నా స్థాయికి కార్పొరేషన్ చైర్మన్ పదవా నో.. గంటా నిరాసక్తత?

Publish Date:Jan 28, 2026

Advertisement

రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలకు పార్టీ నాయకులకు తెలుగు దేశం కూటమి ప్రభుత్వం పదవులను కేటాయిస్తున్నది. ఇలా దక్కిన పదవులను కొందరు అవకాశంగా భావిస్తుంటే.. కొందరు సీనియర్ నేతలు మాత్రం ఆ పదవులను నిరాకరిస్తున్నారు. అలా ప్రభుత్వం ఇచ్చిన పదవి వద్దంటున్న వారిలో తెలుగుదేశం సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఒకరు.  తాజాగా ఎకనామికల్ రీజనల్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ గా క్యాబినెట్ హోదా ఉన్న పదవిని గంటా శ్రీనివాసరావుకు ఇవ్వాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ పదవి పట్ల గంటా ఏ మాత్రం సంతోషంగా లేరని తెలుస్తోంది. వాస్తవానికి ఆయన చంద్రబాబు కేబినెట్ లో స్థానం కోసం పోటీ పడ్డారు.  అయితే కూటమి సర్దుబాట్ల కారణంగా గంటాకు అవకాశం దక్కలేదు. ముఖ్యంగా   ఉమ్మడి విశాఖ జిల్లా  సామాజిక సమీకరణాలు, మహిళలకు ప్రాధాన్యత వంటి అంశాలతో  వంగలపూడి అనితకు మంత్రి పదవి ఇచ్చారు.

అలాగే పార్టీ ఆవిర్భావం నుంచి సేవలు అందిస్తున్న చింతకాయల అయ్యన్నపాత్రుడు కి స్పీకర్ పదవి దక్కింది.   పల్లా శ్రీనివాసరావుకు  అధ్యక్ష పదవి దక్కింది. సామాజిక సమీకరణాలు, మహిళలకు ప్రాధా న్యత లక్ష్యంగా ఈ కేటాయింపులు జరిగాయి. అయితే గంటాకు మంత్రిపదవి దక్కకపోవడం పట్ల ఆయనతో పాటు ఆయన వర్గం కూడా ఒకింత అసంతృప్తితో ఉందని రాజకీయవర్గాలలో ఓ చ ర్చ అయితే జరుగుతోంది.  ఇక గంటా తన ఆశలన్నీ మంత్రివర్గ విస్తరణపై పెట్టుకున్నారని అంటున్నారు. విస్తరణ జరిగితే తనకు కచ్చితంగా కేబినెట్ లో స్థానం దక్కుతుందని ఆయన భావిస్తూ వచ్చారు. అయితే ఇప్పట్లో క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశాలు లేకపోవడంతో  ఆశావహులకు కొన్ని కార్పొరేషన్ చైర్మన్లు ఇతర పదవులు కేటాయించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ దశలో గంటా శ్రీనివాసరావుకు ఒక క్యాబినెట్ హోదాతో  పదవి ఇవ్వాలని భావించినట్లు తెలుస్తోంది. అయితే ఆ పదవి తీసుకోవడానికి గంటా శ్రీనివాసరావు సుముఖంగా లేరని అంటున్నారు.

 రాజకీయాల్లో దాదాపు 27 సంవత్సరాలుగా నిరాఘాటంగా చట్టసభల్లో కొనసాగుతున్న గంటా శ్రీనివాసరావు..  1999లో అనకాపల్లి ఎంపీగా అరంగ్రేటం చేశారు. ఆ తరువాత ఆయన   చోడవరం భీమిలి.. అనకాపల్లి, విశాఖ నార్త్... ప్రస్తుతం భీమిలి ఎమ్మెల్యే గా కొనసాగుతున్నారు.  అలాగే   గతంలో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనూ, ఆపై చంద్రబాబు నాయుడు హయాంలోనూ కూడా గంటా మంత్రిగా పని చేశారు.ఈ నేపథ్యంలోనే  ఒక కార్పొరేషన్   చైర్మన్ పదవి తన కు తగదని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు.  

 ఇలా ఉండగా, గంటా శ్రీనివాసరావు తో పాటు ఇతరుల కు ఇచ్చే పదవులపై   ప్రభుత్వం వ్యూహాత్మకంగా  లీకులు వదిలినట్టు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ లీకుల ద్వారా  ఆయా నేతల మనోభావాలను గుర్తించి తదనుగుణంగా నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే గంటా శ్రీనివాసరావు విషయంలో  చేసినట్లు చెబుతున్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ అయిన తన స్థాయికి కార్పొరేషన్ చైర్మన్ పదవి సరికాదని గంటా భావిస్తున్నట్లు చెబుతున్నారు.  

By
en-us Political News

  
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫ‌కేష‌న్ జారీ చేయ‌గానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయ‌కుడు, మాజీ హోం మంత్రి మ‌హ‌మూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ త‌ర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవ‌రిని ఎమ్మెల్సీ చేయాల‌ని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం న‌రేంద‌ర్ రెడ్డి.. నేడు ఆయ‌న రాజ‌కీయ స‌ల‌హాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్ద‌ల స‌భ‌లోకి స‌గ‌ర్వంగా అడుగు పెడుతున్నారు.
సీట్ల సర్దుబాటుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోనులో మాట్లాడినట్టు తెలిసింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకేతో కూటిమిలో భాగంగా 30 సీట్లకు తగ్గేది లేదని కాంగ్రెస్ ఇంత వరకూ పట్టుబడుతూ వచ్చింది. దీంతో సీట్ల పంపకాలపై పరిష్కారానికి డీఎంకేతో సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయాన్నికేంద్ర హోంమంత్రికి వివరించిన సీఎం రేవంత్.. వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణ, పరిశ్రమల వృద్ధి దృష్ట్యా రాష్ట్రానికి మరిన్ని ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని, తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచాలని కోరారు.
సంక్రాంతి సంబరాలు నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఈ రెండు వర్గాల మధ్యా పోటీ కొనసాగుతున్నది. సీతం రాజు సుధాకర్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ముగ్గుల పోటీ నిర్వహిస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కనకమాలక్ష్మి ఆలయం వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇది ఒక్కటే కాదు, కార్పొరేషన్ పదవుల విషయంలో కూడా తలో దిక్కు అడుగులు వేస్తున్నారు.
కొద్దికాలం కిందట శరద్ పవార్ తాను రాజ్యసభకు పోటీ చేసే ప్రశక్తే లేదని ప్రకటించారు. అయితే ఇటీవల ఆయన అన్న కొడుకు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.
తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిణామాలపై ఆసక్తికర చర్చ జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం (మార్చి 2) దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సమర్పించే విషయంలో కొలికపూడి దురుసుగా వ్యవహరించారు. నెమలి వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఆలయ మర్యాదల ప్రకారం, ప్రోటోకాల్ అనుసరించి అధికారులు స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందించారు.
వాస్తవానికి మల్లు భట్టి విక్రమార్క్ జగన్ ను తన కుమారుడి వివాహానికి జనగ్ ను బెంగళూరు వెళ్లి ఆహ్వానించాల్సి ఉంది. అయితే జగన్ స్వయంగా తాను మంగళవారం తాడేపల్లి వస్తాననీ, అప్పుడు ఆహ్వానిస్తే సరిపోతుందనీ కబురు పంపారు.
ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే మండలి సభ్యత్వానికి వారు చేసిన రాజీనామాలను చైర్మన్ ఇప్పటి వరకూ ఆమోదించలేదు.
మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.