Publish Date:Mar 13, 2026
ధరల పెరుగుదలతో సాధారణ ప్రజలు ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొం టున్న సమయంలో హోటల్ బిల్లులు కూడా పెరుగుతున్నాయి. ఈ పెంపులో హోటల్ యాజమాన్యాలు కొత్త విధానాన్ని అవలంబిస్తున్నారు. ఈ విధానంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. తాజాగా ఒక హోటల్ బిల్లులో టిఫిన్ ధరతో పాటు ప్రత్యేకంగా గ్యాస్ ఛార్జీలు కూడా వేసి వసూలు చేయడం గమనార్హం.
ఆ బిల్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ బిల్లులో టిఫిన్ ధరతో పాటు గ్యాస్ ఛార్జ్ పేరిట అదనపు సొమ్ము మెన్షన్ చేయడం అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. పెరుగుతున్న ఎల్పీజీ ధరల కారణంగా కొన్ని హోటల్ యాజమాన్యాలు ఈ విధంగా అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. టిఫిన్ ధరలోనే వంట ఖర్చులు ఉండాలి గానీ, ప్రత్యేకంగా గ్యాస్ ఛార్జీలు వసూలు చేయడం సరైన పద్ధతి కాదంటున్నారు.
అసలు విషయంలోకి వస్తే చెన్నైలోని పెరుంగుడి పరిధి తిరువెంకడనగర్ ప్రాంతంలో ఉన్న గీరాస్ రెస్టారెంట్ కివెళ్లి చేసిన ఓ కస్టమర్.. ఆ తరువాత హోటల్ సిబ్బంది ఇచ్చిన బిల్లు చూసి స్టన్ అయిపోయాడు. ఇంతకీ ఆ బిల్లులో తాను తిన్న టిఫిన్ ధరలతో పాటు బిల్లులో గ్యాస్ యూసేజ్ చార్జ్ పేరుతో అదనంగా కొంత మొత్తాన్ని చేర్చి ఉంది. హోటల్లో వండిన ఆహారం తినడానికి వచ్చిన కస్టమర్లపై వంట గ్యాస్ ఖర్చును ప్రత్యేకంగా వేయడం ఏమిటని షాక్ అయిన ఆ కస్టమర్ వెంటనే ఆ బిల్లును సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. అది వెంటనే వైరల్ అయ్యింది. దీనిపై నెటిజనులు తెగ సెటైర్లు వేస్తున్నారు. వినియోగదారుల సంఘాలైతే మండిపడుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/gas-usage-charge-aditional-in-hotelbill-36-215422.html
కరీంనగర్ పీఎంజే జ్యువలరీ షాప్ లో దోపిడీ చేసిన కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.
చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న కుంకీ ఏనుగులకు.. ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. మనుషులకు ఉండే ఆధార్ తరహాలోనే ఈ కార్డులను రూపొందించనుంది
మోదీ తన ఎక్స్ ఖాతా డీపీగా ఆపరేషన్ సిందూర్ ఫోటోను పెట్టుకొని సైన్యానికి గౌరవం ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ మెరుపు దాడిని చేపట్టిన సంగతి తెలిసిందే.
చెన్నూరుకు చెందిన యోగేంద్ర కుమార్ వర్మ, హేమశ్రీ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కాలక్రమేణా ఆ స్నేహం ప్రేమగా మారింది. వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతో బలమైనది. అయితే.. గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు సమాచారం.
కుటుంబ సభ్యులతో మాట్లాడిన అల్లు అరవింద్, ప్రమాదం వల్ల వారికి కలిగిన బాధను పంచుకుంటూ ధైర్యం చెప్పారు. బాలుడి చికిత్సకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో శ్రీతేజ్ సోదరి చదువుల బాధ్యతను తాను తీసుకుంటానని అల్లు అరవింద్ ప్రకటించారు.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ.. పంజాబ్పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆరంభం నుంచే సన్ రైజర్స్ బ్యాటర్లు పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడి సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వర్షం కురిపించారు.
నార్త్ 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్గ్రామ్లో బుధవారం రాత్రి ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్చి హత్య చేశారు. దోహరియా ప్రాంతంలోకి ఆయన కారును వెంబడించి వచ్చిన దుండగులు చంద్రనాథ్ రథ్పై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-IIకు ఆమోదం తెలపాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై వరంగల్ సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ తక్షణం క్షమాపణలు చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.
రిటైర్డ్ డీజీపీ బి. శివధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర భద్రతా సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు.
తన పర్యటనల సమయంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశాలు
వరంగల్ జిల్లాలో నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సు వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.