గాంధీజి చేసిన ఈ ఉద్యమాలు చూసి బ్రిటీష్ ప్రభుత్వం భయపడిందట..!

Publish Date:Oct 2, 2024

Advertisement

 

 


మహాత్మాగాంధీ పేరు చెప్పగానే చిన్న పిల్లలు కూడా జాతిపిత అని పిలుస్తారు. గాంధీ ఫొటో కానీ గాంధీ గురించి ఉపన్యాసం కానీ లేకుండా ఏ జాతీయ పండుగ ముగియదు. ఇక అక్టోబర్ 2న వచ్చే గాంధీ జయంతిని జరుపుకోవడం తప్పనిసరి.  అయితే మహాత్మా గాంధీ స్వాతంత్ర్యం కోసం చేసిన 40 ఏళ్ల పోరాటంలో బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు ప్రధాన ఉద్యమాలకు న్యాయకత్వం వహించారు. ఈ ఉద్యమాలు బ్రిటీష్ పాలకులను, బ్రిటీష్ ప్రభుత్వాలను భయపెట్టడమే కాకుండా భారతదేశంలో పెనుమార్పులకు కారణమయ్యాయి. భారత స్వాతంత్ర్య ఉద్యమానలు బలోపేతం చేసిన ఈ ఉద్యమాలు ఏంటంటే..

సత్యాగ్రహం..

1906 సంవత్సరంలో దక్షిణాఫ్రికాలో బ్రిటీష్ ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షా పూరిత విధానాలకు వ్యతిరేకంగా గాంధీజి సత్యాగ్రహాన్ని ప్రారంభించారు.

చంపారన్ ఉద్యమం..

1917లో బీహార్ లోని చంపారన్ రైతుల దోపిడీకి, నీలిమందు విధానానికి వ్యతిరేకంగా చంపారన్ ఉద్యమాన్ని చేపట్టారు.

ఖేడా సత్యాగ్రహం..

1918లో బ్రిటీష్ ప్రభుత్వం పన్ను వసూలుకు వ్యతిరేకంగా గుజరాజ్ లో గాంధీజి రైతుల ఉద్యమానికి న్యాయకత్వం వహించారు. దీన్నే ఖేడా సత్యాగ్రహం అంటారు.

స్వదేశీ ఉద్యమం..

గాంధీజి స్వదేశీ ఉద్యమాన్ని చేపట్టి దేశంలో తయారైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలని విదేశీ వస్తువులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఇది 1920 లో జరిగింది.

సహాయ నిరాకరణ ఉద్యమం..

1920-22 సంవత్సరాలలో మహాత్మా గాంధీ బ్రిటీష్ పాలన నుండి భారతదేశం స్వాతంత్ర్యం పొందడానికి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు.

చౌరీ చౌరా..

1922లో చౌరీచౌరా హింసాత్మక సంఘటన చోటుచేసుకుంది.  దీని కారణంగా గాంధీజి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ముగించారు.

ఉప్పు సత్యాగ్రహం..

1930లో బ్రిటీష్ ప్రభుత్వం ఉప్పు పన్ను విధించింది.  దీనికి వ్యతిరేకంగా గాంధీజి దండిలో పాదయాత్ర చేసి ఉప్పు తయారు చేసి చట్టాన్ని ఉల్లంఘించారు.  

శాసనోల్లంఘన ఉద్యమం..

1930 సంవత్సరంలో బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసంతృప్తిని వ్యక్తం చేయడానికి దాని నిబంధనలను పాటించక పోవడం,  పికెటింగ్ ప్రదర్శన, సమ్మెలు చేయడం వంటివి చేశారు. ఇవన్నీ శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా జరిగాయి.

దళిత ఉద్యమం..

మహాత్మా గాంధీ దేశంలో కుల వివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా దళిత ఉద్యమాన్ని 1933లో చేపట్టారు.

క్విట్ ఇండియా..

1942లో బ్రిటీష్ పాలనను అంతం చేసి భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వాలని గాంధీజి 1942 ఆగస్టు నెలలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు.


                                                 *రూపశ్రీ.
 

By
en-us Political News

  
ఈ కాలంలో మందు బిళ్లలు మింగకుండా ఒక్కరు కూడా ఉండటం లేదు.  పాపం చిన్న పిల్లలు సైతం  టాబ్లెట్లు మింగాల్సిన పరిస్థితి వస్తోంది.  చాలా మాత్రల మధ్యలో ఒక సన్నని గీత ఉంటుంది. కొన్ని మాత్రలకు ఇది ఉండదు..
వేసవిలో దాదాపు ప్రతి ఇంట్లోనూ పెరుగు తినడం సర్వసాధారణం. ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, జీర్ణక్రియకు కూడా...
ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో బాగా రాణించాలని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కంటారు. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత ఖర్చు పెడితే....
మానవ శరీరానికి సంక్రమించే జబ్బులలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో హీమోఫిలియా జబ్బు కూడా ఒకటి. చాలా మందికి హీమోఫిలియా అనే జబ్బు..
పెళ్లి అనేది ప్రతి అమ్మాయి జీవితాన్ని మరొక దశలోకి తీసుకుని వెళుతుంది. ఎన్నో ఆశలతో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లో అడుగుపెడతారు అమ్మాయిలు. కానీ చాలామంది అమ్మాయిలు చెప్పే మాట.. అత్తగారు సరిగా చూసుకోవడం లేదని, అత్తగారు సరిగా మాట్లాడటం లేదని. ప్రతి ఇంట్లో అత్తాకోడళ్ల సంబంధం ఎప్పుడూ...
జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం కోసం తహతహలాడుతూ ఉంటారు.  అందుకోసం చాలా ప్రయత్నాలు కూడా చేస్తుంటారు...
ప్రతి వ్యక్తికి విభిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది; కొందరు చాలా కలివిడిగా ఉంటారు, మరికొందరు నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటారు. ఈ వ్యత్యాసం ఆధారంగా ఇంట్రోవర్ట్,  ఎక్స్ట్రోవర్ట్ అంటూ రెండు విభాగాలుగా విభజిస్తూ ఉంటారు...
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త , గొప్ప ఆర్థికవేత్త అయిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జయంతి...
ఆశా భోస్లే.. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర.  ఆమె గాత్రం కేవలం భారతదేశాన్నే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు సోదరి అయినా.. పాటల ప్రపంచంలో..
సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. నేటి బిజీ బిజీ జీవితాలలో మనస్ఫూర్తిగా,  సంతోషంగా గడిపిన క్షణాలు వెతుక్కోవాల్సి వస్తోంది. అందరూ ఉద్యోగాలు చేస్తారు,  వ్యాపారాలు చేస్తారు, సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు....
ప్రపంచంలో అన్ని రకాల మనుషులు  ఉంటారు.  మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులను లేదా మన చుట్టూ ఉండే గొప్ప వ్యక్తులు లేదా శక్తివంతమైన వ్యక్తులను గమనిస్తే...
విజయం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యంగా ఉంటుంది.  చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ప్రతి విషయంలో ఒక లక్ష్యం పెట్టుకుని,  దాన్ని సాధించి,  విజయ బావుటా ఎగరవేయాలని అనుకుంటారు చాలా మంది...
మంచి, చెడు ప్రతి మనిషిలోనూ తప్పకుండా ఉండే గుణాలు.  మనుషులు కొన్ని విషయాల్లో మంచిగా, మరికొన్ని విషయాల్లో చెడ్డగా ఉంటారు. పూర్తీగా మంచితనం ఉన్న మనుషులు, పూర్తీగా చెడ్డగా ఉన్న మనుషులు ఎక్కడా ఉండరు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.