గడ్కరీకి కాంగ్రెస్ బంపర్ ఆఫర్.. ఆయనేమన్నారంటే?

Publish Date:Jun 17, 2023

Advertisement

కేంద్ర  రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీకి  విలక్షణ రాజకీయ నాయకునిగా పేరుంది. ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గంలో ప్రతిపక్షాలు సైతం వేలెత్తి చూపని, చూపలేని మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క గడ్కరీనే. కేంద్ర కేబినెట్ లో స్వతంత్రంగా , స్వేచ్ఛగా వ్యవహరించే మంత్రి ఎవరంటే వినిపించే మొదటి, ఏకైక పేరు గడ్కరీదే.  

అంతే కాదు ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలనలో  దేశం ఏమి సాదించింది అంటే  ముందుగా చెప్పేది, చెప్పుకునేది మౌలిక సదుపాయాల కల్పన గురించే . అందులోనూ గడ్కరీ నేతృత్వంలో అత్యంత వేగంగా సాగుతున్న  జాతీయ, గ్రామీణ రోడ్ల నిర్మాణం గురించే ముందుగా చెప్పుకోవడం జరుగుతుంది. అందుకే పార్లమెంట్ లోపలా, బయటా కూడా ప్రతిపక్ష పార్టీలు గడ్కరీ వైపు వేలెత్తి చూపే సాహసం చేయవు. అంతే కాదు  మోదీ ప్రభుత్వాన్ని అడ్డు అదుపు లేకుండా విమర్శించే కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా పార్టీ  మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సైతం ఒకటి రెండు సందర్భాలలో లోక్ సభలో గడ్గరీని మెచ్చుకున్నారు. ఆయనను అభినందించారు. అలాగే ఇతర ప్రతిపక్ష నాయకులు కూడా  బీజేపీని, మోడీని విమర్శించినంతగా గడ్కరీని విమర్శించే సాహసం చేయరు.   

అలాగే  గడ్కరీ మీడియా సమావేశాల్లో ప్రవర్తించే తీరు కూడా భిన్నంగానే ఉంటుంది. ఒకా నొక సందర్భంలో ఆయన బీజేపీ ప్రతిపక్ష పార్టీ పాత్రను పోషించినంత సమర్ధవంతంగా అధికార పార్టీ పాత్రను పోషించేలేక పోతోందని అంగీకరించారు. అంతే కాదు తమ డీఎన్ఏనే అలాంటిందని చమత్కరించారు. 
అలాగే ఇప్పుడు గడ్గరీ మరో సంచలన ప్రకటన చేశారు.. కాంగ్రెస్ పార్టీ నుంచి తనకో బంపర్ ఆఫర్ వచ్చిందని చెప్పుకొచ్చారు. అయితే ఆ ఆఫర్‌ను తిరస్కరించిన నితిన్ గడ్కరీ.. సదరు నేతకు తన దైన శైలిలో సమాధానం ఇచ్చినట్లు గుర్తు చేసుకున్నారు. అయితే అది ఇప్పటి విషయం కాదు. గతంలో ఎప్పుడో  కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్రకు చెందిన దివంగత శ్రీకాంత్ జిచ్‌కార్ ఓసారి తనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్లు గడ్కరీ గుర్తుచేసుకున్నారు. శ్రీకాంత్ జిచ్‌కార్ తనను కాంగ్రెస్ పార్టీలో చేరాలని సూచించినట్లు చెప్పారు.

పార్టీ కోసం చాలా కష్టపడతానని తనను పొగిడాడనీ,  తాను మంచి కార్యకర్తే కాకుండా మంచి నాయకుడిని అని చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. ఇలాంటి నాయకుడు కాంగ్రెస్‌ పార్టీలో ఉంటే,  మంచి భవిష్యత్ ఉంటుందని సూచించినట్లు చెప్పారు. అయితే తాను ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు నితిన్ గడ్కరీ వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరడం కంటే బావిలో దూకడం చాలా బెటర్ అని శ్రీకాంత్ జిచ్‌కార్‌కు సమాధానం ఇచ్చినట్లు తెలిపారు.

ఎందుకంటే తనకు బీజేపీపై, బీజేపీ ఐడియాలజీపై   సంపూర్ణ విశ్వాసం ఉందనీ.. అందు కోసమే తన పార్టీ కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. ఇదే సమయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్‌కు విద్యార్థి విభాగమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో ఉన్నపుడు తనకు విలువలు నేర్పించినందుకు ఆర్ఎస్ఎస్‌పై పొగడ్తలు కురిపించారు.

అదే సమయంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. హస్తం పార్టీ ఏర్పాటు అయినప్పటి నుంచి చాలా సార్లు చీలిపోయిందని ఆరోపించారు. మనం మన దేశ ప్రజాస్వామ్య చరిత్రను మరిచిపోకూడదనీ, మెరుగైన భవిష్యత్ కోసం గతం నుంచి నేర్చుకోవాలని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో గరీబీ హటావో (పేదరిక నిర్మూలన) అనే నినాదాన్ని ఇచ్చిందని.. కానీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం విద్యా సంస్థలను ఏర్పాటు చేసిందని విమర్శించారు. ఇదే సమయంలో గడ్కరీ ... ప్రధాని మోడీతో తనకు విభేదాలు ఉన్నట్లు వస్తున్న వార్తలకు సమాధానం చెప్పారు.

భారత్‌ను ఆర్థికంగా ప్రపంచంలోనే సూపర్‌పవర్‌గా మార్చాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న ప్రయత్నాలను నితిన్ గడ్కరీ ప్రశంసించారు. మోడీ నేతృత్వంలో దేశ భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉంటుందన్నారు. 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్‌ చేసిన పనుల కన్నా.. అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్లలో బీజేపీ ప్రభుత్వం రెట్టింపు చేసిందన్నారు. ఏమైనా  బీజేపీ జాతీయ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన గడ్కరీ ... ఎదో ఒక రోజున దేశ ప్రధాని అయినా ఆశ్చర్య పోనవసరం లేదని బీజేపీ నేతలు  కొందరు గట్టిగా విశ్వసిస్తారు.

By
en-us Political News

  
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.