ప్రజల మెడకు గ్యాస్ గుదిబండ
Publish Date:Oct 20, 2012
Advertisement
యూపీఏ ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవ్.. పైసా రావాలంటే పెటపెటలాడుతోంది.. అప్పుల తిప్పలు ఆఖరి అంకానికి వచ్చేశాయ్.. డబ్బులేమైనా చెట్లక్కాస్తున్నాయా.. అంటూ చిర్రుబుర్రులాడిన ప్రథాని ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్స్ ని దేశంలోకి అనుమతించేందుకు పచ్చజెండా ఊపింది అందుకే.. సబ్సిడీల భారాన్ని మోయడంవల్ల ఒరిగేదేంలేదని యూపీఏ సర్కారు గ్రహించింది. అందుకే సబ్సిడీలకు అన్ని వైపులనుంచీ కోతలు పెట్టేందుకు ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయ్. వంటగ్యాస్ సిలిండర్లపై సబ్సిడీని ఎత్తేసే విషయంలో సర్కారు ఆగమేఘాలమీద నిర్ణయంకూడా తీసేసుకుంది. వచ్చే ఏప్రియల్ నుంచి వంటగ్యాస్ బండ రేటు రూ. 967. ఇకపై అందరికీ రాయితీ లేని సిలిండర్లే అందుబాటులోకొస్తాయ్. ఒకేసారి సబ్సిడీల్ని పూర్తిగా ఎత్తేస్తే ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వస్తుంది కనుక సర్కారు తెలివిగా అంచెలంచెలుగా సబ్సీడీలకోత విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే వచ్చే ఏప్రియల్ నెలనుంచి గ్యాస్ సిలిండర్లపై ఇచ్చే సబ్సిడీని బ్యాంక్ అకౌంట్లలో జమచేయాలని చమురు కంపెనీలు, ప్రభుత్వం కలిసికట్టుగా నిర్ణయం తీసుకున్నాయ్. కొంతకాలంపాటు ఇలా నేరుగా డబ్బు చెల్లించే పద్ధతిని వినియోగదారులకు అలవాటు చేస్తూ సబ్సిడీని బ్యాంక్ అకౌంట్లలో జమచేస్తూ పోతే.. తర్వాత్తర్వాత బ్యాంక్ అకౌంట్లలో జమ విషయాన్ని వదిలేసినా జనం పెద్దగా పట్టించుకోని స్తితికి చేరుకుంటారన్నది ఆర్థిక నిపుణుల అంచనా.
http://www.teluguone.com/news/content/gas-price-hike-31-18385.html





