వారణాసికి నిధుల వరద!

Publish Date:Jan 13, 2023

Advertisement

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నది పాత సామెత ... మోడీ తలచుకుంటే డబ్బులకు కొదవా అన్నది నేటి సామెత. అవును, ప్రధాన మంత్రి  నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజక వర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూస్తే ఎవరైనా ఇదే అంటారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్రంలో ముఖ్యంగా వారణాసిలో ఎన్ని వందల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు మోడీ శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారో లెక్క లేదు... అలాగే ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మోడీ స్వరాష్ట్రం గుజరాత్ కు ఇరుగు పొరుగు రాష్రాలు ఈర్ష్య పడేలా నిధుల వరద పారింది. దీనిపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు పలు సందర్భాలలో విమర్శలు చేశారు. 

అదలా ఉంటే   ఇప్పడు, ఈ రోజు  ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచంలోనే అతి పొడవైన నదీ విహార యాత్ర రివర్ క్రూయిజ్ఎంవీ గంగా విలాస్ ను వారణాసి లోని టెంట్ సిటీలో  ప్రారంభించారు. అంతే కాదు పనిలో పనిగా వెయ్యి కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన ఇతర అంతర జల మార్గాల ప్రాజెక్టులకు కూడా ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం జల మార్గాల్లో చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టుల వల్ల రవాణ, వాణిజ్య, పర్యాటకం పెరుగుతుందని అన్నారు.

ఈ ప్రాజెక్టు వల్ల తూర్పు ప్రాంతం దేశానికి వృద్ధి చోధకంగా దోహదపడుతుందని అన్నారు. దీనిని దేశంలో మౌలిక సదుపాయాల పరివర్తన దశాబ్దంగా పేర్కొన్నారు.  గంగా విలాస్ యాత్ర తేలికైన యాత్ర కాదని మన దేశంలో అంతర జల మార్గాల అభివృద్ధికి ఒక ఉదాహారణ అని చెప్పారు. గతంలో అంతర్ జల మార్గాల రంగంలో అసాధారణ  అభివృద్ధి గురించి నరేంద్రమోదీ మాట్లాడుతూ... 2014 లో దేశంలో కేవలం 5 అంతర్ జల మార్గాలు మాత్రమే ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 111 కు పెరిగిందరీ, జల మార్గాల రవాణా మూడు రెట్లు పెరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా గంగా విలాస్ లో విహార యాత్ర చేస్తున్న స్విట్జర్లాండ్ పర్యాటకులకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.  ఎంవీ గంగా విలాస్ – ఈరోజు వారణాసి నుంచి బయలుదేరి 51 రోజుల్లో సుమారు 3 వేల 2 వందల కిలో మీటర్లు ప్రయాణించి, బంగ్లాదేశ్ మీదుగా అస్సాంలోని దిబ్రూఘర్ కు చేరుకుంటుంది. ఈ పడవలో విలాసవంతమైన 18 గదులున్నాయి. 36 మంది పర్యాటకులు విహారం చేయవచ్చు. నేషనల్ పార్కులు, నదీ ఘాట్లు, పాట్నా నగరం, జార్ఖండ్ లోని షాహిబ్ గంజ్, పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతా, బంగ్లాదేశ్ లోని ఢాకా, అస్సాంలోని గౌహతిలను ఈ పర్యాటకులు సందర్శించవచ్చు.

గంగా నది ఒడ్డున టెంట్ సిటికి కూడా ప్రధానమంత్రి ప్రారంభోత్సవం చేశారు.  ప్రధానమంత్రి పశ్చిమ బెంగాల్ లోని పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేస్తారు.
కాగా, ఇంతవరకు దేశంలో ఇలాంటి ప్రయోగం జరగ లేదు, ఇదే తొలి ప్రయత్నం. కాగా, భారతదేశ మొట్ట మొదటి నదీ పర్యాటక నౌక,  గంగా, బ్రహ్మపుత్ర  నదుల మీదుగా 3,200 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ లగ్జరీ నౌకకు మరో ప్రత్యేకత కూడా వుంది. ప్రపంచంలోనే అతిపెద్ద నదీ పర్యటక నౌకగా కూడా ‘ఎంవీ గంగా విలాస్‌’ చరిత్ర సృష్టించింది. ఈ నౌకలో ప్రయాణికుల కోసం అత్యాధునిక సౌకర్యాలతో పాటు సూట్‌ గదులు, స్పా, జిమ్‌ సెంటర్లు, ఫ్రెంచ్ బాల్కనీలు, ఎల్ఈడీ టీవీలు, సేఫ్‌లు, స్మోక్ డిటెక్టర్లు, కన్వర్టిబుల్ బెడ్లు వంటివి కూడా ఉన్నాయి.

ఈ రోజే (జనవరి 13) 51 రోజుల తోలి పర్యటనను వారణాసి నుంచి ప్రారంభించనున్న ఎంవీ గంగా విలాస్ .. భారత్‌లోని ఐదు రాష్ట్రాలను, బంగ్లాలోని కొన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ మొత్తం 3,200 కి.మీ దూరం ప్రయాణించి దిబ్రూఘర్ చేరుకుంటుంది. అంతేకాక 27 నదీ వ్యవస్థల మీదుగా ఈ నౌక ప్రయాణించనుంది. ఇక ఈ నౌక తన మొదటి పర్యటనలో భాగంగా ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, జాతీయ ఉద్యానవనాలు, నదీ ఘాట్‌లు, బీహార్‌లోని పాట్నా, జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, బంగ్లాదేశ్‌లోని ఢాకా, అస్సాంలోని గువాహతి వంటి ప్రధాన నగరాలతో సహా 50 పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తుంది. ఎంవీ గంగా విలాస్ తన తొలి ప్రయాణంలో స్విట్జర్లాండ్‌కు చెందిన 32 మంది పర్యాటకులను తీసుకెళ్లనుంది. అయితే,  ఈ నౌక అందరికీ అందుబాటులో ఉండదు ..ఎందుకంటే ..ఒక్కో ప్రయాణికుడికి రోజుకు దాదాపు రూ.25వేలు  చార్జి అవుతుంది. అంటే ఈ యాత్ర మొత్తానికి ఒక్కొక్కరికీ రూ.12.75లక్షల ఖర్చవుతుంది. 

అదలా ఉంటే సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ రివర్ క్రూయిజ్ ఏమ్వీ  గంగా విలాస్, వల్ల సామాన్య ప్రజలకు మేలు జరగదని విమర్శించారు.నరేంద్ర మోడీ ప్రభుత్వ ఏకైక ఉద్దేశ్యం మతపరమైన ప్రదేశాలను పర్యాటక ప్రదేశాలుగా మార్చడం ద్వారా డబ్బు సంపాదించడం మాత్రమే అని యాదవ్ అన్నారు.

ప్రజలు తమ జీవితపు చివరి దశలో లేదా ఆధ్యాత్మికత కోసం వారణాసిని సందర్శిస్తారు మరియు జ్ఞానాన్ని పొందుతారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారా డబ్బు సంపాదించడం కోసం బిజెపి ఈ ఏర్పాటు (అక్కడ) చేస్తోంది" అని యాదవ్ చెప్పినట్లు వార్తా సంస్థ పిటిఐ పేర్కొంది.

By
en-us Political News

  
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్‌ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్‌ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‍కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు. ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.