గంటా శ్రీనివాసరావు.. ఈ సారి పోటీ ఎక్కడ నుంచంటే?

Publish Date:Feb 21, 2024

Advertisement

గంటా శ్రీనివాసరావు.. ఆయన రాజకీయ ప్రస్థానం విలక్షణం. ఆయనకు ఇప్పటి వరకూ ఓటమి అన్నదే తెలియదు. అయితే అందులోనూ ఓ ప్రత్యేకత ఉంది. అదేమిటంటే.. ఓ సారి గెలిచిన నియోజకవర్గం నుంచి ఆయన మరో సారి నిలబడిన దాఖలాలు లేవు. ప్రతి ఎన్నికలోనూ నియోజకవర్గం మారుతుంటారు. అది ఆయన అభీష్ఠమా, పార్టీ నిర్ణయమా అన్నది పక్కన పెడితే నియోజకవర్గం మారినా సరే ఆయన విజయం మాత్రం సాధిస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు వచ్చే ఎన్నికలలో గంటా శ్రీనివాసరావు ఎక్కడ నుంచి పోటీ చేయనున్నారన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది. 

ఆయన తొలి సారి  1999లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా  అనకాపల్లి నియోజకవర్గం లోక్ సభకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచీ ఆయన ఏ పార్టీలో ఉన్నా గెలుస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకూ ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతే కాదు ఒకసారి పోటీ చేసిన నియోజకవర్గం నుంచి ఆయన రెండో సారి పోటీ చేసిన చరిత్ర ఇప్పటి వరకూ లేదు. 1999లో అనకాపల్లి నుంచి విజయం సాధించిన గంటా  2004 ఎన్నికలలో చోడవరం నియోజకవర్గం నుంచి  అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇక  2009లో ప్రజారాజ్యంలో చేరిన గంటా ఆ పార్టీ అభ్యర్థిగా   అనకాపల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు.  ఆ తరువాత ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం అయ్యింది. అప్పుడు ఆయన ఆయన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు.  రాష్ట్ర విభజన తరువాత ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేసి  తెలుగుదేశం పార్టీ గూటికి చేరారు. 2014లో తెలుగుదేశం  అభ్యర్థిగా భీమిలి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పని చేశారు.    ఇక 2019లో గంటా శ్రీనివాసరావు మళ్లీ నియోజకవర్గం మారారు. ఈ సారి విశాఖ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేం అభ్యర్థిగా బరిలోకి దిగిన గంటా శ్రీనివాసరావు జగన్ హవాలో కూడా విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలు కావడంతో ఆయన పొలిటికల్ గా ఇన్ యాక్టివ్ అయ్యారు. ఒక దశలో ఆయన వైసీపీలో చేరుతారన్న ప్రచారం కూడా జరిగింది. ఏది ఏమైతేనేం తెలుగుదేశం పరాజయం తరువాత ఇటీవలి కాలం వరకూ గంటా శ్రీనివాసరావు రాజకీయంగా పెద్ద క్రియాశీలంగా లేరు.   అయితే గత కొంత కాలం నుంచీ ఆయన చురుకుగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ వైఫల్యాలను తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ వస్తున్నారు. ఇటీవలే గతంలో ఆయన చేసిన రాజీనామాను స్పీకర్  తమ్మినేని సీతారాం అమోదించడంతో ఆయన మాజీ ఎమ్మెల్యే అయ్యారు. 

ఇక ఇప్పుడు గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం అభ్యర్థిగా 2024 ఎన్నికలలో పోటీ చేయడం ఖాయమే. అయితే ఏ నియోజకర్గం నుంచి ఆయన బరిలోకి దిగుతారన్నదే అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. విశాఖ నార్త్ నుంచి ఆయన పోటీ చేసే అవకాశాలు లేవన్నది సుప్పష్టం. అయితే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న ప్రశ్నకు మాత్రం పలు నియోజకవర్గాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. మాడుగుల నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ, తెలుగుదేశం అధినేత వ్యూహాలు వేరేగా ఉన్నాయని అంటున్నారు. ఈ సారి ఆయనను విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అపజయమెరుగని నేతగా ఉన్న గంటాకు చీపురుపల్లి నిజమైన పరీక్షగా పరిశీలకలు విశ్లేషిస్తున్నారు. విజయనగరం జిల్లాలో ప్రస్తుత మంత్రి బొత్స సత్యనారాయణకు ఉన్న పట్టు సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన తరువాత 2014లో జరిగిన ఎన్నికలలో చీపురుపల్లి నుంచి బొత్స పరాజయం పాలయ్యారు.

ఆ తరువాత వైసీపీ అభ్యర్థిగా అదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి విజయం సాధించి జగన్ కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ సర్కార్ పట్ల ఉన్న తీవ్ర వ్యతిరేకత ఎఫెక్ట్ బొత్సపై కూడా గట్టిగానే ఉందని పలు సర్వేలలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో చీపురుపల్లి నుంచి బలమైన అభ్యర్థిని రంగంలోకి దించితే విజయం ఖాయమనీ,  ఆ బలమైన అభ్యర్థి గంటా శ్రీనివాసరావేననీ చంద్రబాబు భావిస్తున్నారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. పోటీలో దిగితే అపజయమే లేదన్న చరిత్ర ఉన్న గంటా అయితేనే బొత్సకు దీటైన అభ్యర్థి అవుతారని కూడా అంటున్నారు. మొత్తం మీద గంటా పోటీ ఈ సారి ఎక్కడ నుంచి అన్న దానిపై తెలుగుదేశంలోనే కాకుండా రాజకీయవర్గాలలో కూడా ఆసక్తిగా మారింది. 

By
en-us Political News

  
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.