గుడ్డు డే మీల్ అసలు క‌థ‌ ఏమిటి?....గరికపాటి వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటి?

Publish Date:Mar 22, 2026

Advertisement

 

ఇన్ జ‌న‌ర‌ల్‌గా.. మిడ్ డే మీల్ వ‌ర‌కూ ఓకే. కానీ ఈ గుడ్డు డే మీల్ ఎందుకూ? అవ‌స‌ర‌మా? ఆ పిల్లాడు బాగా తిని శోభ‌నం పెళ్లికొడుకులా మారి మంచ‌మెక్కి ప‌డుకోడా? అంటూ సాగిన‌  గ‌రిక‌పాటి మాట‌ల్లోని అంత‌రార్ధం ఏమిటి? అన్న చ‌ర్చ ఒక‌టి మొద‌లైంది.

పిల్ల‌లు మ‌న భ‌విష్య‌త్ త‌రాలు. భ‌విష్య‌త్ బాగుంటే మ‌న‌మూ బాగుంటాం. వ‌చ్చే  రోజుల్లో ఈ జాతి మొత్తం బాగుంటుంది. ఇందులో ఎలాంటి త‌ప్పిదం లేదు. అనుమానం లేదు. వంక అక్క‌ర్లేదు. వారికి గుడ్డు పెట్ట‌డంలో వ‌చ్చిన న‌ష్ట‌మేం లేదు. 

మ‌రి గ‌రిక‌పాటి ఎందుక‌లా ఎగ్ మీల్స్ ని తీవ్రంగా  త‌ప్పు ప‌డుతున్నారు? అన్న‌దొక పాయింట్. చ‌దువు మీద దృష్టిసారించ‌కుండా.. ఈ గుడ్డూలో గోల ఎక్కువ అవుతుంద‌నే ఆయ‌న అంటోన్న  మాట‌ల సారం. గ‌త వైసీపీ ప్ర‌భుత్వంలో టీచ‌ర్ల‌కు వైన్ షాపు ముందు డ్యూటీలు వేశారు. టీచ‌ర్లు.. టీచ‌ర్ బ్రాండ్  బ్రాండీ విస్కీల స‌ప్లై  ద‌గ్గ‌ర  వేయ‌డం ఏంట‌ని అప్ప‌ట్లో పెద్ద చ‌ర్చ‌. 

ఇప్పుడు గ‌రిక‌పాటి వెలుగులోకి తెచ్చిన టీచ‌ర్ల‌- గుడ్ల లెక్కింపు వ్య‌వ‌హారం  కూడా స‌రిగ్గా అలాంటిదేనంటారు కొంద‌రు. వారు పాఠాలు చెప్పాలా?  లేక ఈ గుడ్లను లెక్కించాలా? అన్న టాపిక్ ఆయ‌న రైజ్ చేసిన పాయింట్ల‌లో ముఖ్య‌మైన‌ది. ఆల్ ఇన్ ద గేమ్ అన్న‌ట్టు.. టీచ‌ర్లు త‌మ డ్యూటీ అయ్యాక‌(కొంద‌రు ఆ డ్యూటీ కూడా చేయ‌ర‌నుకోండి) బ‌య‌ట ఇంకా ఎన్నో చేస్తుంటారు. చాలా మంది టీచ‌ర్లు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఆపై ఎల్ఐసీ, చిట్టీలు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే. వీటిలో ట్యూష‌న్ల‌ది అతి పెద్ద వ్య‌వ‌హారం. ఇక ఇక్క‌డ సెల‌వులు పెట్టి- అక్క‌డ‌ కార్పొరేట్ కాలేజీల్లో వారు చెప్పే కాస్ట్ లీ క్లాసుల సంగ‌తి  స‌రే స‌రి.

అలాంటి టీచ‌ర్లు.. గుడ్లు లెక్క పెట్ట‌గా వ‌చ్చే న‌ష్ట‌మేం లేదు. వాళ్ల‌కు లేని నొప్పి మ‌న‌కేంటి?  దానికి తోడు టీచ‌ర్లు కూడా ఒకే స‌బ్జెక్ట్ కే ప‌రిమితం అవుతుంటారు. ఒక స్టూడెంట్ తో పోలిస్తే అది ఎంతో ఈజీ జాబ్. సింగిల్ స‌బ్జెక్ట్ కి గుడ్డులాంటి ఇంకో స‌బ్జెక్ట్ యాడ్ కావ‌డం ఏమంత క‌ష్ట‌మైన వ్య‌వ‌హారం ఏమీ కాదు.

ఇక మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం.. ఎప్ప‌టి నుంచి ప్ర‌వేశ పెట్టారు? ఎవ‌రు ఎక్క‌డ ప్ర‌వేశ పెట్టార‌ని చ‌రిత్ర తిర‌గేస్తే.. ఈ ఘ‌న‌త భార‌త దేశానికే ద‌క్కుతుంది. ఇది ఎప్పుడు ఎలా మొద‌లైందో ప‌రిశీలిస్తే.. 1925లో మ‌ద్రాసు మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలోని ఒక పాఠ‌శాల‌లో పేద విద్యార్ధుల‌కు తేలిక పాటి భోజ‌నం అంటే టిఫిన్ అందించే ప్ర‌తిపాద‌నకు ఆమోదం ల‌భించింది. స్కూళ్ల‌లో ఆక‌లిని త‌గ్గించ‌డం, పిల్ల‌ల హాజ‌రీని పెంచ‌డం ఈ ప‌థ‌కం ప్ర‌ధాన ఉద్దేశం.  
  
త‌ర్వాతి కాలంలో.. నాటి త‌మిళ ముఖ్య‌మంత్రి కామ‌రాజ్.. 1950ల మ‌ధ్య కాలంలో దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్త‌రించే య‌త్నం చేశారు. ఇందు వ‌ల్ల స్కూలు విద్యార్ధుల న‌మోదు గ‌ణ‌నీయంగా పెరిగింది.1995, ఆగ‌స్టు 15న భార‌త ప్ర‌భుత్వం.. జాతీయ స్థాయిలో నేష‌న‌ల్ ప్రోగ్రాం ఆఫ్ న్యూట్రిషన‌ల్ స‌పోర్ట్ టు ప్రైమ‌రీ ఎడ్యుకేష‌న్ పేరిట ఈ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ పెట్టింది. ప్రారంభంలో ఇది కేవ‌లం కొంద‌రు విద్యార్ధుల‌కు ముడి రేష‌న్ స‌రుకులు మాత్ర‌మే ఇచ్చేదిగా ఉండేది. కానీ, 2001లో సుప్రీం కోర్టు ఆదేశాల మేర‌కు త‌మిళ‌నాడు త‌ర‌హాలో.. వేడిగా  వండిన భోజ‌నం అందించే ప‌థ‌కంగా రూపాంత‌రం  చెందింది.

ప్ర‌స్తుతం ఈ ప‌థ‌కం పేరు- ప్ర‌ధాన మంత్రి పోష‌ణ్ శ‌క్తి నిర్మాణ్ గా పిలుస్తున్నారు. త‌ర‌గ‌తి గ‌దిలో ఆక‌లి ద్వారా చ‌దువుపై దృష్టి సారించ‌డం వీలు కాదు. కాబ‌ట్టి పిల్ల‌ల‌కు క‌డుపు నిండా ఆహారం అవ‌స‌రం అనేది ఈ ప‌థ‌కం ముఖ్య ఉద్దేశం. దానికి తోడు పేద కుటుంబాల్లోని పిల్ల‌లు ప‌నికి వెళ్ల‌కుండా స్కూలుకు వ‌చ్చే దిశ‌గా ప్రోత్స‌హించ‌డ‌మే దీని మెయిన్ టార్గెట్. ఇక గుడ్డు కూడా క‌లిపి  పెట్ట‌డం వ‌ల్ల ఎదిగే పిల్ల‌ల‌కు అవ‌స‌ర‌మైన ప్రొటీన్లు, విట‌మిన్లు అందించ‌డం కూడా ఒక భాగ‌మే.

దానికి తోడు ఈ జ‌న‌రేష‌న్ గ‌తంలోలా నాటు ఆహారం తిని బ‌లిష్టంగా ఎదుగుతున్న వారు కాదు. మోస్ట్ ఆఫ్ ద చిల్డ్ర‌న్.. ఇంటి గ‌ది నుంచి త‌ర‌గ‌తి గ‌దికి వెళ్తున్న వారే అధికం. ఫారం కోళ్ల‌లా బ‌తుకులీడుస్తున్న దుస్థితి రాజ్య‌మేలుతోంది. కొన్ని స్కూళ్ల‌లో క‌నీసం మైదానం కూడా ఉండ‌దు. దానికి తోడు ఇప్పుడంతా.. జంక్ ఫుడ్ జ‌న‌రేష‌న్. వీరు అధిక శాతం ప్యాకెట్ ఫుడ్ తింటూ బ‌తుకుతున్నారు. అలాంటి వారికి గుడ్డు పెట్ట‌డం వ‌ల్ల లాభ‌మే కానీ న‌ష్టం లేదు. ఇదేదీ గ‌మ‌నించ‌ని గ‌రిక‌పాటి.. ఆయ‌న  ఇష్టాను సారం మాట్లాడ్డం త‌గ‌ద‌ని అంటున్నారంతా.

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తిని చదువుకునే పేద విద్యార్థులను శోభనం పెళ్లి కొడుకులతో పోలుస్తూ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ పలువురు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పలు ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. గరికపాటి తక్షణం తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

By
en-us Political News

  
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
2026 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. సెక్షన్ 87A కింద రిబేట్ కలిపి.. వీరికి వెస‌లుబాటు ఉంటుంది. స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ విష‌యానికి వ‌స్తే.. జీత‌భ‌త్యాలు పొందేవారికి ఇచ్చే స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ ప్ర‌యోజ‌నాలు ఈ కొత్త విధానంలో కూడా కొన‌సాగుతాయి.
సుమారు వెయ్యి కోట్ల సామ్రాజ్యాన్ని ఆయ‌న త‌న కుమారుడు గౌత‌మ్ సింఘానియాకు రాసిచ్చాక‌.. ప‌డ్డ పాట్లు వ‌ర్ణ‌నాతీతంగా వ‌ర్ణించారు ముఖ్య‌మంత్రి.
నారా లోకేశ్ రేపోమాపో పూర్తిస్థాయిలో చంద్రబాబునాయుడి రోల్ పోషించే పరిస్థితి లేకపోయినా, యువనేత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి గ్రౌండ్ ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. లోకేశ్ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయించడానికి నారా, నందమూరి కుటుంబాలతో చంద్రబాబు అతిత్వరలో సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్ కూతురు విద్యారాణి తండ్రి అంత సంపాదిస్తే చందాలేసుకుని మ‌రీ చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్లాల్సిన దుస్థితి ఏంటి?
అమరావతికి, అక్కడి ప్రజలకు వైసీపీ ఎన్నడూ వ్యతిరేకం కాదంటూ మాట్లాడారు. గతంలో తాము వ్యతిరేకించినది చంద్రబాబు నాయుడు చూపించిన గ్రాఫిక్స్ రాజధానే అంటూ సన్నాయినొక్కులు నొక్కారు. అప్పట్లో చంద్రబాబు చేసిన ఊహాజనిత సృష్టినే తాము వ్యతిరేకించామనీ, గ్రాఫిక్స్ అమరావతిపైనే అప్పటి తమ అభ్యంతరాలనీ చెప్పుకొచ్చారు.
మడమ తిప్పను, మాట తప్పను, విశ్వసనీయతకు నిలువెత్తు రూపం అంటూ గతంలో పదేపదే చెప్పుకున్న జగన్ ఇప్పుడు.. నిత్యం అసత్యాలను వల్లెవేస్తూ.. విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారంటున్నారు.
గ‌త ఎన్నిక‌ల్లో అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌వితను అరెస్టు చేయ‌కుంటే ఈ రెండు పార్టీల మ‌ధ్య లోపాయికారీ ఒప్పందం ఉన్న‌ట్టేనని జ‌నం అనుకుంటారని అన్నారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి. ఈ కామెంట్ ఎంత‌గా ప‌ని చేసిందంటే రేసులో సెకండ్ ప్లేస్ లో ఉన్న‌.. బీజేపీని థ‌ర్డ్ ప్లేస్ లో ప‌డేసింది. చావుతప్పి క‌న్ను లొట్ట‌బోయిన‌ట్టు.. బొటాబొటిగా 8 మంది ఎమ్మెల్యేల‌తో స‌రిపెట్టుకుంది బీజేపీ.
పెరిగిన జనాభాకు అనుగుణంగా అసెంబ్లీ, లోక్ సభ స్థానాలను పెంచాలన్న డిమాండ్, ప్రతిపాదనా చాలా కాలంగా ఉంది. అంతే కాకుండా నియోజ‌క‌వ‌ర్గం ఎంత చిన్న‌గా ఉంటే.. ప్ర‌జా ప్ర‌తినిధులు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అంత వేగంగా ప‌రిష్క‌రించ‌గ‌లుగుతారు. ఇక ప్రస్తత నియోజకవర్గాల పెంపు ప్రతిపాదన దాదాపు 30శాతం ఉంది. ఇది భారీ మార్పు అనే చెప్పాలి. అలాగే ఇందు కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఆ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది.
ప్రధాన ప్రతిపక్షం అయ్యుండీ ఎన్నికల సన్నాహాల విషయంలో ఇంత నిర్లప్తంగా, నిరాసక్తంగా వ్యవహరించడంతో పార్టీ క్యాడర్ లో అయోమయం నెలకొంది. ఎన్నికలంటేనే స్టార్ క్యాంపెయినర్ల పర్యటనలు, అగ్రనేతల ప్రసంగాలతో నానా హడావుడీ చేసే కాంగ్రెస్ లో ప్రస్తుతం నమ్మశక్యంకాని నిశ్శబ్ధం తాండవిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.