంలో రాబోయే 4 నెలలు స్పెషల్ డ్రైవ్ చేపడతామని హైడ్రా కమీషనర్ రంగనాథ్ తెలిపారు. నాలాలపై అక్రమంగా నిర్మించిన కమర్షియల్ భవనలను తొలిగిస్తామని కమీషన్ తెలిపారు.
ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించిన ఘటనపై సిద్దరామయ్య సర్కార్ సీరియస్ అయ్యింది.
దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 489 కొత్త కేసులు నమోదయ్యాయి